India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యువతిపై అత్యాచారానికి పాల్పడిన హోంగార్డును శాశ్వతంగా విధులు నుంచి తొలగించేందుకు చర్యలు చేపడతామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హోం గార్డుగా పనిచేస్తున్న సురేశ్..ఓ ప్రేమ జంటను బెదిరించి యువతిని నెల్లిమర్లలోని కొండపేటకు తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు హోంగార్డును అరెస్ట్ చేశారు. నిందితుడికి శిక్షపడేలా చూస్తామని ఎస్పీ తెలిపారు.
నెల్లిమర్ల మండలంలోని వల్లూరు గ్రామానికి చెందిన మత్స దివ్య అనే 27 ఏళ్ల మహిళ ఆచూకీ నెల రోజుల నుంచి దొరక్కపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు కాగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. సదరు మహిళ మానసిక సమస్యతో బయటకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే పోలీస్ స్టేషన్ లేదా 9963111089 నంబర్ను సంప్రదించాలని కోరారు.
విజయనగరం జిల్లాలో ముగ్గురు డీఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న విశ్వనాథ్ను సీఐడీ విభాగానికి డీఎస్పీగా, పోలీస్ శిక్షణా కళాశాలలో ఉన్న డీఎస్పీ వీవీ అప్పారావును, చీపురుపల్లి డీఎస్పీ ఏఎస్ చక్రవర్తిని డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
దత్తిరాజేరు మండలం పెదమానాపురానికి చెందిన నాగురోతు రామారావు(55) గజపతినగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం విద్యార్థులను స్కూల్ వద్ద దింపి, అదే వాహనంలో నిద్రించాడు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు రామారావుని పిలవడానికి అటెండర్ వెళ్లగా అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
విశాఖ నుంచి విజయవాడ మీదుగా తిరుపతికి ప్రత్యేక బస్సు సర్వీసును నడపడానికి ఏపీ పర్యాటక సంస్థ ప్రత్యేక ప్యాకేజీ ప్రవేశపెట్టింది. ఆగస్టు 10న మధ్యాహ్నం 3 గంటలకు విశాఖలో ఈ బస్సు బయలుదేరుతుంది. 11 ఉదయాన్నే తిరుపతి చేరుకుంటుంది. ఉదయం 10 గంటలకు శ్రీవారి దర్శనానికి తీసుకువెళ్తారు. తిరుచానూరు, శ్రీకాళహస్తి దర్శనం అనంతరం విశాఖకు బయలుదేరుతుంది. పెద్దలకు రూ.6,300, పిల్లలకు రూ.6,000 చెల్లించాలి.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి పదవ తరగతి, ఇంటర్మీడియట్ లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిందని జిల్లా విద్యాశాఖధికారి జి.పగడాలమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదవ తరగతిలో ప్రవేశానికి 14 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలన్నారు. ఇంటర్మీడియట్ కొరకు పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి 15సంవత్సరాలు నిండిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.
విశాఖ జిల్లా భీమిలి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లిమర్ల పట్టణానికి చెందిన యువకుడు మృతి చెందాడు. చింతలవలస ఎంవీజీఆర్లో బీటెక్ చదువుతున్న సాయి గణేష్, తన స్నేహితుడితో కలిసి భీమిలి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో భీమిలి వద్ద డివైడర్ను ఢీకొట్టడంతో సాయి గణేశ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. వెనుక కూర్చున్న మరో యువకుడికి గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
విజయనగరంలో వాయుకాలుష్య నియంత్రణకు సమగ్ర ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆదేశించారు. నేషనల్ క్లీన్ ఎయిర్ కార్యక్రమంపై కలెక్టర్ తన ఛాంబర్లో సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలో వాయుకాలుష్యం ఎక్కువ ఉందని, దానిని తగ్గించేందుకు వివిధ శాఖల సమన్వయంతో పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని సూచించారు.
గిరిజన ప్రాంతాల్లో డోలీమోతలు కనిపించకూడదని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గిరిజన సంక్షేమశాఖపై సచివాలయంలో జరిగిన సమీక్షలో అధికారులకు పలు సూచనలు చేశారు. ఫీడర్ అంబులెన్సులను తిరిగి ప్రవేశ పెట్టాలన్నారు. గర్భిణి వసతి గృహాలు, ట్రైకార్, జీసీసీ, ఐటీడీఏలను యాక్టివేట్ చేయాలని సూచించారు. గిరిజన విద్యార్థుల కోసం తెచ్చిన పలు పథకాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం నిర్వహించిన గిరిజన సంక్షేమ శాఖ సమీక్షా సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సమీక్షలో ఐటీడీఏలు బలోపేతం, ఫీడర్ అంబులెన్సులు పునరుద్ధరణ, గిరిశిఖర గ్రామాలకు రహదారి సౌకర్యాలు కల్పించడం తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.