Vizianagaram

News April 2, 2024

VZM: కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..

image

ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి తొలి విడతలో ఐదుగురు ఎమ్మెల్యే అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. విజయనగరం, అరకు ఎంపీ అభ్యర్థులతో పాటు మరో నాలుగు నియోజకవర్గల ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
✒ పార్వతీపురం- బత్తిన మోహన్ రావు  
✒ సాలూరు- మువ్వల పుష్పారావు  
✒ చీపురుపల్లి- తుమ్మగంటి సూరినాయుడు  
✒ గజపతినగరం- గడపు కూర్మినాయుడు  
✒ విజయనగరం- సుంకరి సతీష్ కుమార్‌

News April 2, 2024

గ్రామాల్లో జరిగే అభివృద్ధి ప్రజల్లోకి: వైవీ సుబ్బారెడ్డి

image

గ్రామాల్లో జరిగే అభివృద్ధి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లానని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం బొబ్బిలి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో బెల్లాన చంద్రశేఖర్, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనువాసరావు, బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి చిన వెంకట అప్పలనాయుడు, బొబ్బిలి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

News April 2, 2024

విజయనగరం ఎంపీగా నెగ్గేదెవరు?

image

విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. అప్పటి నుంచి 3 సార్లు ఎన్నికలు కాగా 3 విభిన్న పార్టీల అభ్యర్థులు గెలిచారు. 2009లో కాంగ్రెస్ నుంచి బొత్స ఝాన్సీ, 2014లో TDP నుంచి అశోక్ గజపతిరాజు, 2019లో YCP నుంచి బెల్లాన చంద్రశేఖర్ MPలుగా గెలిచారు. ఈ సారి YCP నుంచి బెల్లాన మరోసారి పోటీచేస్తుండగా, TDP ఉమ్మడి అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు బరిలో దిగారు. వీరిలో ఎవరు పైచేయి సాధిస్తారో కామెంట్ చేయండి.

News April 2, 2024

పార్వతీపురం: ప్రారంభమైన రాయగడ గుంటూరు రైలు సర్వీసు

image

రాయగడ- గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు పున ప్రారంభించినట్లు స్టేషన్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. గత కొన్ని రోజులుగా కొన్ని కారణాలవల్ల ఉన్నతాధికారుల ఈ రైలు సర్వీసును నిలిపివేసినట్లు తెలిపారు. నేటి నుంచి యధావిధిగా ఈ రైలు సర్వీసును పున ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులంతా ఈ రైలు సర్వీసులు వినియోగించుకోవచ్చన్నారు.

News April 2, 2024

విశాఖ: సముద్ర తీరంలో మూడు ముళ్ల బవిరి చేప

image

విశాఖ నగరం రుషికొండ బీచ్ సమీపంలో గల సముద్ర తీరంలో సోమవారం మత్స్యకారుల వలకు వివిధ ఆకారాల్లో ఉన్న రెండు బవిరి చేపలు చిక్కాయి. వీటి వెన్నుపై ఒక ముల్లు ముందు భాగంలో రెండు ముళ్లు ఉన్నాయి. సముద్రం లోపల సంచరించే ఈ చేపలు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అప్పుడప్పుడు ముందుకు వస్తుంటాయని మత్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బి శ్రీనివాసరావు తెలిపారు.

News April 2, 2024

ఈ నెల 4న నెల్లిమర్లకు పవన్

image

నెల్లిమర్ల రామతీర్థం కూడలిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 4న ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్న స్థలాన్ని విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు సోమవారం పరిశీలించారు. పోలీసు బందోబస్తుపై సిబ్బందితో సమాలోచన చేశారు. విజయనగరం నుంచి పాలకొండ వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచార సభ సజావుగా జరిగేలా బందోబస్తు చేపట్టాలని సూచించారు.

News April 2, 2024

పార్వతీపురం మన్యం జిల్లాలో దరఖాస్తు గడువు పెంపు

image

2024-25 విద్యా సంవత్సరంలో పార్వతీపురం మన్యంలో జిల్లా ఆదర్శ పాఠశాలలు అయిన భామిని, కురుపాం, ములక్కాయవలస (మక్కువ) పురోహితునివలస (సాలూరు)లో ఆరవ తరగతి ప్రవేశ పరీక్షా ఏప్రిల్ 21వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారి జి.పగడాలమ్మ తెలిపారు. ప్రవేశం కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనుటకు మార్చి 31తో ముగియగా, ఏప్రిల్ 6వ తేది వరకు దరఖాస్తు గడువు తేదీ పెంచినట్లు ఆమె తెలిపారు.

News April 1, 2024

VZM: ‘టీడీపీ ఇన్‌ఛార్జ్‌కు లోకేశ్ హామీ’

image

జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నాయకులు ఉండవల్లిలోని నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానంగా ఇటీవల అలకబూనిన నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ కర్రోతు బంగార్రాజు తన బృందంతో భేటీ అయ్యారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు ఏదైనా కార్పొరేషన్ పదవితో పాటు ఎమ్మెల్సీ కూడా ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట ఆకిరి ప్రసాద్, కడగల ఆనంద్ తదితరులు ఉన్నారు.

News April 1, 2024

విశాఖ: పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల

image

ఏపీ పీజీ సెట్-2024 నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కన్వీనర్ ఆచార్య జి.శశిభూషణరావు తెలిపారు.
✒ మే 4 వరకు దరఖాస్తుల స్వీకరణ, మే5 నుంచి 15 వరకు రూ.500, మే15 నుంచి మే25 వరకు రూ.1000 ఫైన్‌తో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
✒ ఫీజు:రూ.850(OC), రూ.750(BC),రూ.650(దివ్యాంగులు, SC, ST)
✒ ఎడిట్ ఆప్షన్: మే 27 నుంచి 29 వరకు
✒ హాల్ టికెట్ల డౌన్‌లోడ్: మే 31 నుంచి
✒ పరీక్ష తేదీలు: జూన్ 10 – 14 వరకు
> Share it

News April 1, 2024

విజయనగరం: డబుల్ హ్యాట్రిక్ కొట్టిన ఆపార్టీ ఈసారి గెలుస్తుందా?

image

విజయనగరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 1978 నుంచి 2004 మినహా 2009 వరకు పి.అశోక్ గజపతిరాజు TDP నుంచి గెలుపొందారు. ఇక్కడ తొలిసారి 2019లో టీడీపీ అభ్యర్థి అదితి గజపతిరాజుపై కోలగట్ల వీరభద్ర స్వామి 6417 ఓట్ల మెజారిటీతో పోటీ చేసి YCP జెండా ఎగురవేశారు. ఈసారి కూడా YCP,TDP నుంచి వీరే బరిలో ఉన్నారు. మరి రానున్న 2024 ఎన్నికలలో 2019 ఫలితాలు రిపీట్ అవుతాయా.. లేదా? ..కామెంట్ చేయండి.