Vizianagaram

News April 13, 2024

కొత్తవలస: ఎమ్మార్వో కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ మృతి

image

కొత్తవలస ఎమ్మార్వో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్ ఇబ్రహీం (33) శనివారం సాయంత్రం మృతి చెందారు. కొత్తవలస కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా ఎనిమిది నెలల క్రితమే విధుల్లోకి వచ్చారు. అనారోగ్య కారణంగా రెండు రోజులుగా విశాఖలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎమ్మార్వో సిబ్బంది అతని కుటుంబానికి సంతాపం తెలిపారు.

News April 13, 2024

ఈవీఎంల కేటాయింపును పరిశీలించిన కలెక్టర్ నాగలక్ష్మి

image

స్థానిక ఈవీఎం గోదాములో నిర్వహిస్తున్న ఈవీఎంల కేటాయింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి శనివారం పరిశీలించారు. ర్యాండమైజేషన్ ద్వారా ఈవిఎంలను వివిధ నియోజక వర్గాలకు ఇప్పటికే కేటాయించిన విషయం తెలిసిందే. నియోజకవర్గాలకు వచ్చిన ఈవీఎం సీరియల్ నంబర్ల ప్రకారం, వాటిని ఆయా నియోజకవర్గాల వారీగా వేరుచేసి, స్కానింగ్ చేసే కార్యక్రమం ప్రస్తుతం జరుగుతోంది.

News April 13, 2024

విశాఖ: రాళ్లతో కొట్టి యువకుడి దారుణ హత్య

image

విశాఖపట్నం అరిలోవ కృష్ణపురంలో యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. యువకుడిని రాళ్లతో కొట్టి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

News April 13, 2024

VZM: ఒకేరోజు 123 మంది వాలంటీర్స్ రాజీనామా

image

పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం ఒక్క రోజు 123 మంది వాలంటీర్స్ రాజీనామా చేశారని అధికారులు తెలిపారు. పాచిపెంట , సీతం పేట, వీరఘట్టం, గరుగుబిల్లి, జియమ్మవలస గ్రామ వాలంటీర్స్ రాజీనామా చేస్తూ ఆయా మండలాలలో సంబంధిత అధికారులకు రాజీనామా పత్రాలను అందజేశారు. ఎన్నికల కోడ్ తో తమను దూరం పెట్టడంతో రాజీనామా చేసినట్లు వాలంటీర్స్ తెలిపారు.

News April 13, 2024

VZM: ఈనెల 15వ తేదీ నుంచి చేపల వేటపై నిషేధం

image

విజయనగరం జిల్లాలో ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల వేట నిషేధిస్తున్నట్లు మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. సుమారు 61 రోజులు పాటు సముద్ర జలాలలో చేపల వేటపై నిషేధం అమలులో ఉంటుందన్నారు. మోటార్ బోట్లు, మెకనైజ్డ్ బోట్ల ద్వారా సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని మత్స్యకారులకు సూచించారు. ఆ నిషేధించిన కాలంలో చేపలు సంతానోత్పత్తి పెంచుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు.

News April 13, 2024

VZM: మే 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగుతాయని ఆర్ఐఓ మజ్జి ఆదినారాయణ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9నుంచి 12గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30గంటల వరకు సెకండియర్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు పరీక్ష ఫీజు స్వీకరణ ప్రక్రియ జరుగుతుందన్నారు. మే 1 నుంచి 4వ తేదీ వరకు రెండు సెషన్లలో ప్రయోగపరీక్షలు జరుగుతాయన్నారు.

News April 13, 2024

మన్యం: ‘ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి’

image

సాధారణ ఎన్నికల నిర్వహణలో లోపాలు, నిర్లక్ష్యం లేకుండా ప్రశాంతంగా జరిగేందుకు శిక్షణను సద్వినియోగం చేసుకోని సమర్ధంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రిసైడింగ్ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పార్వతీపురం నియోజకవర్గ ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం సందర్శించారు.

News April 12, 2024

పార్వతీపురం: ఇంటర్ ఒకేషనల్ కోర్సులో రాష్ట్రంలో ప్రథమ స్థానం

image

2024వ సంవత్సరం మార్చిలో జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలలో పార్వతీపురం మన్యం జిల్లాలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని జిల్లా వృత్తి విద్యాధికారిని డి. మంజులవీణ తెలిపారు. ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులు విభాగంలో పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలో” ప్రథమ స్థానం”లో నిలిచిందని, జనరల్ కోర్సులలో 11వ స్థానంలో ఉందని తెలిపారు.

News April 12, 2024

కొమరాడ: గడ్డి మందు తాగి వ్యక్తి మృతి

image

గడ్డి మందు తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటన కొమరాడ మండలం మాదలంగి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై నీలకంఠం తెలిపిన వివరాల ప్రకారం.. మాదలంగి గ్రామానికి చెందిన అధికారి వెంకటేశ్ (32) మద్యానికి బానిసై రోజు మద్యం తాగేవాడు. కుటుంబ సభ్యులు మందలించారని మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు.

News April 12, 2024

కలెక్టరేట్లో సెల్ఫీ పాయింట్ ను ప్రారంభించిన కలెక్టర్

image

VZM : వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఎంతో విలువైన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి కోరారు. మే 13న జరిగే ఎన్నికలకు జిల్లాలో ఏర్పాట్లు వేగవంతం చేసినట్లు ఆమె తెలిపారు. కలెక్టరేట్ పోర్టికోవద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ను కలెక్టర్ నాగలక్ష్మి శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్బంగా కొత్తగా ఓటు హక్కు పొందేందుకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉందన్నారు.