India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి గురువారం విజయనగరం జిల్లాకు రానున్నారు. ఉదయం 11 గంటలకు గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న డయేరియా రోగులను పరామర్శించనున్నారు. డయేరియా మృతుల కుటుంబ సభ్యులతో జగన్ మాట్లాడనున్నారు. జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదేశాలతో స్థానిక వైసీపీ నేతలు గుర్లలోని దత్త ఎస్టేట్ వద్ద హెలీప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు.
అయోధ్యలో నవంబర్ 2 నుంచి నిర్వహించాల్సిన దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగం వాయిదా పడింది. ఈ మేరకు నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యాగాన్ని నవంబర్ 18 నుంచి జనవరి 1 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.
విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 724 కి.మీ. దూరంలో ‘దానా’ తుఫాన్ కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇది క్రమేపి ఒడిశా వైపు కదులుతోందని పేర్కొన్నారు. ఈ ప్రభావంతో వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులకు వేటకు వెళ్లొద్దని, జాగ్రత్తలు పాటించాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
సాంకేతిక కారణాలతో నేడు అలప్పూజ – ధన్బాద్ (13352) ఎక్స్ప్రెస్ రైలు అలప్పుజాలో ఆలస్యంగా బయలుదేరుతుందని వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఈరోజు ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన రైలు 4 గంటలు ఆలస్యంగా ఉదయం 10 గంటలకు బయలుదేరేలా రీ షెడ్యూల్ చేశామన్నారు. ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
విజయనగరం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో తాగునీటి వనరుల క్లోరినేషన్ పై బుధవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ మండల ప్రత్యేక అధికారులను మండల స్థాయి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఉన్న రక్షిత నీటి పథకాల ఓవర్హెడ్ ట్యాంకులు పైప్ లైన్లు తనిఖీ చేయాలని సూచించారు. అయా ట్యాంకులను నిర్ణీత గడువు లోగా శుభ్రం చేస్తున్నది లేనిది తనిఖీ చేయాలన్నారు.
>కనుల పండువగా పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం>చింతపల్లి సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన మృతదేహం>ఎస్.కోట మీదుగా నాలుగు లైన్ల రహదారికి నిధులు విడుదల>గుర్ల డయేరియా ఘటనపై ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సమీక్ష>డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పెంపు>డయేరియా మృతులకు నష్టపరిహారం అందించాలని జడ్పీ ఛైర్మన్ డిమాండ్>కార్తీక మాసంలో పంచరామక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
కొమరాడ మండలం కూనేరు గ్రామంలో ఓ బాలుడు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. స్థానికంగా ఉన్న చర్చికి ఎలుకలు వచ్చి వస్తువులను పాడు చేస్తున్నాయని కడ్రక కృష్ణ అనే వ్యక్తి చర్చి చుట్టూ విద్యుత్ (కంచెను) ఎర్త్ పెట్టాడు. ఆ విషయం తెలియని బాలుడు జిన్నాన అనేష్ (4) ఆడుకుంటూ వెళ్లి ఆ వైర్లను తాకడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలపడంతో కొమరాడ పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.
పెందుర్తి నుంచి శృంగవరపుకోట మీదుగా బౌడారా వరుకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 956.21 కోట్లు మంజూరు చేసిందని విశాఖ ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. ఎన్నికల హామీలో భాగంగా రహదారిని నాలుగు లైన్లగా విస్తరిస్తామని చెప్పామని, భారతమాల పరియోజన పథకం కింద నిధులు విడుదలయ్యాయన్నారు. రహదారి నిర్మాణంతో ప్రయాణం సులభతరం అవుతుందని, పర్యాటక ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఎంపీ అభిప్రాయపడ్డారు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డీఎస్సీ పరీక్షకు సంబంధించి ఉచిత భోజన, వసతితో పాటు మూడు నెలల శిక్షణకు దరఖాస్తుల గడువు పెంచినట్లు సాంఘిక సంక్షేమ, గిరిజన శాఖ జిల్లా ఉపసంచాలకుడు బి.రామానందం తెలిపారు. ఈ నెల 25 వరకు దరఖాస్తుల నమోదుకు గడువు పెంచామని అర్హత గల అభ్యర్థులు వినియోగించుకోవాలని కోరారు. https://jnanabhumi.ap.gov.in ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సిరిమాను ఘట్టం పురస్కరించుకొని తరువాత మంగళవారం కావడంతో దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. భారీ క్యూ లైన్లు ఏర్పడంతో చిన్నపిల్లలతో వస్తున్న వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం పెద్ద చెరువులో తెప్పోత్సవానికి ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.