Vizianagaram

News April 11, 2024

విజయనగరం: పలు ట్రైన్లు రద్దు

image

ప్రీ-నాన్ -ఇంటర్లాకింగ్, నాన్ -ఇంటర్లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేస్తునట్లు స్టేషన్ సూపరిండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. 08527 విశాఖ- రాయ్‌పూర్, 08528 రాయ్‌పూర్ -విశాఖ, 08504 విశాఖ-భవానీపట్నం ప్యాసింజర్, 18301 సంబల్పూర్ – రాయగడ, 18302 రాయగడ -సంబల్పూర్ ఇంటర్ సిటీని ఈనెల 15 నుంచి 24వ తేదీ వరకు.. 08503 భవానీపట్న-విశాఖ ప్యాసింజర్ ఈనెల 16 నుంచి 25వ వరకు రద్దు చేసినట్ల వెల్లడించారు.

News April 11, 2024

పైడితల్లి అమ్మవారిని తాకిన సూర్యకిరణాలు

image

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం విజయనగరం జిల్లా కేంద్రంలో వెలసిన శ్రీ పైడితల్లి అమ్మవారిని బుధవారం ఉదయం సూర్య కిరణాలు తాకాయి. రైల్వేస్టేషన్ సమీపంలోని ఉన్న వనం గుడిలో అమ్మవారిని సూర్య కిరణాలు తాకడంతో అమ్మ వారిని చూసేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

News April 11, 2024

విజయనగరం: వడదెబ్బతో వృద్ధుడు మృతి..?

image

దత్తిరాజేరు మండలం మరడాం గ్రామ సమీపంలోని మామాడి తోటలో బుధవారం మధ్యాహ్నం ఓ వృద్ధులు మృతి చెందాడు. వంగర గ్రామానికి చెందిన చుక్క రామన్న గత కొంతకాలంగా మతిస్తిమితం లేకుండా తిరుగుతున్నాడని స్టేషన్ బూర్జివలస ఎస్.ఐ లక్ష్మీప్రసన్న కుమార్ తెలిపారు. వడదెబ్బకు మృతి చెంది ఉండొచ్చని, మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామం తరలించినట్లు వెల్లడించారు.

News April 11, 2024

పార్వతీపురం: యువకునిపై పోక్సో కేసు 

image

బాలికను మోసం చేసి శారీరకంగా లోబరుచుకుని యువకునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై దినకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం.. పార్వతీపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన పెంటకోట ప్రవీణ్ కుమార్ మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ తెలిపారు.

News April 11, 2024

పార్వతీపురం: ‘రక్త హీనత పిల్లలపై దృష్టి సారించాలి’

image

రక్త హీనతపై ప్రజల్లో సంపూర్ణ అవగాహన ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. 10 ఏళ్ల లోపు పిల్లల్లో మరణాల రేటు నివారణ కార్యక్రమం ( ప్రాజెక్టు ఫర్ రిడక్షన్ ఆఫ్ ఇన్ఫాంట్ మోర్టాలిటి రేట్ బిలో 10)పై వైద్య అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బందితో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 10 ఏళ్ల లోపు పిల్లల్లో మరణాల రేటు నివారణకు ముఖ్యంగా రక్త హీనత నివారణపై దృష్టి సారించాలన్నారు.

News April 10, 2024

బొబ్బిలిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం

image

బొబ్బిలి – సీతానగరం రైల్వేస్టేషన్ల మధ్య చిన భోగిలి సమీపంలో, బుధవారం గుర్తు తెలియని మృతదేహాం లభ్యమయ్యిందని బొబ్బిలి జీఆర్పీ హెచ్సీ ఈశ్వరరావు తెలిపారు. ట్రైన్ నుంచి జారిపడి మృతిచెందారా, లేదా పట్టాలు దాటే క్రమంలో ట్రైన్ ఢీకొనడంతో ఈ ఘటన జరిగందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.

News April 10, 2024

VZM: ‘ఇంటింటి ప్ర‌చారంపై ముందుగా స‌మాచారం ఇవ్వాలి’

image

ఇంటింటి ఎన్నిక‌ల‌ ప్ర‌చారం, పాంప్లెట్ల పంపిణీ గురించి ముందుగా సంబంధిత పోలీసు స్టేష‌న్‌లో స‌మాచారం ఇస్తే స‌రిపోతుంద‌ని, ప్ర‌త్యేకంగా వీటికోసం అనుమ‌తి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి స్ప‌ష్టం చేశారు. త‌న ఛాంబ‌ర్‌లో బుధ‌వారం నిర్వ‌హించిన రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల స‌మావేశంలో క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, ఎన్నిక‌ల క‌మిష‌న్ నుంచి తాజాగా వ‌చ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను వివ‌రించారు.

News April 10, 2024

పార్వతీపురంలో పశువుల వ్యాన్ సీజ్

image

పార్వతీపురంలో ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న పశువుల వ్యాన్ సీజ్ చేసినట్లు పార్వతీపురం తహశీల్దార్ కె.ఆనందరావు తెలిపారు. స్థానిక ఎస్సై సంతోషి కుమారితో పార్వతీపురంలో బుధవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యాన్‌లో అనుమతులు లేకుండా పశువుల రవాణా చేస్తున్నట్లు గుర్తించి.. వాహనాన్ని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో రెవెన్యూ ఇనస్పెక్టర్ వి.రామకృష్ణ ఉన్నారు.

News April 10, 2024

విజయనగరం: అత్తారింటికి వెళ్తూ మృతి

image

పండగ పూట అత్తారింటికి వెళ్తూ ఓ వ్యక్తి మృతి చెందిన విషాదకర ఘటన బలిజిపేట మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ పాపారావు తెలిపిన వివరాల ప్రకారం.. వెంగాపురం గ్రామానికి చెందిన ఎస్.సంగమెశ్ (24) మంగళవారం మిర్తివలస అత్తవారింటికి వెళ్తుండగా బైక్‌ని, లారీ బలంగా ఢీ కొట్టింది. తీవ్రగాయలైన సంగమేశ్‌ను కుటుంబ సభ్యులు విజయనగరం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు.

News April 10, 2024

VZM: భద్రాచలానికి ప్రత్యేక బస్సు.. టైమింగ్స్ ఇవే

image

శ్రీరామనవమి సందర్భంగా విజయనగరం నుంచి భద్రాచలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తున్నట్లు డిపో ప్రబంధకుడు శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 16న సాయంత్రం 4.30 గంటలకు విజయనగరం డిపో నుంచి బస్సు బయల్దేరి, ఆదివారం ఉదయం 5 గంటలకు అక్కడికి చేరుకుంటుందన్నారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు తిరిగి బయల్దేరి సోమవారం ఉదయం 5.30 గంటలకు ఇక్కడకు వస్తుందని చెప్పారు.