Vizianagaram

News April 1, 2024

విజయనగరం: ఏప్రిల్ 4 నుంచి పింఛను పంపిణీ

image

జిల్లాలో ఈనెల 4 వతేదీ నుంచి పింఛను సొమ్ము పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి నెలా ఒకటో తేదీనే పంపిణీ చేసే పింఛను ఆర్థిక సంవత్సరం చివరి రోజుకావడంతో అంతరాయం ఏర్పడింది. ఏప్రిల్ 1 బ్యాంకుకు సెలవు, 2వ తేదీ పింఛను బడ్జెట్‌ను బ్యాంకు విడుదల చేస్తుంది. 3న వార్డు, సచివాలయ సిబ్బంది డబ్బును బ్యాంకు నుంచి డ్రా చేసుకుని 4 వ తేదీన పంపిణీ చేయనున్నారు.

News April 1, 2024

అంతా సీఎం అనుకున్నట్లే జరిగింది: గంటా

image

డీఎస్సీ విషయంలో అంతా సీఎం జగన్ అనుకున్నట్లే జరిగిందని భీమిలి టీడీపీ MLA అభ్యర్థి గంటా శ్రీనివాస్ రావు విమర్శించారు. ఐదేళ్లపాటు నిద్రపోయి ఎన్నికల ముందు కోడ్ వస్తుందని తెలిసి అడ్డగోలు నిబంధనలతో డీఎస్సీ ప్రకటన ఇచ్చారని ట్విటర్ లో పేర్కొన్నారు. టెట్, డీఎస్సీ శిక్షణ కోసం నిరుద్యోగులు వేలాది రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. జగన్ కుట్ర అందరికీ అర్థమైందని అన్నారు.

News April 1, 2024

MLAగా గెలిచాక TDPలో చేరుతా: కృష్ణ

image

అందరూ ఆదేశిస్తే S.కోట నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని టీడీపీ నాయకుడు గొంప కృష్ణ చెప్పారు. ‘ఎస్.కోటకు వచ్చి రెండేళ్లలో అందరి అభిమానం సంపాదించా. సేవ చేయడానికే ఇక్కడికి వచ్చా. నేను టీడీపీకి వ్యతిరేకం కాదు. ఇండిపెండెంట్‌గా గెలిచిన వెంటనే టీడీపీలో చేరుతా’ అని ఎస్.కోటలో నిన్న జరిగిన కార్యకర్తల సమావేశంలో కృష్ణ అన్నారు.

News April 1, 2024

VZM: ‘ఏప్రిల్ 14లోగా ఓటుకోసం దర‌ఖాస్తు చేసుకోవాలి’

image

18 సంవత్సరాలు నిండినవారంతా ఏప్రిల్ 14వ తేదీలోగా ఓటుకోసం దర‌ఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. వాటిని ప‌రిశీలించి 10 రోజుల్లో నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రుగుతుందన్నారు. వీరికి మాత్ర‌మే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొత్త‌గా ఓటేసే అవ‌కాశం ల‌భిస్తుందని, అర్హ‌త ఉన్న‌వారంతా ఓటు హ‌క్కు పొంద‌డ‌మే కాకుండా, ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకోవాలని సూచించారు.

News March 31, 2024

VZM: ‘ఏప్రిల్ 14లోగా ఓటుకోసం ధ‌ర‌ఖాస్తు చేసుకోవాలి’

image

18 సంవత్సరాలు నిండినవారంతా ఏప్రిల్ 14వ తేదీలోగా ఓటుకోసం ధ‌ర‌ఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. వాటిని ప‌రిశీలించి 10 రోజుల్లో నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రుగుతుందన్నారు. వీరికి మాత్ర‌మే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొత్త‌గా ఓటేసే అవ‌కాశం ల‌భిస్తుందని, అర్హ‌త ఉన్న‌వారంతా ఓటు హ‌క్కు పొంద‌డ‌మే కాకుండా, ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకోవాలని సూచించారు.

News March 31, 2024

VZM: కేంద్ర మాజీ మంత్రిని కలిసిన కూటమి అభ్యర్థులు

image

కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును కూటమి అభ్యర్థులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థి లోకం నాగ మాధవి.. ఆయన బంగ్లాలో అశోక్ గజపతిరాజును కలిసి మద్దతు పలకాలని కోరారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలుస్తామని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

News March 31, 2024

విజయనగరం: ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు పలువురు దూరం..!

image

కుటుంబంలో ఒకరికే సీటు కేటాయించడంలో పలువురు టీడీపీ సీనియర్లు పోటీకి దూరమయ్యారు. విజయనగరంలో కుమార్తెకు టికెట్ ఇవ్వడంతో అశోక్ గజపతిరాజు, బొబ్బిలిలో తమ్ముడు పోటీలో ఉండడంతో సుజయ్ కృష్ణ రంగారావు, గజపతినగరంలో అన్న కొడుకు అభ్యర్థి కావడంతో కొండపల్లి అప్పలనాయుడు, చీపురుపల్లి సీటు పెదనాన్నకు ఇవ్వడంతో కిమిడి నాగార్జున ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు దాదాపు దూరం అయ్యినట్లే కనిపిస్తుంది.

News March 31, 2024

VZM: లవ్ ఫెల్యూర్.. యువకుడు మృతి

image

ప్రేమించిన యువతి మోసం చేసిందని దివ్యాంగ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న యువకుడు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. భోగాపురం మండలం కంచేరుకు చెందిన యువకుడిని ఓ యువతి మోసం చేసిందనే మనస్థాపంతో పురుగుమందు తాగాడు. నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడి నిన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందాడు.

News March 31, 2024

విజయనగరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

గజపతినగరం మండలం మదుపాడ గ్రామం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రామారావు (40) మృతి చెందినట్లు ఎస్.ఐ మహేష్ తెలిపారు. రామారావు కాలకృత్యాలు తీర్చుకోవడానికి రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ అతనిని 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందినట్లు తెలిపారు.

News March 31, 2024

VZM: కేవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కేంద్రీయ విద్యాలయం (బాబామెట్ట)లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఒకటో తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 15న సాయంత్రం వరకు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఒకటో తరగతిలో 32 సీట్లకు విద్యాహక్కు చట్టం ప్రకారం ఎనిమిది రిజర్వు చేసినట్లు తెలిపారు. రెండు, ఆపై తరగతులకు ఖాళీల మేరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.