Vizianagaram

News February 27, 2025

మెరకముడదాంలో వందశాతం పోలింగ్

image

మెరకముడిదాం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. ఈ ఎన్నికలలో 100% పోలింగ్ జరిగిందని అధికారులు తెలిపారు. మెరకముడిదం మండలంలో మొత్తం 55 ఓట్లు ఉండగా మెుత్తం 55 ఓట్లు నమోదైయాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగలేదని ఓటింగ్ ప్రశాంతంగా అయిందని అధికారులు తెలిపారు.

News February 27, 2025

భోగాపురంలో చీటీల పేరుతో మోసం.. భార్యాభర్తల అరెస్ట్

image

భోగాపురంలో చీటీల పేరుతో మోసం చేసిన కేసులో భార్యాభర్తలను అరెస్ట్ చేశారు. భోగాపురంలో ఉంటున్న భార్యాభర్తలు తులసీ, మురళీ చీటీలు నిర్వహించేవారు. చీటీ పూర్తయిన వారికి డబ్బులు చెల్లించకుండా పరారీలో ఉన్నారు. దీంతో రూ.30 కోట్ల వరకు నష్టపోయామంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దార్యాప్తు చేపట్టారు. పోలీసులు ఈనెల 25న రాజమహేంద్రవరంలో వీరిని అదుపులోకి తీసుకొని బుధవారం విజయనగరం కోర్టులో హాజరుపరిచారు.

News February 27, 2025

విజయనగరం: ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

image

విజయనగరంలో ఓ విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లోకేశ్ స్థానిక బొడ్డువారి జంక్షన్‌లో ఫ్రెండ్స్‌తో ఉంటున్నాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్నయ్య గణేశ్ ఫిర్యాదు  మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.

News February 26, 2025

విజయనగరం జిల్లాలో రేపు అన్ని పాఠశాలలకు సెలవు

image

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా విజయనగరం జిల్లాలో గల అన్ని యాజమాన్య పరిధిలోని ఉన్నత పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు DEO యు.మాణిక్యం నాయుడు బుధవారం తెలిపారు. ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలో గల అన్ని ఉన్నత పాఠశాలలు సెలవు ఇచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 29 పాఠశాలల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నట్లు ఆయన చెప్పారు.

News February 26, 2025

ఉత్త‌రాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సర్వం సిద్ధం

image

ఉత్త‌రాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. జిల్లా ఎన్నిక‌ల అధికారి డాక్ట‌ర్ బీఆర్.అంబేడ్కర్ ఆదేశాల‌కు అనుగుణంగా రెవెన్యూ అధికారులు ఎన్నిక‌కు అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌ను పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 5,223 మంది ఉపాధ్యాయులు త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 3,270 మంది పురుషులు కాగా, 1,953 మంది మ‌హిళా ఓట‌ర్లు ఉన్నారు.

News February 26, 2025

విశాఖలో మర్డర్ చేసిన విజయనగరం వ్యక్తి

image

విజయనగరం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి విశాఖలో దారుణ హత్య చేశాడు. రామతీర్థానికి చెందిన వై.శ్రీను, విశాఖలోని రామ్‌నగర్‌కు చెందిన ఆనంద్ ఇద్దరూ కలిసి సోమవారం రాత్రి వెంకోజిపాలెం వద్ద మద్యం తాగారు. ఈక్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. భయపడి ఆనంద్‌ పారిపోగా.. శ్రీను వెంటపడి మరీ రాయితో కొట్టి చంపేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News February 26, 2025

VZM: పెళ్లి పేరుతో మోసం.. 20ఏళ్లు జైలు శిక్ష..!

image

పెదమానాపురంలో 2023లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.4వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పెదమానాపురానికి చెందిన మారోతు వెంకటేశ్ (25) ఓ బాలికను పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి నాగమణి తీర్పు వెల్లడించినట్లుగా ఎస్పీ పేర్కొన్నారు. 

News February 25, 2025

విజయనగరం: బొత్సపై స్పీకర్ అయ్యన్న మండిపాటు

image

శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స పై స్పీకర్ అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. మంగళవారం ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో స్పీకర్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు సభలో YCP ప్రవర్తన పై స్పీకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ నేతల తీరును జగన్ నియంత్రించాల్సింది పోయి కూర్చొని నవ్వుకుంటారా? అని ప్రశ్నించారు. బొత్స వంటి సీనియర్ నేత పక్కనే ఉండి కూడా చేసేది తప్పని చెప్పలేదని ఫైర్ అయ్యారు.

News February 25, 2025

విజయనగరం జిల్లాకు అరుదైన గుర్తింపు

image

జాతీయ భౌగోళిక పాలసీలో పైలట్ జిల్లాగా విజయనగరంను ఎంపిక చేయడం వలన స్థానికంగా ఉన్న అనేక అంశాలకు చక్కటి పరిష్కారం లభిస్తుందని JC సేతు మాధవన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం వర్క్ షాప్ నిర్వహించారు. దేశంలోని 5 రాష్ట్రాలలో 5 జిల్లాలను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేయగా అందులో విజయనగరం ఒకటన్నారు. వివిధ శాఖల్లో పలు అంశాలకు సంబంధించి వచ్చే రెండు, మూడు నెలల్లో మంచి ఫలితాలను చూడబోతున్నామన్నారు.

News February 25, 2025

చికెన్‌, గుడ్లు నిర్భ‌యంగా తినొచ్చు: VZM కలెక్టర్ 

image

ప్ర‌జ‌లు చికెన్‌, కోడిగుడ్ల‌ను నిర్భ‌యంగా తినొచ్చ‌ని కలెక్టర్ అంబేడ్కర్ సూచించారు. బ‌ర్డ్‌ఫ్లూ వ్యాధి, చికెన్‌, కోడిగుడ్ల వినియోగంపై త‌మ ఛాంబ‌ర్‌లో వివిధ శాఖ‌ల అధికారుల‌తో సోమ‌వారం సమీక్ష జరిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో బ‌ర్డ్‌ఫ్లూ వ్యాధి గానీ, ఆ ల‌క్ష‌ణాలు గ‌ల వ్యాధిగ్ర‌స్తులు గానీ లేర‌ని ప‌శు వైద్యాధికారులు దృవీక‌రించార‌ని చెప్పారు.