India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడుపునొప్పి తాళలేక బాడంగి మండలం అనవరం గ్రామానికి చెందిన తూముల విజయకుమార్(23) గత మూడు సంవత్సరాల నుంచి కడుపునొప్పితో బాధపడుతున్నాడు. జీవితం విరక్తిచెంది గ్రామ సమీపంలో అరటితోట పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు మెరుగైన వైద్య చికిత్సకోసం విజయనగరం సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై జయంతి కేసును దర్యాప్తు చేస్తున్నారు.
అరకు పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నిశాంత్ కుమార్కు శుక్రవారం నలుగురు ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు పత్రాలను అందజేశారు. వీరిలో నిమ్మక జయరాజు, పాలక రంజిత్ కుమార్ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయగా.. పాచిపెంట అప్పలనరస సీపీఐ(M) నుంచి అభ్యర్థి నామినేషన్ వేయగా, వైసీపీ అభ్యర్థి గుమ్మ తనూజా రాణి కూడా నామినేషన్ దాఖలు చేశారు.
జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి మాట్లాడుతూ.. జిల్లాలో మార్చి 16 నుంచి నేటి వరకు 92 లక్షల నగదు, 42 లక్షల విలువైన లిక్కర్, 29 లక్షల విలువైన డ్రగ్స్, 1 కోటి 81 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు 74 లక్షల విలువైన ఇతర సామాగ్రిని కలిపి 4.2 కోట్లను సీజ్ చేశామన్నారు. ఫిర్యాదులను స్వీకరించడానికి జిల్లా వ్యయ కమిటి , సి విజిల్ , మీడియా మానటరింగ్ తదితర విభాగాలను ఏర్పాటు చేశామన్నారు.
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా అల్లరిమూకలు, పాత నేరస్థులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది మొదలు జిల్లా వ్యాప్తంగా 14,344 మందిని బైండోవర్ చేశారు. జిల్లాలో గల ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 33 స్టేషన్ల పరిధిలో 14,344 మంది బైండోవర్ నమోదయ్యాయి. పాత నేరస్థులకు సంబంధించి 111 మందిపై రౌడీషీట్లు తెరిచారు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈసీ నిబంధనల ప్రకారం పోలీసులు అప్రమత్తమయ్యారు. తుపాకీ లైసెన్స్లు కలిగిని వారందరూ ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకూ తమ ఆయుధాలను అందజేయాలంటూ పోలీసులు వారికి లేఖలు రాశారు. ఈమేరకు సంబంధిత వ్యక్తులు తుపాకులను పోలీసులకు అప్పగించారు. జిల్లాలో ఎస్బీఎల్, డీబీబీఎల్, ఫిస్టల్, రైఫిల్స్ మొత్తం 445 ఉన్నాయి. 68 మినహా మిగతా అన్ని పోలీసు శాఖ స్వాధీనం చేసుకుంది.
నెల్లిమర్ల అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఆయన భార్య పద్మావతితో కలిపి స్థిర, చరాస్తుల విలువ రూ.11,25,32,036 గా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈయనకు వివిధ వ్యాపారాలపై 2022-23లో రూ.4,37,980, ఆయన భార్యకు రూ.6,09,320 వచ్చింది.
ఎల్.కోటలో ఓ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన రాజు అనే వ్యక్తి పై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. ఈ మేరకు రాజు పోలీసులు నుంచి తప్పించుకుని పరారీలో ఉన్నాడు. అయితే నిందితుడు రాజు సోంపురం సమీపంలో గల ఓ పొలంలో గురువారం శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చనిపోయిన వ్యక్తి రాజుగా నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట పీహెచ్సీకి తరలించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎంగా జగన్మోహన్ రెడ్డి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పరిపాలనను కూడా విశాఖ నుంచే ప్రారంభిస్తారని అన్నారు. మాట తప్పని వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని వెల్లడించారు. టీడీపీ అధికారంలో ఉండగా అమరావతి పేరిట చేసిన దోపిడీ అందరికీ తెలిసిందే అన్నారు.
నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎన్నికల సందడి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. రెండు నియోజకవర్గాలు మినహా మిగతా 7 స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏజెన్సీ ప్రాంతం కావడంతో సాలూరు, కురుపాం నియోజకవర్గాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకే పోలింగ్ ఉంటుంది. ఓటర్లు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.
కొన్నేళ్లుగా సాలూరు ప్రాంత వాసులకు ఊరిస్తున్న రైలుబండి ఇంకెన్నేళ్లకు పట్టాలెక్కుతుందో అని సాలూరు ప్రజలు మండి పడుతున్నారు. గతంలో వచ్చే రైలు బస్కు బదులు సాలూరు నుంచి విశాఖపట్నం వరకు 6 బోగీలతో రైలు దసరాకు ప్రారంభిస్తారని పట్టాలు సరిచేసి, విద్యుత్ లైన్ వేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో పట్టాల మధ్య పిచ్చి మొక్కలు పెరిగి స్టేషన్ పరిసరాలు చీకటి పనులకు అడ్డాగా మారిందంటున్నారు.
Sorry, no posts matched your criteria.