India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, హోంమంత్రి అనిత గుర్ల గ్రామంలో గురువారం పర్యటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గుర్లలో డయేరియా కేసులు నమోదైన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందన్నారు. ఒకరు మాత్రమే డయేరియాతో మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారని ఆమె పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామంలో పర్యటించి.. వాటర్ టెస్ట్ చేయించారని అన్నారు.
గుర్ల పర్యటనలో భాగంగా మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ తరుణంలో పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులు కనీసం కోఆపరేట్ చేసే పరిస్థితి కూడా లేకపోతే.. ప్రతి నాయకుడు వచ్చినపుడు మీడియాను అడ్రస్ చేసే పరిస్థితిని కూడా పోలీసులు ఇవ్వకపోతే. ఆ మేరకు కూడా పోలీసులు భద్రత క్రియేట్ చేయలేకపోలే.. ఇక ఏ రకంగా పోలీసులు పనిచేస్తున్నారో అని అడగాలో అర్థం కావడం లేదు’ అని అన్నారు.
గుర్లలో మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వైరల్గా మారింది. జగన్కు స్వాగతం పలుకుతూ ఆయన అభిమానులు పలు కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఓ కూడలిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసురావు పేరు కింద ‘విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు’ అని రాసి ఉంది. రాష్ట్ర అధ్యక్షులు అని రాసి ఉండటంతో పలువురు వైరల్ చేస్తున్నారు.
జిల్లాకు తుపాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట మరి కొద్ది రోజుల్లో చేతికి వస్తుండగా.. ఈదురుగాళ్లు ఏం చేస్తాయో అని విచారం వ్యక్తం చేస్తున్నారు. అధిక వడ్డీలతో రుణాలు తీసుకొచ్చి పంటపై పెట్టుబడి పెట్టామని కన్నీటి పర్యంతమవుతున్నారు. తుపాన్ ప్రభావంతో ఇప్పటికే వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్ష సూచన కనిపిస్తోంది.
జిల్లాలో హోమ్ మంత్రి అనిత గురువారం పర్యటించనున్నారు. ఇన్ ఛార్జ్ మంత్రి హోదాలో జిల్లాకు ఆమె తొలిసారి విచ్చేస్తున్నారు. మధ్యాహ్నం 1:00 గంటకు నగరానికి చేరుకొని ZP అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడ నుంచి 2:00 గంటలకు గుర్ల పీహెచ్సీ కు వెళ్లి డయేరియా రోగులను పరామర్శిస్తారు. మధ్యాహ్నం 3:20 కు కలెక్టరేట్ కు చేరుకొని వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరుపుతారు. అనంతరం జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశం అవుతారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. గుర్లలో డయారియా బాధితులు, మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఉదయం 9:30కు హెలికాప్టర్లో తాడేపల్లి నుంచి బయలుదేరి 11:00 గంటలకు SSR పేట దత్త ఎస్టేట్కు చేరుకుంటారు. 11:25కు గుర్ల చేరుకొని డయారియా బాధితులు, మృతుల కుటుంబాలను పరామర్శిస్తారు. మధ్యాహ్నం 1:00 గంటకు తిరిగి పయనమవుతారు.
విజయనగరం జిల్లాలో నేడు హోం మంత్రి అనిత, వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. ఎన్నికల తర్వాత జగన్, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి అయిన తర్వాత అనిత జిల్లాకు రావడం ఇదే మొదటిసారి. జగన్ ఉదయం 11 గంటలకు గుర్ల డయేరియా బాధితులను పరామర్మించి తిరిగి బెంగళూరు వెళ్లనున్నారు. హోం మంత్రి మధ్యాహ్నం 2 గంటలకు గుర్లలో పర్యటిస్తారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు.
జిల్లా విద్యాశాఖ అధికారి N.ప్రేమ్ కుమార్ ఆదేశాలతో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాంతీయ శిక్షణ కేంద్రం ఫూల్ భాగ్ విజయనగరంలో పాఠశాలల పురుష & మహిళ ఉపాధ్యాయులకు బేసిక్ శిక్షణ కార్యక్రమం 18 నుంచి 24 వరకు జరుగుతుందని బుధవారం తెలిపారు. జిల్లా ఉప విద్యాశాఖ అధికారి కేవీ రమణ స్కౌట్స్ అండ్ గైడ్స్ బేసిక్ కోర్స్ శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 58 మంది శిక్షణ పొందినట్లు తెలిపారు.
పార్వతీపురం జిల్లాలో రక్తహీనతతో ఉండే గర్భిణీలపై, హై రిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యాధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో ఎటువంటి మాతా, శిశు మరణాలు జరగకూడదని, దీనికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్నారు.
>గుర్లలో మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు పర్యటన>జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య పనులు>తీర ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ అంబేడ్కర్>ఉచిత బస్సు ప్రయాణంపై కాంగ్రెస్ పోస్ట్ కార్డు ఉద్యమం>జిల్లాలో హోంమంత్రి అనిత రేపు పర్యటన>తాత్కాలిక బాణసంచా వ్యాపారులకు కీలక సూచనలు>జిల్లాలో రాత్రి 11 తర్వాత తిరిగితే కేసులు నమోదు
Sorry, no posts matched your criteria.