Vizianagaram

News July 25, 2024

తోటపల్లి ప్రాజెక్టు వద్ద తాజా పరిస్థితి

image

తోటపల్లి ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహం నిలకడగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 105 మీటర్లు కాగా.. 104.10 మీటర్ల వరకు నీరు నిల్వ ఉందన్నారు. ప్రస్తుతం రెండు గేట్లు ఎత్తి 2,139 క్యూసెక్కుల నీటిని కిందకి విడిచిపెడుతున్నట్లు వెల్లడించారు. రెండు కాల్వల ద్వారా 210 క్యూసెక్కుల సాగునీటిని పంట పొలాలకు అందిస్తున్నామని తెలిపారు.

News July 25, 2024

VZM: ‘మరమ్మతులకు రూ.కోటి నిధులు’

image

జిల్లాలోని ఐదు అన్న క్యాంటీన్ల మరమ్మతులకు రూ.కోటి నిధులు కేటాయించినట్లు ప్రజారోగ్యశాఖ ఈఈ దక్షిణామూర్తి తెలిపారు. బొబ్బిలిలోని భవనాన్ని బుధవారం పరిశీలించి మాట్లాడారు. బొబ్బిలి, రాజాం, నెల్లిమర్లతో పాటు జిల్లా కేంద్రంలో మూడు క్యాంటీన్లు ఉన్నట్లు చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నాటికి జిల్లా కేంద్రంలో రెండు, బొబ్బిలిలో క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. వీటి పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

News July 25, 2024

మాజీ కేంద్ర మంత్రిని కలిసిన జిల్లా మంత్రులు

image

మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజును ఉమ్మడి విజయనగరం జిల్లా మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బుధవారం అమరావతిలో కలసి పలు సమస్యలు, ఇతర అంశాలు చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చెయ్యాలని అశోక గజపతి రాజు మంత్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే అతిది గజపతి పాల్గొన్నారు.

News July 25, 2024

జ్వరాల సర్వే నిరంతరం జరగాలి: పార్వతీపురం కలెక్టర్

image

ఒక గ్రామంలో జ్వరం కేసు నమోదు అయితే ఆ గ్రామంలో ప్రతి వ్యక్తినీ పరిశీలించాల్సిందే అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ప్రతి కేసును క్షుణ్ణంగా విచారణ చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టరేట్‌లో బుధవారం సమీక్షించారు. జిల్లాలో మలేరియా, డెంగ్యూ కేసులు ఎక్కడా నమోదు కాకుండా శత శాతం చర్యలు చేపట్టాలన్నారు.

News July 24, 2024

కొరియా పారిశ్రామికవేత్తలతో మంత్రి కొండపల్లి భేటీ

image

కొరియా దేశానికి చెందిన పారిశ్రామిక వేత్తలతో రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై వ్య‌వ‌హారాల శాఖామంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వాళ్లకి వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పాలని, ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని మంత్రి వివరించారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

News July 24, 2024

ఢిల్లీ చేరుకున్న ఉమ్మడి విజయనగరం వైసీపీ నేతలు

image

రాష్ట్రంలో హత్యా రాజకీయాలతో కూటమి ప్రభుత్వం దమన కాండ చేస్తోందన్న ఆరోపణలతో ఢిల్లీలో నిరసనకు వైసీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, రాజాం మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు తదితరులు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. వారి వెంట నెక్కల నాయుడు బాబు, కేవీ సూర్యనారాయణ రాజు ఉన్నారు.

News July 24, 2024

VZM: వరి మడిలో మహిళ అనుమానాస్పద మృతి

image

వరి మడిలో మహిళ అనుమాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన మెరకముడిదాం మండలంలో చోటుచేసుకుంది. ఊటపల్లికి చెందిన బొత్స హైమావతి, ఆమె భర్త వేరు వేరుగా పొలానికి వెళ్లారు. వరి మడిలో పని చేస్తుండగా హైమావతి మూర్ఛ వచ్చి మృతి చెందింది. సమాచారం అందుకున్న చీపురుపల్లి సీఐ షణ్ముఖరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తండ్రి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఎస్ఐ లోకేశ్ తెలిపారు.

News July 24, 2024

VZM: ముద్రా రుణాలు.. గతేడాది ఎంతమందికి ఇచ్చారంటే?

image

కేంద్ర బడ్జెట్‌లో ముద్రా రుణ పరిమితిని రూ.20 లక్షల వరకు పెంచిన సంగతి తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరంలో విజయనగరం జిల్లాలో 57,066 మందికి రూ.480.45 కోట్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 13,923 కోట్లు ముద్రా రుణాలు ఇచ్చారు. త్రీ, ఫోర్ వీలర్ కొనుగోలు, జిమ్, బ్యూటీ పార్లర్, షాపులు, తయారీ, ట్రేడింగ్, సేవారంగాల్లో రుణాలు ఇస్తారు. అర్హత, వ్యాపారాలను బట్టి రూ.50 వేల నుంచి లోన్‌కు అప్లే చేసుకోవచ్చు.

News July 24, 2024

గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు: ఎస్పీ

image

గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సిబ్బందిని ఆదేశించారు. విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషన్‌ను ఆయన మంగళవారం సందర్శించారు. కేసుల పురోగతిని తెలుసుకున్నారు. గంజాయి వినియోగదారులు ఎక్కువగా పట్టణ శివార్లలో నివసిస్తున్నారని, వారిని అదుపు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్ నిర్వహించి, ప్రజలకు రక్షణ చట్టాల పట్ల అవగాహన కల్పించాలన్నారు.

News July 23, 2024

డిగ్రీ ప్రత్యేక విభాగాల విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం

image

డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసిన స్పెషల్ కేటగిరి విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన డాక్టర్ వి.ఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రారంభమైంది. దృవపత్రాల పరిశీలన 23, 24, 25 తేదీలలో జరుగుతుందని, ప్రవేశాల కోఆర్డినేటర్ డి.రమేశ్ తెలియజేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన చేస్తామన్నారు.

error: Content is protected !!