Vizianagaram

News October 21, 2024

చెత్త తరలించే వాహనంలో పైడితల్లి ఉత్సవ ఏనుగు తరలింపు..!

image

ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం లో ప్రధానమైనది ఎల్ల ఏనుగు రథం. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎల్ల ఏనుగు రథాన్ని పూజించారు. అయితే పండగ అయినా తరువాత తెల్ల ఏనుగు రథంలోని ఏనుగు బొమ్మను చెత్తను తరలించే వాహనంలో తీసుకుని వెళ్లడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. పైడితల్లి ఉత్సవ ఏనుగును చెత్తను తరలించే వాహనంలో తరలించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News October 21, 2024

విజయనగరం జిల్లాకు నేడు పవన్ కళ్యాణ్ రాక

image

విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం పర్యటించనున్నారు. ఉదయం 8:30కు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 9:30కు విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 11:00కు ఎస్ఎస్ఆర్ పేటకు చేరుకొని వాటర్ సోర్స్‌ను పరిశీలిస్తారు. అనంతరం 11:15 నుంచి 11:30 వరుకు గుర్ల పీహెచ్సీని తనిఖీ చేసి, జలజీవన్ పనులు, తాగునీటి సరఫరా విభాగాలను పరిశీలిస్తారు. 12:30 కు కలెక్టరేట్ రివ్యూలో పాల్గొంటారు.

News October 21, 2024

విజయనగరంలో TODAY TOP NEWS

image

> బొబ్బిలికి చెందిన 5నెలల చిన్నారి ధన్షికకు నోబెల్ బుక్ అఫ్ రికార్డ్‌లో చోటు > విజయనగరం జిల్లావ్యాప్తంగా ఆరో రోజు పల్లె పండగ వార్షికోత్సవాలు> గుర్లలో శాసన మండలి విపక్షనేత బొత్స పర్యటన>వైసీపీ తీరుపై మండిపడ్డ మంత్రి శ్రీనివాస్>గుర్లలో రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన>నెల్లిమర్లలో ఆరుగురు పేకాట రాయళ్లు అరెస్ట్ >విజయనగరంలో ముగిసిన డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శన, రూ. 7.20 కోట్ల వ్యాపారం

News October 20, 2024

బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో విషాదం

image

బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు శంబంగి శ్రీరాములు నాయుడు సతీమణి, ప్రస్తుత విశాఖ డైరీ డైరెక్టర్ శంబంగి అమ్మడమ్మ ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆమె అస్వస్థతకు గురికావడంతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

News October 20, 2024

VZM: పవన్ కళ్యాణ్ పర్యటన.. రూట్ మ్యాప్ ఇదే

image

డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ గుర్లలో సోమవారం పర్యటించనున్నారు. విశాఖ విమానాశ్రయానికి రేపు ఉ.9:30 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 11 గంటలకు ఎస్ఎస్ఆర్ పేట వాటర్ సోర్స్ వద్దకు చేరుకొని తనిఖీ చేయనున్నారు. 11:30 గంటలకు గుర్ల పీహెచ్సీని సందర్శిస్తారు. 12:00 గంటలకు గుర్ల నుంచి బయలుదేరి విజయనగరం చేరుకుని కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షిస్తారు. తిరిగి సా.4గంటలకు విశాఖ చేరుకుంటారు.

News October 20, 2024

VZM: ఏటా నాలుగు చోట్ల‌ డ్వాక్రా ఉత్ప‌త్తుల ప్ర‌ద‌ర్శ‌న‌లు

image

మహిళా స్వ‌యంశ‌క్తి సంఘాల స‌భ్యులు త‌యారు చేసిన హ‌స్త‌క‌ళాకృతులు, ఉత్ప‌త్తి చేసిన వ‌స్తువులు ఏడాది పొడ‌వునా మార్కెటింగ్ చేసుకోవడానికి అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నట్లు మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ చెప్పారు. నగరంలో సరస్ ముగింపు సభలో ఆదివారం మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి ఏటా నాలుగు చోట్ల అఖిల భార‌త డ్వాక్రా బ‌జార్ ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

News October 20, 2024

బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ కోర్సు పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. జులై నెలలో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను విడుదల చేసి ఏయూ వెబ్సైట్లో పొందుపరిచారు. విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం నవంబర్ ఒకటో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఒక ప్రకటనలో తెలిపారు.

News October 20, 2024

మెరకముడిదాం: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

ఉత్తరావల్లికి చెందిన వై.సుశీల (26) ఈనెల 13న ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఒంటికి నిప్పంటుకుంది. తీవ్రంగా కాలిపోవడంతో కుటుంబీకులు విశాఖపట్నంలోని కేజీహెచ్‌కి తరలించారు. అక్కడ వారం రోజులగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్ఐ లోకేశ్వరరావు తెలిపారు.

News October 20, 2024

సాలూరు: నియోజకవర్గ సమన్వయకర్తలతో మంత్రి సమావేశం

image

సాలూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ సమన్వయకర్తలతో మంత్రి గుమ్మడి సంధ్యారాణి శనివారం సాలూరులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె టీడీపీ పార్టీ రాష్ట్ర సమావేశంలో జరిగిన విషయాలను తెలిజయేశారు. ఈ నెల 26 తేదిన సీఎం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తారని, నియోజకవర్గంలో కూడా అత్యధికంగా నమోదుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నేతలు బంజేదేవ్, పరమేసు, ప్రసాద్, వేణు తదితరులు పాల్గొన్నారు.

News October 19, 2024

బొబ్బిలిలో విషాదం.. ఇప్పుడే వస్తానని చెప్పి

image

బొబ్బిలిలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిన <<14395080>>విషయం తెలిసిందే<<>>. ఈ ఘటనలో మెట్టవలసకి చెందిన కె.సత్యనారాయణ (45) తన భార్యతో ఇప్పడే వస్తానని చెప్పి కుమార్తె శిరితో కలిసి TVS XLపై బొబ్బిలి వెళ్లాడు. ఈ క్రమంలో బొబ్బిలి రైల్వే వంతెనపై ప్రమాదం జరగగా అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న భార్య ఘటనా స్థలికి చేరుకొని భర్త మృతదేహం వద్ద రోధించింది. ఈ దృశ్యం స్థానికులను కలిచివేసింది.