Vizianagaram

News April 7, 2024

విజయనగరం: గంజాయితో ముగ్గురు అరెస్ట్

image

ఎస్.కోట మండలంలో బొలేరోలో తరలిస్తున్న 200 కిలోల గంజాయిని శనివారం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వై.మురళీరావు తెలిపారు. పందిరప్పన్న కూడలి వద్ద ఎస్ఐ గంగరాజు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా.. అరకు నుంచి వచ్చిన వాహనంలో గంజాయి బస్తాలను గుర్తించారన్నారు. గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. ముగ్గురు నిందితులను రిమాండుకు తరలించామని పేర్కొన్నారు.

News April 7, 2024

పార్వతీపురం: ఈ నెల 20న ఈఎంఆర్ఎస్ ప్రవేశపరీక్ష

image

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష వాయిదా పడినట్లు ఐటీడీఏ పీవో విష్ణుచరణ్ తెలిపారు. శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈనెల 13న పరీక్ష జరగాల్సి ఉంది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మేటివ్-2 పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈనెల 20కు పరీక్ష వాయిదా వేసినట్లు తెలిపారు.

News April 7, 2024

పార్వతీపురం: ‘నియమావళి ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలి’

image

సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా నిర్వహించుటకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీ చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. శనివారం జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. గంజాయి, మద్యం, నగదు, ఉచితాల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఉంచాలన్నారు.

News April 6, 2024

బ్రహ్మపుర్- ఎర్నాకుళం రైలుకు కొత్తవలసలో హాల్ట్

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎర్నాకుళం- బ్రహ్మపుర్- ఎర్నాకుళం (ట్రైన్ నంబర్స్ 06087/06088) రైలుకు కొత్తవలసలో హాల్ట్ ఇచ్చారు. ఈ రైలు ఎర్నాకుళంలో ప్రతి శనివారం రాత్రి 11 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస మీదుగా బ్రహ్మపుర్ చేరుతుంది. తిరిగి బ్రహ్మపుర్‌లో సోమవారం మధ్యాహ్నం 12.40 గంటలకు బయలుదేరి కొత్తవలస, దువ్వాడ, గూడూరు, నెల్లూరు మీదుగా ఎర్నాకుళం చేరుతుంది.

News April 6, 2024

సాలూరు: యువతి అనుమానస్పద మృతి

image

అనుమానస్పద స్థితిలో యువతి మృతి చెందిన ఘటన సాలూరులో తీవ్ర కలకలం రేపింది. దండిగాంకు చెందిన యువతిని పని చేయడంలేదని తల్లి మందలించడంతో సుమురుగా 25 రోజుల కిందట ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. శనివారం గ్రామ సమీపంలో అడవిలో యువతి అస్థిపంజరాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు తెలిపారు. వస్తువులు ఆధారంగా యువతి మృతదేహాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఎస్ఐ MV. రమణ తెలిపారు.

News April 6, 2024

పార్వతీపురం జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు

image

జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికలు పటిష్ఠంగా జరిపేందుకు చర్యలు చేపట్టామన్నారు. నాలుగు నియోజకవర్గాలలో 48 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 36 స్టాటిక్ సర్వేలియన్స్ బృందాలు, 16 వీడియో సర్వేలియన్, 4 వీడియో వ్యూయింగ్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు.

News April 6, 2024

గజపతినగరంలో అతనొక్కడే ఏకగ్రీవం

image

గజపతినగరం నియోజకవర్గంలో ఏకగ్రీవంగా గెలిచిన ఒకే ఒక్కరు పెనుమత్స సాంబశివరాజు. ఈయన గజపతినగరం నుంచి 1967లో ఇండిపెండెంట్‌గా గెలిచి తొలిసారి అసెంబ్లీకి వెళ్లారు. 1972లో ఆయనకి ప్రత్యర్థి లేకపోవడంతో విజయం ఏకగ్రీవం అయ్యింది. 1978 నుంచి 2004 వరకు అప్పటి సతివాడ నియోజకవర్గం నుంచి 7సార్లు పోటీ చేయగా.. 1994 మినహా మిగిలిన 6 సార్లు విజయం సాధించారు. ఈయన వారసుడు సురేశ్ ఇప్పడు వైసీపీ నుంచి MLCగా కొనసాగుతున్నారు.

News April 6, 2024

చీపురుపల్లిలో కాపులదే కీలక పాత్ర

image

చీపురుపల్లి నియోజకవర్గంలోని రాజకీయాలపై కాపు సామాజిక వర్గం పాత్ర కీలకం. దీనికి గల కారణం నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల సంఖ్యలో 80 శాతం ఈ సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటమే. ఈ సమీకరణాలతో రెండు ప్రధాన పార్టీలు ఆ సామాజిక వర్గానికి చెందిన వారినే పోటీలో నిలిపాయి. YCP నుంచి బొత్స పోటీ చేస్తుండగా, TDP నుంచి కళా బరిలో నిలిచారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఈ వర్గం ఎవరివైపు మొగ్గుచూపుతుందనే ఉత్కంఠ నెలకొంది.

News April 6, 2024

చెన్నై – భువనేశ్వర్ మధ్య ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చెన్నై-భువనేశ్వర్ మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం తెలిపారు. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-భువనేశ్వర్(06073) మే 6, 13, 20, 27 తేదీల్లో అర్ధరాత్రి 11.45 గంటలకు చెన్నైలో బయలుదేరి తరువాత రోజు ఉదయం 11.15 గంటలకు దువ్వాడ వచ్చి.. వెళుతుందన్నారు. భువనేశ్వర్-చెన్నై సెంట్రల్ (06074) మే 7, 14, 21, 28, జూన్ 4 తేదీల్లో రాత్రి 9కి భువనేశ్వర్‌లో బయలుదేరుతుందన్నారు.

News April 6, 2024

VZM: చికిత్స పొందుతూ యువకుడి మృతి

image

విజయనగరంలోని కేఎల్ పురం సమీపంలో గతనెల 29న ఓ కారు అదుపు తప్పి గోడను ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కేఎల్ పురం ప్రాంతానికి చెందిన శ్రవణ్ కుమార్(33) పనిమీద కారులో వెళ్తుండగా, వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న గోడను ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి, ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు.