Vizianagaram

News April 12, 2024

విశాఖలో విజయనగరం జిల్లా యువకుడు మృతి

image

విశాఖలోని సిరిపురం శ్రీలక్ష్మి గణపతి ఆలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. ద్విచక్రవాహనాన్ని కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా వేపాడ మండలానికి చెందిన రాజకుమార్(30) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ సీఐ అమ్మి నాయుడు కేసు దర్యాప్తు చేపట్టారు.

News April 12, 2024

మన్యం: మొదటి రేండమైజేషన్ పూర్తి

image

జిల్లాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ మొదటి రేండమైజేషన్ శుక్రవారం పూర్తి అయ్యింది. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రేండమైజేషన్ చేపట్టారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి రేండమైజేషన్ విధానాన్ని వివరించారు. రేండమైజేశన్ ద్వారా ఏ ఈవీఎం ఏ నియోజక వర్గానికి వెళుతుందో వివరించారు.

News April 12, 2024

పార్వతీపురం 11వ స్థానం.. విజయనగరం 13వ స్థానం

image

➠ విజయనగరంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు 16,584 మందికి 10,267 మంది పాసయ్యారు. 62%తో రాష్ట్రంలో 13వ స్థానంలో నిలిచింది. సెకండియర్‌లో 15,180 మందికి 10,591 మంది పాసయ్యారు. 70%తో 21వ స్థానంలో ఉంది.
➠ పార్వతీపురం మన్యం జిల్లాలో ఫస్ట్ ఇయర్‌లో 5,475 మందికి 3,565 మంది ఉత్తీర్ణత సాధించారు. 65 శాతంతో 11వ స్థానంలో ఉంది. సెకండ్ ఇయర్‌లో 5,292 మంది రాయగా..4,054 మంది పాసయ్యారు. 77%తో 11వ స్థానంలో ఉంది.

News April 12, 2024

పార్వతీపురం మన్యం జిల్లాలో పరీక్ష రాసిన 19,856 మంది

image

ఈరోజు 11 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన పరీక్షల్లో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన 19,856 మంది విద్యార్థులు పరీక్షలకు హాల్ టికెట్లు ఇచ్చారు. వీరిలో 19,791 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 17,268 మంది కాగా.. సప్లమెంటరీ రాసినవారు 2,588 మంది ఉన్నారు.

News April 12, 2024

విజయనగరం జిల్లాలో పరీక్ష రాసిన 45,755 మంది

image

ఈరోజు 11 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన పరీక్షల్లో విజయనగరం జిల్లాకు చెందిన 45,755 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 45,755 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సర విద్యార్థులు 20,630 మంది కాగా.. ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారు 25,125 మంది ఉన్నారు.

News April 12, 2024

ఈనెల 15న విజయనగరం జిల్లాకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన తేదీలు ఖరారైనట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈనెల 15న రాజాంలో సాయంత్రం 3గంటలకు జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. మరుసటి రోజు విజయనరగంలో సాయంత్రం 4 గంటలకు, నెల్లిమర్ల ప్రధాన కూడలిలిలో రాత్రి 7 గంటలకు జరిగే సభల్లో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పాల్గొనున్నట్లు వెల్లడించారు. కాగా.. అభ్యర్థుల ప్రకటన అనంతరం మొదటిసారి వీరు జిల్లాకు వస్తున్నారు.

News April 12, 2024

VZM: ఎన్నికల కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్

image

విజయనగరం క‌లెక్ట‌రేట్‌లోని ఎన్నిక‌ల కంట్రోల్ రూమ్‌ని జిల్లా క‌లెక్ట‌ర్‌, జిల్లా ఎన్నిక‌ల అధికారి నాగ‌ల‌క్ష్మి గురువారం సంద‌ర్శించారు. వివిధ విభాగాల కార్య‌క‌లాపాల‌ను ప‌రిశీలించారు. న‌మోదు చేసిన కేసులను, తీసుకున్న చ‌ర్య‌ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్‌కు సీపీఓ పి.బాలాజీ, నోడల్ అధికారి డాక్టర్ సత్య ప్రసాద్ వివ‌రించారు. జాయింట్ క‌లెక్ట‌ర్ కె.కార్తీక్‌, డిఆర్ఓ ఎస్‌డి అనిత పాల్గొన్నారు.

News April 11, 2024

పార్వతీపురం: ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి

image

ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన పార్వతీపురం మండలం హెచ్ కారడవలస గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. పార్వతీపురం రూరల్ ఎస్సై దినకర్ తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్ల బురిడీ గ్రామం నుంచి నిడగల్లు గ్రామానికి వెళుతున్న ఆటో కారాడవలస సమీపంలో బోల్తా పడిందన్నారు. ఈ ఘటనలో పైలా సింహాచలం (67) మృతి చెందినట్లు ఆయన తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించామన్నారు.

News April 11, 2024

పాచిపెంట: ఉపాధి హామీ ఉద్యోగి అనుమానాస్పద మృతి

image

అనుమానాస్పద స్థితిలో ఉపాధి హామీ ఉద్యోగి మృతి చెందిన ఘటన మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. పాచిపెంట మండల కేంద్రానికి చెందిన డోలా శంకరరావు పాచిపెంట ఉపాధి హామీలో టెక్నీకల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం పారమ్మకొండ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న కాలువ దగ్గర అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీంచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

News April 11, 2024

VZM: ‘ఫలితాలు సరే.. మూల్యాంకనం డబ్బులేవీ’?

image

ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు రికార్డు స్థాయిలో మూల్యాంకనం పూర్తయిన వారం రోజుల లోపే విడుదల కానున్నాయి. అయితే పరీక్షలు నిరాటంకంగా జరిపించిన అధ్యాపకుల సేవలు మాత్రం ఇంటర్ బోర్డు విస్మరించిందని అధ్యాపకులు వాపోతున్నారు. ఫిబ్రవరిలో జరిగిన ప్రాక్టికల్స్ రెమ్యూనరేషన్ గానీ, మార్చిలో జరిగిన పరీక్షల ఇన్విజిలేషన్ రెమ్యూనరేషన్ గానీ అనంతరం జరిగిన పేపర్ల మూల్యాంకనం రెమ్యూనరేషన్ గానీ తమకి అందకపోవడం దారుణమని అంటున్నారు.