Vizianagaram

News March 26, 2024

పార్వతీపురం ఎమ్మెల్యేపై కోడ్ ఉల్లంఘన కేసు

image

పార్వతీపురం ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావుపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదయ్యింది. ఈనెల 21న ఎలాంటి అనుమతులు లేకుండా పార్వతీపురం పట్టణం కొత్తవలసలో ఉ.8గంటలకు ప్రచారం చేశారని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన అనంతరం పార్వతీపురం పట్టణ పోలీసులు జోగారావుపై కేసు నమోదు చేశారు. కాగా.. బొబ్బిలి ఎమ్మెల్యేపై కూడా ఇటీవల కోడ్ ఉల్లంఘన కేసు నమోదయ్యింది.

News March 26, 2024

‘కురుపాం అభ్యర్థి భర్తపై సస్పెన్షన్ అన్యాయం’

image

కురుపాం టీడీపీ అభ్యర్థి జగదీశ్వరి భర్తపై సస్పెన్షన్ అన్యాయమని టీడీపీ, గిరిజన సంఘాల నాయకులు ఎం. భూషణరావు, ఎం. ప్రసాదరావు, కడ్రక కళావతి అన్నారు. టీడీపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేక రాజకీయ సంబంధం లేని ఉపాధ్యాయుడిపై వైసీపీ కుట్ర చేసిందని ఆరోపించారు. అనధికారికంగా ఐటీడీఏ వసతిగృహాల్లో ఉంటున్న వైసీపీ నాయకులను ఖాళీ చేయించాలని డిమాండు చేశారు.

News March 26, 2024

దివ్యాంగులకు మెడికల్ అసెస్మెంట్ క్యాంప్స్: డీఈఓ

image

జిల్లాలో మెడికల్ అసెస్మెంట్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి జి. పగడాలమ్మ తెలిపారు. మన్యం జిల్లా సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో 3 సం. నుంచి 18 సం. గల దివ్యాంగ విద్యార్థులకు వైకల్యం నిర్ధారించుటకు నిపుణుల వైద్యుల పర్యవేక్షణలో మెడికల్ అసెస్మెంట్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామన్నారు. వైకల్య నిర్ధారణ పరీక్షల అనంతరం వారికీ అవసరమగు ఉపకరణాలు అందజేస్తామని తెలిపారు.

News March 25, 2024

రామతీర్థం పుణ్యక్షేత్రంలో ఘనంగా డోలోత్సవం

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో డోలోత్సవం కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి పర్వదినం సందర్భంగా రామస్వామి ఆలయంలోని గోవిందరాజ స్వామి, సీతారామలక్ష్మణుల ఉత్సవ విగ్రహాలను కొండ వద్ద ఉన్న మండపం వద్దకు అర్చకులు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి, డోలోత్సవం జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

News March 25, 2024

జిరాఫీ మృతిపై విశాఖ జూ క్యూరేటర్ వివరణ

image

విశాఖ జూలో 24వ తేదీ అర్ధరాత్రి బెకన్ అనే మగ <<12921248>>జిరాఫీ<<>> మృతి చెందడంపై క్యూరేటర్ నందిని సలారియ వివరణ ఇచ్చారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం కార్డియో-పల్మనరీ ఫెయిల్యూర్ కారణంగా జిరాఫీ మృతి చెందిందన్నారు. సంవత్సర కాలంగా జిరాఫీకి చికిత్స అందిస్తున్నామన్నారు. చికిత్స కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైల్డ్ లైఫ్ వెటర్నరీ వైద్యులను నిపుణులను సంప్రదించినా లాభంలేకపోయిందన్నారు.

News March 25, 2024

బొబ్బిలి ఎమ్మెల్యేపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు 

image

బొబ్బిలి MLAపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదయ్యింది. అనుమతులు లేకుండా ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడుతో పాటు మరికొంత మంది వైసీపీ నాయకులపై ఎన్నికల అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చిత్రకోట, బొడ్డవలస పంచాయతీలోని ఎంసీసీ కోడ్‌కు వ్యతిరేకంగా పార్టీ ప్రచారం చేస్తున్నారన్న అభియోగంపై ఏఆర్‌ఓ, RDO సాయి శ్రీ ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు S.I తెలిపారు.

News March 25, 2024

శృంగవరపుకోటలో ఇద్దరూ మహిళలే గెలిచారు

image

1952 నాటి నుంచి 2019 వరకు ఎస్.కోట నియోజకవర్గంలో17 సార్లు జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇద్దరు మహిళలు మాత్రమే గెలుపొందారు. 1999లో టీడీపీ నుంచి తొలిసారిగా శోభా హైమావతి కాంగ్రెస్ అభ్యర్థి గంగాధర స్వామి శెట్టిపై విజయం సాధించారు. టీడీపీ నుంచి కోళ్ల లలిత కుమారి 2009లో కాంగ్రెస్ అభ్యర్థి ఏ.జోగినాయుడు, 2014లో వైసీపీ అభ్యర్థి రొంగలి జగన్నాథంపై విజయం సాధించారు.

News March 25, 2024

విజయనగరం: పెళ్లి కార్డుపై ఆరు గ్యారంటీలు

image

టీడీపీ మీద ఉన్న అభిమానన్ని ఓ వ్యక్తి కొత్తగా పంచుకున్నారు. బలిజపేట మండలానికి బసన్నారాయువలస గ్రామానికి కృష్ణారావు వివాహం మార్చి 24 ఆదివారం జరిగింది. టీడీపీ సూపర్ సిక్స్ పథకాల వివరాలను పెళ్లి కార్డుపై ముద్రించి బంధువులకు అందించారు. పథకాలతో పాటు చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ బొబ్బిలి, పార్వతీపురం తెదేపా అభ్యర్థుల చిత్రాలను ముద్రించారు. ప్రస్తుతం ఈ పత్రిక వైరల్‌గా మారింది.

News March 25, 2024

విజయనగరం: ఎస్ కోటలో త్రిముఖ పోటీ తప్పదా?

image

ఎస్‌కోట నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. YCP ఎమ్మెల్యే అభ్యర్థిగా కడుబండి శ్రీనివాసరావు పోటీలో ఉండగా, TDP నుంచి కోళ్ల లలిత కుమారి బరిలో ఉన్నారు. ఇదిలా ఉంటే TDP నుండి టికెట్ ఆశించి భంగపడిన గొంపకృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తూ అభిమానులు, నాయకులు ఆదేశిస్తే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఆదివారం జరిగిన బహిరంగసభలో ప్రకటించడంతో ఎస్‌కోటలో త్రిముఖ పోటీ ఖాయమని స్థానికులు అంటున్నారు. దీనిపై మీ కామెంట్?

News March 25, 2024

విజయనగరం లోక్‌సభ స్థానం టీడీపీదే.!

image

పొత్తులో భాగంగా విజయనగరం లోక్‌సభ సీటు తొలుత BJP ఆశించింది. నిన్న ఆ పార్టీ ఆరుగురు MP అభ్యర్థులను ప్రకటించి.. విజయనగరానికి బదులు రాజంపేటలో మాజీ CM కిరణ్ కుమార్‌‌ను బరిలో నిలిపింది. దీంతో విజయనగరం నుంచి TDP పోటీ ఖరారైనట్లే. ఇక్కడి నుంచి కిమిడి కళా వెంకట్రావు, కిమిడి నాగార్జున పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ టికెట్ నర్సాపురం MP రఘురామరాజు ఆశిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.