Vizianagaram

News March 27, 2024

VZM: గుండె పోటుతో టీచర్ మృతి

image

విజయనగరం ఉడా కాలనీలో గుండెపోటుకు గురై ఉపాధ్యాయుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. కే.వెంకటరమణ అనే ఫిజిక్స్ టీచర్ మంగళవారం విజయనగరం బాలికల పాఠశాలకు పదో తరగతి పరీక్షల ఇన్విజిలేషన్‌కి వెళ్లేందుకు బయలుదేరుతుండగా గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే కుబుంబ సభ్యులు 108లో ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

News March 27, 2024

పార్వతీపురం: ‘మంచినీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలి’

image

రానున్న మూడు నెలలలో మంచినీటి సరఫరాకు కావలసిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మండల అభివృద్ది అధికారులు, మండల ఇంజినీరింగు అధికారులతో మంచినీటి సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

News March 26, 2024

VZM: ‘కోడ్‌కి ముందున్న శిలాఫలకాలకు కోడ్ వర్తించదు’

image

ఎన్నికల కోడ్ అమలులోకి రాక ముందు లబ్ధిదారుల వద్ద నున్న పాస్ పుస్తకాల పైన లేదా ఏ ఇతర లబ్ధిదారు కార్డుల పైన ఉన్న ప్రభుత్వ లోగోలు, ముఖ్యమంత్రి ఫోటోలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకి రావని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. కోడ్ రాక ముందు వేసిన శిలా ఫలకాలు, సర్వే రాళ్లకు కూడా కోడ్ వర్తించదని తెలిపారు. మోడల్ కోడ్ అమలు అదికారులు కోడ్‌లోని అంశాలను క్షున్నంగా చదవాలని తెలిపారు.

News March 26, 2024

పదోతరగతి పరీక్షలకు 816 మంది గైర్హాజరు

image

విజయనగరం జిల్లాలో మొత్తం 129 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జీవశాస్త్రం పరీక్షలకు మొత్తం 25,287 విద్యార్థులు మంగళవారం హాజరయ్యారు. కాగా 816 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్ తెలిపారు. మాస్ కాపీయింగ్ వంటి పిర్యాదులు ఎక్కడ అందలేదన్నారు. జిల్లా మొత్తం జీవశాస్త్రం పరీక్ష సజావుగా జరిగిందన్నారు. జిల్లా మొత్తం హాజరు 96.87 శాతం నమోదు అయ్యిందన్నారు.

News March 26, 2024

తెర్లాం: గుండెపోటుతో డిజిటల్ అసిస్టెంట్ మృతి

image

తెర్లాం మండలం సుందరాడ గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్న ఉప్పాడ శ్రీకాంత్ ఈరోజు మధ్యాహ్నం భోజనం కోసం తన సొంత ఊరు ఉద్దవోలు వెళుతుండగా మార్గమధ్యంలో గుండెపోటుతో ఒక్కసారి కుప్ప కూలిపోయాడు. వెంటనే దగ్గరలో ఉన్న ఓ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News March 26, 2024

VZM: ఈవీఎంల భద్రతను సమీక్షించిన కలెక్టర్

image

స్థానిక ఈవీఎం గోదాముల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి మంగ‌ళ‌వారం త‌నిఖీ చేశారు. అక్క‌డి భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై స‌మీక్షించారు. గోదాముల‌ను తెరిపించి, నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఏర్పాటు చేసిన గ‌దుల‌ను, ఈవీఎంల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం మ‌ళ్లీ గోదాముల‌కు సీల్ వేయించారు. గోదాములలోని సీసీ కెమేరాలను త‌నిఖీ చేశారు. ఈవీఎంల తొలిద‌శ త‌నిఖీకి ఏర్పాట్లు చేయాల‌ని ఈ సంద‌ర్భంగా అధికారుల‌ను ఆదేశించారు.

News March 26, 2024

పార్వతీపురం: ‘సువిధలో 48 గంటల ముందుగా దరఖాస్తు చేయాలి’

image

ఎన్నికల అనుమతులకు సువిధ ఆన్లైన్ యాప్‌లో కనీసం 48 గంటల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ప్రతి అంశానికి సంబంధించి అనుమతులు విధిగా పొందాలన్నారు.

News March 26, 2024

విజయనగరం: మంటల్లో పడి మహిళ మృతి

image

ప్రమాదవశాత్తు మంటల్లో పడి ఓ మహిళ మృతి చెందిన విషాదకర ఘటన గజపతినగరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కొత్తబగ్గాం గ్రామానికి చెందిన ఎస్.బంగారమ్మ(45) ఆదివారం పొలంలో ఉన్న పిచ్చి మొక్కలను ఏరి, నిప్పు పెట్టారు. ఈ క్రమంలోనే ఆమెకు మూర్చరావడంతో మంటల్లో పడిపోయారు. తీవ్ర గాయాలైన ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

News March 26, 2024

విజయనగరం ఎంపీ సీటు.. ఐవీఆర్ఎస్‌లో ఆ ముగ్గురి పేర్లు..!

image

విజయనగరం ఎంపీ అభ్యర్థి ఎంపిక కోసం TDP ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తుంది. ఈ సర్వేలో మూడు పేర్లను తెరపైకి తీసుకువచ్చారు. సర్వేలో కలిశెట్టి అప్పలనాయుడు, కంది చంద్రశేఖర్, మీసాల గీత అభ్యర్థిత్వాలపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. కాగా.. మీసాల గీత విజయనగరం ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడగా.. కలిశెట్టి అప్పలనాయుడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అసెంబ్లీ సీటు ఆశిస్తున్నారు.

News March 26, 2024

VZM: మద్యం అక్రమరవాణా కేసుల నమోదు

image

జిల్లా వ్యాప్తంగా మద్యం అక్రమరవాణాపై పోలీసులు సోమ వారం దాడులు నిర్వహించారు. ఈ మేరకు మద్యం అక్రమ రవాణాకు పాల్పడిన నిందితులపై 16 కేసులు నమోదుచేసి 60.3 లీటర్ల ఐఎంఎఫ్ఎల్ మద్యం స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై 32 కేసులు, మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 20 కేసులు, కోడిపందాలు, పేకాట ఆడుతున్న వారిపై మూడుకేసులు నమోదుచేసి, 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.