India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
VZM : ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 18వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 18 న ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని, ఆరోజు నుంచీ నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందన్నారు.
సివిల్స్ ఫలితాల్లో పార్వతీపురానికి చెందిన దొనక పృథ్వీరాజ్ 493వ ర్యాంకు సాధించారు. తండ్రి దొనక విజయ్ కుమార్ కురుపాం MEOగా, తల్లి రికార్డ్ అసిస్టెంట్గా పనిచేశారు. పృథ్వీరాజ్ తన రెండవ ప్రయత్నంలో ర్యాంకు సాధించారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పీజీ చదివిన యువకుడు.. ఇంటి వద్దే సివిల్స్కు సన్నద్ధం అయ్యి ర్యాంకు సాధించారు. ర్యాంకు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు ఇస్తామని వచ్చిన మెసేజ్కు యువతి మోసపోయిన ఘటన గజపతినగరం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని పురిటిపెంటకి చెందిన ఓ యువతికి తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు ఇస్తామని మెసేజ్ వచ్చింది. నమ్మిన యువతి దశలో వారీగా రూ.14.15 లక్షలు జమ చేసింది. అటు నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో మోసపోయానని గ్రహించి ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు.
విజయనగరం జిల్లా వ్యాప్తంగా సోమవారం 189 మంది వాలంటీర్స్ రాజీనామా చేశారు. రామభద్రపురం, బాడంగి, తెర్లాం, బొబ్బిలి, గుర్ల మండలాల్లో వాలంటీర్స్ రాజీనామా పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. వాలంటీర్స్ రాజీనామాలను ఆమోదించామని ఎంపీడీఓలు తెలిపారు. వ్యక్తి గత కారణాలతో కొందరు రాజీనామా చేయగా, ఎన్నికల కోడ్ పేరుతో తమను దూరంగా ఉంచడం వల్లే రాజీనామా చేశామని మరికొందరు తెలిపారు.
తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక కూతురు మృతిచెందిన ఘటన పార్వీతీపురం మండలంలో జరిగింది. పెదమరికి గ్రామానికి చెందిన భుజంగరావు (45), ఫాస్ట్ఫుడ్ సెంటర్ నడిపేవాడు. అతని కుమార్తె రోషిణి (19) తండ్రికి చేదోడుగా ఉండేది. మార్చి 31న భుజంగరావు మృతిచెందాడు. అప్పటి నుంచి సరిగా భోజనం చేయక, నిద్రపోకుండా ఉండిపోయింది. ఆదివారం రాత్రి నీరసంగా ఉందని నిద్రపోయింది. ఎంతకీ లేవకపోవడంతో తల్లి చూడగా అప్పటికే మృతిచెందింది.
కామాక్షినగర్ సమీపంలో నివాసం ఉంటున్న పోస్టుమాస్టర్ వెంకటరమణ ఇంట్లో మూడు తులాల బంగారం చోరీ జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. వెంకటరమణ గజపతినగరంలోని తన బంధువుల ఇంటికి ఈ నెల 13న కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాడు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడాన్ని సోమవారం ఉదయం 7గంటల సమయంలో పక్కింటి వారు చూసి సమాచారం ఇచ్చారు. వెంకటరమణ వచ్చి చూసేసరికి ఇంట్లో సామగ్రి చిందరవందరగా ఉంది. ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
పూసపాటిరేగ మండలం చల్లవానితోట పంచాయతీ గొల్లపేట గ్రామానికి చెందిన కె.రాజారావు(45) కూలిపని నిమిత్తం ఎస్.కోట మండలం ముషిడిపల్లి గ్రామానికి వచ్చాడు. మధ్యాహ్నం భోజనం అనంతరం తాటికాయల కోసం తాటిచెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారిపడడంతో గాయాలయ్యాయి. రాజారావు ఘటనా స్థలంలోనే సోమవారం మృతిచెందాడు. మృతుడి భార్య సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.కోట సీఐ వై.ఎంరావు తెలిపారు.
పోస్టల్ బ్యాలెట్ కోసం అత్యవసర సేవలందిస్తున్న శాఖల లో పని చేస్తున్న ఉద్యోగుల, ఎన్నికల విధులలో పాల్గొంటున్న పాస్ లు పొందిన మీడియా వారి కి ఓటింగ్ కోసం పోస్టల్ బ్యాలెట్ ను అందించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో అత్యవసర సేవలను అందించే అధికారులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసారు.
పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో రాములోరికి శ్రీరామతీర్థం సంఘం గోటితో ఒలిచిన తలంబ్రాలను సోమవారం మధ్యాహ్నం సమర్పించారు. 2017 నుంచి రామతీర్థంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న రాములోరి కళ్యాణానికి గోటితో ఒలిచిన తలంబ్రాలను అందిస్తున్నట్లు సంఘం ప్రధాన కార్యదర్శి సుదర్శనం విజయకుమార్ వెల్లడించారు. కోలాట బృందాలతో ఊరేగింపుగా గోటితో ఒలిచిన తలంబ్రాలను ఆలయ ఈఓ వై.శ్రీనివాసరావుకి అందజేశారు.
ఎల్.కోట మండలంలో పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజు అనే యువకుడు శనివారం రాత్రి 8 గంటల సమయంలో, చెల్లితో ఆడుకుంటున్న 8ఏళ్ల బాలికను బలవంతంగా తన ఇంటి మేడ మీదకి తీసుకువెళ్లాడు. దీంతో బాలిక చెల్లి తన తల్లీదండ్రులకి చెప్పింది. వారు చుట్టుప్రక్కల వారి సహాయంతో మేడ మీదకు వెళ్లారు. బలవంతంగా తలుపులు తెరవడంతో రాజు అర్ధనగ్నంగా, బాలిక ఏడుస్తూ కనిపించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
Sorry, no posts matched your criteria.