India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పార్వతీపురం-కురుపాం ప్రధాన రహదారిలోని ఖడ్గవలస కూడలిలో ఉన్న రైస్ మిల్లు వద్ద ఏనుగుల గుంపు ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. ప్రధాన రహదారిపై ప్రయాణించేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏనుగుల గుంపు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. పరిసర ప్రాంతాల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప రహదారుల పైకి రావద్దని సూచించారు.
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. చోడవరంలో మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ అధ్యక్షతన పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బొత్స మాట్లాడుతూ.. జగన్ తనను నమ్మి అభ్యర్థిగా ఖరారు చేశారన్నారు. ప్రజా ప్రతినిధులు కలిసిమెలిసి పనిచేసి గెలిపించాలని కోరారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లా మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, విజయనగర జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై సీఎంతో చర్చించారు.
చేనేత వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించడంలో భాగంగా ప్రతి శుక్రవారం చేనేత వస్త్రాలను ధరిస్తానని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విశాఖలో ఆదివారం నిర్వహించిన ఐకాన్ మెగా ట్రేడ్ ఫెయిర్ కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతి రాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. చేనేత పరిశ్రమ మనుగడ సాగించాలంటే ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
విజయవాడలో ఓ ప్రైవేట్ హోటల్లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడి ప్రత్యేక సమావేశం జరిగింది. ప్రస్తుత కార్యవర్గం రాజీనామాలు సమర్పించడంతో..వెంటనే త్రీ మెన్ కమిటీని అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బొబ్బిలికి చెందిన మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుకు కమిటీలో చోటు దక్కింది. ఎన్నికలు జరిగేంత వరకు త్రీ మెన్ కమిటీ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నిర్వహణ బాధ్యతలు కొనసాగిస్తుంది.
VMRDA పరిధిలో ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందేలా వినూత్న ప్రాజెక్టులు, ప్రణాళికలతో ముందుకు వెళుతున్నట్లు కమిషనర్ కేఎస్.విశ్వనాథన్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ప్రకృతిని పరిరక్షించే విధంగా ప్రాజెక్టుల రూపకల్పన జరుగుతుందన్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ సమీపంలో అదనంగా 500 ఎకరాల్లో ఏరో సెంటర్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
ఎస్.కోటలోని సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న సాగర్ అనే ఉద్యోగి శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన తల్లిదండ్రులను చూసేందుకు బైక్పై శ్రీకాకుళం బయలుదేరాడు. రణస్థలం సమీపంలో రోడ్డు ప్రమాదం జరగడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు అతని స్నేహితులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విజయనగరం జిల్లాలో పోలీస్ శాఖలో పనిచేస్తూ ఇటీవల మరణించిన పలువురి కుటుంబాలకు తోటి సిబ్బంది అండగా నిలిచారు. వారి ఒకరోజు వేతనాన్ని జమచేసి ఎస్పీ వకుల్ జిందాల్ చేతులమీదుగా శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి అందే సాయం కోసం వేచి చూడకుండా తోటి అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆదుకోవడం అభినందనీయమని అన్నారు.
సార్వత్రిక విద్యాపీఠం 2024- 25 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి, ఇంటర్ దూర విద్యా విధానం కోర్సులలో ప్రవేశాల కోసం నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ప్రకటించారు. దీనికి సంబంధించిన గోడపత్రికను స్థానిక కలెక్టర్ కార్యాలయ ఛాంబర్లో ఆవిష్కరించారు. చదువు మధ్యలో ఆపేసిన వారిని గుర్తించి లక్ష్యం మేర నమోదు ప్రక్రియ జరిగేవిధంగా చర్యలు చేపట్టాలని విద్యా శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఉమ్మడి విజయనగరం వాసులు ఫ్రెండ్షిప్కి ప్రాణమిస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు విడదీయలేని బంధాలెన్నో. సంతోషంలోనే కాదు ఆపదలోనూ అండగా ఉండే మిత్రులెందరో. పాఠశాల స్థాయి నుంచి ఉన్న స్నేహాలైతే లైఫ్లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్వెల్ పార్టీలో కన్నీరుపెట్టిన మిత్రులెందరో కదా. అలాంటి వారి కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ ప్రాణ స్నేహితుడు ఎవరు?
☞ Happy Friendship Day
Sorry, no posts matched your criteria.