Vizianagaram

News April 5, 2025

VZM: యువతిపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి

image

విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని శివరాంలో యువతిపై ఇద్దరు యువకులు మాస్కులు వేసుకొని వచ్చి కత్తితో శనివారం దాడి చేశారు. యువతి గ్రామంలో ఇంటి వద్ద పనులు చేస్తుండగా ఇద్దరు యువకులు కత్తితో పొడిచి పారిపోయారు. గాయపడిన 18 ఏళ్ల యువతిని చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. గరివిడి పోలీసులు విచారణ చేపట్టారు.

News April 5, 2025

VZM: జిల్లాలో మూడు అన్న కాంటీన్లకు రాష్ట్ర స్థాయి ర్యాంక్‌లు

image

రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల నిర్వ‌హించిన క్యూఆర్ కోడ్ ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌లో జిల్లాకు చెందిన మూడు అన్న క్యాంటీన్లు మెరుగైన ర్యాంకుల‌ను సాధించాయి. బొబ్బిలి ఆర్అండ్‌బీ ఆఫీసు స‌మీపంలోని అన్న క్యాంటీన్‌కు రాష్ట్ర‌ స్థాయిలో ఐదో స్థానం, విజ‌య‌న‌గ‌రం ప్ర‌కాశం పార్కులోని క్యాంటీన్‌కు ఏడో స్థానం, ఘోషా ఆసుప‌త్రిలోని అన్న క్యాంటిన్‌కు ప‌దో స్థానం ద‌క్కాయని కలెక్టర్ అంబేడ్కర్ శుక్రవారం తెలిపారు.

News April 5, 2025

బొండపల్లి: ఆన్‌లైన్ బెట్టింగ్.. ఏడుగురి అరెస్ట్

image

మండల కేంద్రమైన బొండపల్లిలో ఆన్‌లైన్ బెట్టింగ్ రాయుళ్లపై పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు జరిపారు. ఏడుగురిపై కేసు నమోదు చేసి ఇద్దరిని వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై యు.మహేశ్ తెలిపారు. వారి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News April 5, 2025

విజయనగరం డిపోలో ఆర్టీసీ బస్సు చోరీ

image

విజయనగరం RTC డిపోలో ఉన్న హయ్యర్ బస్సును(AP35Y1229) ఈనెల 2న దొంగలు ఎత్తికెళ్లినట్లు బస్సు యజమాని సాగి కృష్ణమూర్తిరాజు 1టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చీపురుపల్లి-విజయనగరం మధ్య తిరిగే బస్సును ఈనెల 2న రాత్రి డిపో పార్క్ చేయగా.. మూడో తేది ఉదయం వచ్చేసరికి కనిపించలేదన్నారు. బస్సుకు తాళం ఉండటంతో ఎవరూ లేని సమయంలో దొంగలు ఎత్తికెళ్లినట్లు శుక్రవారం ఫిర్యాదు చేశారు. బస్సు డ్రైవర్‌ను విచారించినట్లు సమాచారం.

News April 5, 2025

మ‌రింత మెరుగ్గా అన్న క్యాంటీన్ల నిర్వ‌హ‌ణ‌: క‌లెక్ట‌ర్

image

జిల్లాలోని మూడు అన్న క్యాంటీన్ల‌కు రాష్ట్ర‌స్థాయిలో మెరుగైన ర్యాంకులు ల‌భించ‌డం ప‌ట్ల అధికారుల‌ను క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేడ్క‌ర్ శుక్రవారం అభినందించారు. వీటి నిర్వ‌హ‌ణ‌ను మ‌రింతగా మెరుగుప‌రిచి, ప్ర‌జ‌ల‌కు రుచిక‌రంగా, నాణ్య‌మైన భోజ‌నాన్ని, అల్పాహారాన్ని అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. జిల్లాలోని అన్ని అన్న‌ క్యాంటీన్లు ఈ ఘనత సాధించాలని ఆకాంక్షించారు.

News April 5, 2025

పండ్ల వర్తకులకు విజయనగరం జేసీ హెచ్చరిక

image

ర‌సాయ‌నిక ప‌దార్థాలు వినియోగించి ప‌ళ్ల‌ను కృత్రిమంగా పండించి విక్ర‌యించే వారిపై కేసులు న‌మోదు చేస్తామ‌ని విజయనగరం జేసీ ఎస్‌.సేతుమాధ‌వ‌న్ హెచ్చరించారు. క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలోని JC ఛాంబ‌ర్‌లో టాస్క్ ఫోర్స్ సిబ్బందితో శుక్రవారం సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ.. కృత్రిమంగా పండించే పండ్లు త‌క్కువ రుచితో వుంటాయ‌న్నారు. ప్రజలకు విస్తృత అవగాహన చేపట్టాలని సూచించారు.

News April 4, 2025

VZM: క్వారీలో జారిపడి కార్మికుడు మృతి

image

వేపాడ మండలం వీలుపర్తి క్వారీ వద్ద ప్రమాదవశాత్తు జారిపడి క్వారీ కార్మికుడు చింతల సత్తిబాబు (54) శుక్రవారం మృతి చెందాడు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చర్లపాలెంకు చెందిన సత్తిబాబు క్వారీలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. క్వారీలో పని చేస్తుండగా శుక్రవారం ఉదయం జారీపడడంతో తీవ్రంగా గాయపడి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News April 4, 2025

విజయనగరం జిల్లాలో నామినేటెడ్ పోస్టులు వీరికే

image

విజయనగరం జిల్లాలో పలువురు నాయకులను నామినేటెడ్ పదవులు వరించాయి. విజయనగరం, గజపతినగరం, రాజాం మార్కెట్ కమిటీ ఛైర్మన్లను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. రాజాం ఏఎంసీ ఛైర్‌పర్సన్‌గా పొగిరి కృష్ణవేణి(జనసేన), గజపతినగరం మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా పీ.వీ.వీ గోపాలరాజు(టీడీపీ), విజయనగరం ఏఎంసీ ఛైర్మన్‌గా కర్రోతు వెంకటనర్శింగరావుకు(టీడీపీ) అవకాశం ఇచ్చింది.

News April 4, 2025

సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం: ఎస్పీ 

image

విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం “పోలీసు వెల్ఫేర్ డే” నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరిని తన ఛాంబర్‌లోకి పిలిచి, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారి నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు.

News April 4, 2025

విజయనగరంలో ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ 

image

విజయనగరంలోని వీటి అగ్రహారంలో ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్‌ను ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వితేజ్ శుక్రవారం ప్రారంభించారు. ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా రీఛార్జ్ చేసేందుకు ఈ స్టేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వాహనదారులంతా రీఛార్జి స్టేషన్‌ను సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆయనతోపాటు ఈపీడీసీఎల్ జిల్లా అధికారులు ఉన్నారు.