Vizianagaram

News October 10, 2024

రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటు: మంత్రి

image

రతన్ టాటా మరణం పారిశ్రామిక రంగానికి, దేశానికి తీరని లోటు అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆయన మృతి పట్ల గురువారం మంత్రి సంతాపం వ్యక్తం చేశారు. దేశం గొప్ప మానవతావాది కోల్పోయిందని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన నైజమని కొనియాడారు. పుట్టు కోటీశ్వరుడైనా, అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక దిగ్గజంగా ఎదిగినా, సామాన్య జీవనం సాగించిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా అని పేర్కొన్నారు.

News October 10, 2024

పైడితల్లి జాతర ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

image

విజయనగర ఉత్సవాలు ప్రతి ఒక్కరి మదిలో మధుర స్మృతిగా నిలిచిపోయేలా నిర్వహించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఏర్పాట్లను చూసి అధికారులతో మాట్లాడిన తర్వాత ఉత్సవాలు ఘన విజయం అవుతాయనే నమ్మకం కలిగిందని అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి బుధవారం సమీక్షించారు. ఉత్సవాలు విజయవంతం చేయాలని సూచించారు.

News October 9, 2024

మోసపోయిన విజయనగరం యువతి

image

విజయనగరానికి చెందిన యువతిని ఇద్దరు మోసగించారు. సినిమా అవకాశాలు ఇప్పిస్తామనే మాటలు చెప్పి ఆమె నుంచి రూ.9లక్షలు వసూలు చేశారు. ఈ క్రమంలో వారిని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు పట్టుకున్నారు. ఆరా తీస్తే, ఈ నిందితులు పలువురికి ఇలాగే మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. యువత ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

News October 9, 2024

విజయనగరంలో నేడు డయల్ యువర్ MP కార్యక్రమం

image

విజయనగరం మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు డయల్ యువర్ ఎంపీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కమిషనర్ నల్లనయ్య తెలిపారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడంపై భక్తులు సలహాలు సూచనలు అందించాలని కోరారు. విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు: 9440436426, MP క్యాంప్ ఆఫీస్: 8919060911, మున్సిపల్ కమిషనర్, విజయనగరం: 9849906486 నెంబర్లను సంప్రదించాలన్నారు.

News October 9, 2024

విజయనగరం జిల్లా TODAY TOP NEWS

image

➼పార్వతీపురంలో kg టమాటా రూ.50
➼బొండపల్లి: రూ.లక్ష కరెన్సీతో అమ్మవారికి అలంకరణ
➼ అమ్మవారి ఘటాలతో పోటెత్తిన విజయనగరం
➼సిరిమాను ఉత్సవానికి పటిష్ఠ బందోబస్త్: ఎస్పీ
➼పార్వతీపురం: KGBVలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
➼డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో వీసీలో పార్వతీపురం కలెక్టర్
➼VZM: యథావిధిగా డీఎంయూ, రాయ్‌పూర్ పాసింజర్లు
➼: సచివాలయ ఉద్యోగులను మందలించిన మంత్రి కొండపల్లి

News October 8, 2024

విజయనగరం: ఉత్సవాలపై డీఐజీ సమీక్ష

image

ఈనెల 13,14,15 తేదీల్లో జరిగే విజయనగర ఉత్సవాలు, శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర నేపథ్యంలో.. భద్రత, బందోబస్తు ఏర్పాట్లను విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌తో కలిసి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని భద్రతా చర్యలు చేపట్టాలన్నారు.

News October 8, 2024

పైడితల్లమ్మ జాతరకు యుద్ధప్రాతిపదికన పనులు

image

ఈనెల 15న నిర్వహించనున్నట్లు పైడితల్లమ్మ సిరిమాను జాతర మహోత్సవానికి విజయనగరం నగరపాలక సంస్థ తరఫున, అన్ని సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన కల్పిస్తున్నట్లు కమిషనర్ పి నల్లనయ్య తెలిపారు. రూ.1.20 కోట్లతో బీటీ రోడ్డు, వివిధ రహదారుల మరమ్మతు పనులు, డివైడర్లు, రెయిలింగులకు రంగులు వేస్తున్నట్లు చెప్పారు. వివిధ జంక్షన్లలో విద్యుదీకరణ, అలాగే ప్రాశస్త్య భవనాలకు విద్యుదీకరణ వంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

News October 8, 2024

సచివాలయ ఉద్యోగులను వేధించడం దారుణం: మజ్జి శ్రీనివాసరావు

image

సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం తన ఛాంబర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అనేక విపత్కర పరిస్థితుల్లో సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలు అండగా నిలబడ్డాయన్నారు. విజయనగరం మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య సచివాలయ సిబ్బందిపై దుర్భాషలు ఆడుతూ వేధించడం దారుణమన్నారు. ఉద్యోగులకు వైసీపీ అండగా ఉంటుందన్నారు.

News October 8, 2024

విజయనగరంలో సుద్దాల అశోక్ తేజ పర్యటన

image

అమ్మ వంటి మాతృభాషను గౌరవించుకోవాలని, తెలుగు భాషను పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం పరిపాలన అధికారి డాక్టర్ సూర్యనారాయణ పాల్గొన్నారు.

News October 8, 2024

VZM: యథావిధిగా డీఎంయూ, రాయ్‌పూర్ పాసింజర్లు

image

విశాఖ-రాయపూర్, విశాఖ-కోరాపుట్ లింక్ చేసిన విషయం విదితమే. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా లింకును రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. విశాఖ-రాయపూర్ పాసింజర్ గతంలో వచ్చిన మాదిరిగానే విశాఖపట్నంలో వేకువజామును 4.25 గంటలకు బయలుదేరుతుంది. విశాఖ-కొరాపుట్ పాసింజర్ విశాఖలో ఉదయం 6:30కి బయలుదేరుతుంది. ఈనెల 20 నుంచి ఈ సర్వీసులు ప్రారంభిస్తారు. >Share it