Vizianagaram

News April 22, 2024

సమ్మర్ ఆక్టివిటీస్ పుస్తకాన్ని ఆవిష్కరించిన డీఈఓ

image

రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులతో కమిషనర్ సూచనలతో APSSTF వారు సోషల్ స్టడీస్ సమ్మర్ యాక్టివిటీస్ పుస్తకాన్ని ప్రచురించారు. ఆదివారం విజయనగరం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ ఎన్.ప్రేమ్ కుమార్, ఇతర సిబ్బందితో కలసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు వేసవి సెలవుల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా అత్యంత ఆకర్షనీయంగా పుస్తకాన్ని రూపొందించారని తెలిపారు.

News April 21, 2024

విజయనగరం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను

image

విజయనగరం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీనును పార్టీ ప్రకటించింది. గజపతినగరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గతంలో ఆయన పోటీచేశారు. ఆయన సేవలను అధిష్ఠానం గుర్తించి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో కాంగ్రెస్ అభిమానుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించాలని శ్రీను కోరారు.

News April 21, 2024

విజయనగరం జిల్లాలో చంద్రబాబు సభ  

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 23న టీడీపీ అధినేత చంద్రబాబు విజయనగరం జిల్లాకు రానున్నారు. ఆరోజు ఉదయం బొండపల్లి మండలంలో మహిళా ప్రజాగళం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. సభకు బొండపల్లి జాతీయ రహదారి పక్కన గల మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ ప్రభాకర్, ఎస్.ఐలు లక్ష్మణరావు, మహేశ్ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. 

News April 21, 2024

విజయనగరం: ముగిసిన మోడల్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్ష

image

విజయనగరం జిల్లాలో ఆదివారం 6వ తరగతి మోడల్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రశాంతంగా ముగిసిందని జిల్లా విద్యా శాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు. జిల్లాలో పలు పరీక్షా కేంద్రాలను డిఈఓ పరిశీలించారు. జిల్లాలో 14 సెంటర్లలో 3,669మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 3,167 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 502 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ పేర్కొన్నారు.

News April 21, 2024

VZM: క్రికెట్ బెట్టింగ్‌లతో అప్పులపాలై యువకుడి ఆత్మహత్య

image

క్రికెట్ బెట్టింగ్‌లకు బానిసై అప్పులు పాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెంటాడ మండలంలో జరిగింది. పెద మేడపల్లి గ్రామానికి చెందిన కిల్లాడ ఈశ్వరరావు గతంలో రూ.4 లక్షలు వరకు బెట్టింగ్‌లో ఓడిపోయాడని, ఇటీవల మళ్ళీ రూ.లక్ష వరకు బకాయి పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు, వ్యసనాలకు బానిసై విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై దేవి తెలిపారు.

News April 21, 2024

తాటిపూడి APRJC లెక్చరర్ సూసైడ్!

image

అనకాపల్లిలో శనివారం ఓ మహిళ మృతిచెందింది. మృతురాలి తండ్రి నూకరాజు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి శారదా నగర్ ముత్రాసి కాలనీలో నివాసం ఉంటున్న APRJC లెక్చరర్ ఉమాదేవి(32), శనివారం అర్ధరాత్రి తన ఇంట్లో కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విజయనగరం జిల్లాలో లెక్చరర్‌గా ఈమె పనిచేస్తున్నారు. 2021లో వివాహమైన ఉమాదేవికి భర్తతో గొడవలు ఉన్నాయని ఆయన తెలిపారు.

News April 21, 2024

మూడోరోజు ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 మంది నామినేషన్

image

మూడో రోజున శనివారం 9 మంది నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీర భద్ర స్వామి, యుగతులసి పార్టీ నుంచి ఒక నామినేషన్ వేశారు. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన కుమారుడు బొత్స సందీప్ వేశారు. నెల్లిమర్లలో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు. బొబ్బిలిలో కాంగ్రెస్ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు. అరకు ఎంపీకి పి రంజిత్ కుమార్, కురుపాంలో స్వతంత్ర అభ్యర్థి వేశారు.

News April 21, 2024

కోలగట్ల వీరభద్రస్వామి అప్పు ఎంతో తెలుసా!

image

☞ అభ్యర్థి: కోలగట్ల వీరభద్రస్వామి
☞ నియోజకవర్గం: విజయనగరం
☞ పార్టీ: వైసీపీ
☞ చరాస్తులు: రూ.6.48
☞ కేసులు: 2
☞ బంగారం: 1KG
☞ స్థిరాస్తి: రూ.15.34
☞ అప్పులు: రూ.7.49 కోట్లు
☞ భార్య పేరిట చరాస్తులు: రూ.2.97 కోట్లు
☞ భార్య పేరిట స్థిరాస్తి: రూ.4.60 కోట్లు
☞ భార్య పేరిట బంగారం: 2KG
☞ కార్లు: లేవు
➠ కోలగట్ల వీరభద్రస్వామి శనివారం నామినేషన్ దాఖలు చేయగా, ఆఫిడవిట్‌లో ఈ వివరాలను వెల్లడించారు.

News April 21, 2024

బొండపల్లి: ఆరుగురిపై బైండోవర్

image

అక్రమంగా మద్యం విక్రయిస్తూ పలుమార్లు పట్టుబడిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామని తహశీల్దార్ హనుమంతురావు తెలిపారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఎస్ఈబీ ఎస్సై ఆర్.రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో మండలంలోని పలుగ్రామాలకు చెందిన ఆరుగురిపై సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బైండోవర్ చేశారు. వీరంతా గతంలో పలుమార్లు మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డారని, వీరిపై నిరంతర నిఘా ఉంటుందని పేర్కొన్నారు.

News April 21, 2024

ఎంపీగా 22న కొత్తపల్లి గీత నామినేషన్

image

అరుకు ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత 22న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమానికి కూటమి నేతలు భారీగా వచ్చి విజయవంతం చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో గీత తప్పకుండా విజయం సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.