India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చూడాలని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఆ మేరకు వ్యవసాయాధికారులంతా సన్నద్ధంగా ఉండాలన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అంబేడ్కర్తో కలసి వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు. ఎరువులు పేద రైతులకే అందేలా చూడాలని, ఈ సీజన్లో వేసిన అన్ని పంటలకు సహాయం అందేలా అధికారులు చూడాలన్నారు.
భారత క్రీడాకారులు ఒలింపిక్స్లో ఘన విజయాలు సాధించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆకాంక్షించారు. శనివారం ‘ఐ చీర్ ఫర్ భారత్’ నినాదంతో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద మంత్రి సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా భారత క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధన్నానపేటలో ఆక్రమణను తొలగించినట్లు నెల్లిమర్ల తహశీల్దార్ ధర్మరాజు స్పష్టం చేశారు. రోడ్డును ఆక్రమించి నిర్మించిన ప్రహరీగోడను, ప్రజా ప్రయోజనాల కోసమే తొలగించినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఆక్రమణ దారునికి ముందుగా నోటీసులు కూడా ఇచ్చామని, తగిన గడువు ఇచ్చిన తరువాత, అతని నుంచి స్పందన రాకపోవడంతో తొలగించినట్లు తహశీల్దార్ తెలిపారు.
మంత్రి కొండపల్లి శ్రీనివస్ ఆదివారం నాడు జిల్లాలో అందుబాటులో ఉంటారని అధికారులు తెలియజేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్లో మంత్రి అందుబాటులో ఉంటారని చెప్పారు. ఉదయం 10.15 నుంచి జిల్లా పార్టీ కార్యాలయం (అశోక్ బంగ్లా)లో అందుబాటులో ఉంటారని తెలిపారు.
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభమైన నేపథ్యంలో విజయనగరం కలెక్టరేట్ వద్ద ఒలింపిక్ సెల్ఫీ పాయింట్ను ఏర్పాటు చేశారు. దీనిని కలెక్టర్ అంబేడ్కర్ ప్రారంభించి, జేసీ కార్తీక్తో కలిసి సెల్ఫీ దిగారు. ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు అధిక సంఖ్యలో పతకాలు సాధించాలని ఆకాక్షించారు. క్రీడాభిమానులు, యువత కూడా సెల్ఫీ దిగి ఇండియా అథ్లెట్స్కు శుభాకాంక్షలు తెలిపాలని కోరారు.
ఈ నెల 28 నుంచి ఆగష్టు 2వ తేదీ వరకు జరగనున్న శాఖాపరమైన పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DRO ఎస్.డి. అనిత తెలిపారు. గాజులరేగలో ఉన్న సీతం కళాశాలలో, అయాన్ డిజిటల్ జోన్ కేంద్రాలుగా ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. ఉదయం 10గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు రెండు పూటలా పరీక్షలు జరుగుతాయని తెలిపారు. DRO ఛాంబర్లో ఏర్పాట్ల పై అధికారులతో సమీక్షించారు.
ఈనెల 30న పార్వతీపురం govt జూనియర్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా తెలిపారు. sbi లైఫ్ ఇన్సూరెన్స్లో సేల్స్ అధికారి, అడ్వైజర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. 18 సం. పైబడిన పది, 12th, గ్రాడ్యుయేషన్ అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం 80 ఖాళీలు ఉన్నాయని, www.ncs.gov.in వెబ్సైట్లోని job seeker లాగిన్లో నమోదుచేసుకొని బయోడేటా, 2 పాస్ ఫోటోలతో హాజరుకావాలన్నారు.
సామాజిక మాధ్యమాల్లో పరిచయం చేసుకొని అమ్మాయిల ఫొటోలు ఎరగా చూపి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న హైదరాబాద్ వాసి కె.లోకేశ్ను అరెస్టు చేసినట్లు విశాఖ సైబర్ క్రైమ్ సీఐ భవాని ప్రసాద్ తెలిపారు. ఆ వ్యక్తి మాయలో నగరానికి చెందిన ఓ వ్యక్తి రూ. 28 లక్షలు పోగొట్టుకున్నాడని, అతడి ఫిర్యాదుతో నిందితుడిని పట్టుకున్నామన్నారు. కేసులో సంబంధం ఉన్న మరి కొంతమంది పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.
టమాటా ధరలు బహిరంగ మార్కెట్లో ఎక్కువగా ఉన్నాయి. దీంతో వాటిని రైతు బజార్లలో ప్రజలకు అందుబాటు ధరల్లో విక్రయించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ క్రమంలో విజయనగరంలోని 3రైతు బజార్లలో శనివారం నుంచి కిలో రూ.34కే విక్రయించనున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా అధికారులు కోరారు.
ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద రాయితీతో ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకుని విద్యుత్ బిల్లు తగ్గించుకోవచ్చని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. రాయితీపై అందిస్తున్న ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం గృహ వినియోగదారులకు విద్యుత్ ఛార్జీల భారం తగ్గించుకునేందుకు చక్కని అవకాశం అన్నారు.
Sorry, no posts matched your criteria.