India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం లేఖ రాశారు. జొన్నాడ సమీపంలోని ఏర్పాటు చేసిన టోల్ గేట్ను కొత్తగా నిర్మించిన విజయనగరం బైపాస్ రహదారిలోకి తరలించాలని ఎంపీ ఆ లేఖలో పేర్కొన్నారు. జొన్నాడ టోల్ గేట్ వలన వాహన డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని, పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
చిన్నతనంలోనే మనుమడు మృతిని జీర్ణించుకోలేని తాత(హిజ్రా) ఆత్మహత్య చేసుకున్న ఘటన కురుపాం మండలంలోని తిత్తిరి పంచాయతీలో చోటు చేసుకుంది. కీడవాయికి చెందిన బిడ్డిక పృథ్వి ఇటీవల జ్వరంతో మృతి చెందాడు. పృథ్వి మృతిని తట్టుకోలేక తాత బిడ్డిక పాపన్న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. గమనించిన కుటుంబ సభ్యులు భద్రగిరి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పరిధిలోని 26 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.పద్మ లీల తెలిపారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీకి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం http://vizianagaram.ap.gov.in వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పోస్టుల భర్తీ కోసం గతంలో జారీ చేసిన 1/23 నోటిఫికేషన్ను రద్దు చేసి, ఆ స్థానంలో అదనపు పోస్టులు జోడించి మళ్లీ నోటిఫికేషన్ ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.పద్మలీల తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో 13, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 69 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
నెల్లిమర్ల EVM గోడౌన్లో ఉన్న పని చేయని, అదనంగా ఉన్న, ఎన్నికలలో డెమో కు వినియోగించిన డమ్మీలను బెంగళూరుకి తరలిస్తున్నారు. బెల్ కంపెనీకి రెండు వాహనాల్లో కలెక్టర్ డా. బీఆర్.అంబేడ్కర్ ఆధ్వర్యంలో గురువారం పంపించారు. ఎన్నికలలో వినియోగించని (డిఫెక్ట్ ) EVMలలో బీయూలు 174, సీయూలు 930, వివిపాట్లు 224 యూనిట్లను బెల్కు పంపించారు.
ఫెడెక్స్, బ్లూడాట్ కొరియర్స్ పేర్లతో వచ్చే కాల్స్, లింక్స్, వీడియో కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఈ తరహా కాల్స్, లింక్స్, వీడియోకాల్స్తో సైబర్ మోసగాళ్లు ప్రజలకు ఉచ్చు వేస్తూ, వారి నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారన్నారు. ఎవరైనా నగదు పోగొట్టుకుంటే సైబర్ క్రైమ్ పోర్టల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు.
గత ప్రభుత్వంలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు. దీంట్లో మొత్తం 54 మంది ఆనాటి ప్రతిపక్ష నేతలు ఉన్నారు. వీరిలో మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు పేరు కూడా ఉంది. ఈయన పై రెండు కేసులు నమోదైనట్లు సీఎం వెల్లడించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 27న జరగాల్సిన ఎంఎస్సీ రెండో సెమిస్టర్ పరీక్షను ఆగస్టు 2వ తేదీకి వాయిదా వేసినట్లు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ టీ.చిట్టిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27న యూజీసీ నెట్ ప్రవేశ పరీక్ష ఉన్న కారణంగా ఈ పరీక్షను వాయిదా వేశామని తెలిపారు. మిగిలిన తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలు యథావిధిగా జరుగుతాయని వెల్లడించారు. ఆ తేదిల్లో ఎలాంటి మార్పు చేయలేదని సూచించారు.
కొత్తవలస మండలంలోని రెల్లిలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు త్వరలో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రెల్లి రెవెన్యూ పరిధిలోని అప్పన్న దొరపాలెంలో వర్సిటీ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని కేటాయించి శంకుస్థాపన చేశారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దత్తిరాజేరు మండలంలోని కుంటినవలసుకు మార్పు చేసింది.
కుక్కకరిస్తే వేసే యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అన్ని పీహెచ్సీలలో ఉన్నా.. పిచ్చికుక్కలు కరిస్తే వేయాల్సిన హ్యూమన్ రేబిస్ వ్యాక్సిన్ కేజీహెచ్లో మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో అశ్రద్ధ చేస్తే ప్రాణాలకే ముప్పని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాగా.. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు వైద్యులను 8,339 మంది సంప్రదించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఐదేళ్లలో 70 వేలకు పైగానే కుక్కకాటు కేసులు నమోదయ్యాయి.
Sorry, no posts matched your criteria.