India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదర్శ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. పదో తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఒక్కో గ్రూపునకు 40 చొప్పున 160 సీట్లు ఉంటాయి. ఈమేరకు ఉమ్మడి జిల్లాలో 17 పాఠశాలల్లో 2,720 సీట్లను భర్తీ చేయనున్నారు.
విశాఖలోని అల్లిపురం నెరెళ్ల కోనేరు వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పార్కింగ్ స్థలం విషయంలో వేపకాయల శ్రీరాములు, దాము మధ్య జరిగిన స్వల్ప తగాదా హత్యకు దారి తీసింది. వేపకాయ శ్రీరాములు(55)ని దాము అనే వ్యక్తి హత్య చేశాడు. నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. రెండవ పట్టణ సీఐ తిరుమలరావు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
చింతచెట్టు పైనుంచి జారి పడిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఎస్.కోట మండలంలో చోటుచేసుకుంది. సీఐ మురళీరావు వివరాల ప్రకారం.. పెదఖండేపల్లి గ్రామానికి చెందిన టి. దేముడు (74)కూలి పనులకు వెళ్తుండేవాడు. మంగళవారం చింతబొట్టలు తీసేందుకు వెళ్లారు. చెట్టు ఎక్కగా ప్రమాదవశాత్తూ జారిపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి అంబులెన్సులో సర్వజన ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.
విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి గల్లంతైన భోగాపురం మండలం ముక్కాం గ్రామానికీ చెందిన మత్స్యకారుల <<12977348>>ఆచూకీ <<>>లభ్యమయింది. వారంతా అప్పికొండ ప్రాంతానికి చేరుకున్నారు. ఆరుగురు క్షేమంగా ఉన్నారని తెలియడంతో మత్స్యకార కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. అలల ఉద్ధృతికి సముద్రంలో బోటు బోల్తా పడటంతో వారంతా దానిపై భాగంలో ఉండిపోయారు. రాత్రి అప్పికొండ సముద్ర తీరానికి చేరుకున్నట్లు వారు సమాచారం అందించారు.
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన బొండపల్లి మండలంలో చోటుచేసుకుంది. రైల్వే హెచ్సీ బి. ఈశ్వరరావు వివరాల మేరకు మంగళవారం సాయంత్రం గరుడుబిల్లి గ్రామం సమీపంలోని పట్టాలపై మృతదేహాన్ని గుర్తించారు. వయసు సమారు 45 సంవత్సరాలు, ఆకుపచ్చ చొక్కా, నీలం రంగు లుంగీ ధరించినట్లు తెలిపారు. మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు 15 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేకాధికారి నిర్మలాదేవి తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గరనుంచి ఏప్రెల్ 1 వరకు, జిల్లాలో వాలంటీర్లకు సంబంధించి మొత్తం 29 ఫిర్యాదులు అందాయని, వీరిలో 14 మందిని ఇప్పటివరకు తొలగించగా, మిగిలిన 15 మంది రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లాలో ఏప్రిల్, మే నెలల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా వుంటూ ఎండల నుంచి రక్షణ పొందడానికి తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి కోరారు. ఏప్రిల్, మే నెలలో 46. 6 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. జిల్లాస్థాయి అధికారులతో కలెక్టర్ మంగళవారం టెలికాన్ఫరెన్సు నిర్వహించారు.
విజయనగరం నియోజకవర్గంలో 37వ డివిజన్ స్థానిక బీసీ కాలనీలో వాలంటీర్గా పని చేస్తున్న గోక చక్రధార్ జనసేనలో చేరాడు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు నచ్చి రాజీనామా చేసి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో కొర్నాన రామకృష్ణ సమక్షంలో మంగళవారం జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేననీ మరింత బలోతం చేసే దిశగా పని చేస్తామని తెలిపారు.
పార్వతీపురంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతనతో వైసీపీ మేమంతా సిద్ధం సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైవి సుబ్బారెడ్డి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మన్యం జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు, ఎంపీ అభ్యర్థి తనుజ పాల్గొన్నారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవారిని లక్షాధికారులుగా చేసిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను అన్నారు
విశాఖలో ఈనెల 3న జరగనున్న ఐపీఎల్ టీ-20 మ్యాచ్ సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2.00 గంటల నుంచి రాత్రి 12:00 వరకు భారీ వాహనాలకు మధురవాడ స్టేడియం వైపు అనుమతి లేదు. అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే వాహనాలు సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వెళ్లే వాహనాలు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా వెళ్ళాలి.
Sorry, no posts matched your criteria.