Vizianagaram

News July 23, 2024

ఆ స్థలాలు రామతీర్థం దేవస్థానానివే: రెవెన్యూ అధికారులు

image

ఆలయం చుట్టూ ఉన్న స్థలాలు దేవాదాయ శాఖకు చెందినవేనని రెవెన్యూ అధికారులు తేల్చారు. ఆలయం వద్ద అభివృద్ధి పనులు చేపట్టడానికి అధికారులు సన్నాహాలు చేస్తుండగా స్థానిక దుకాణదారులు అడ్డగించారు. దీంతో పూర్తిస్థాయిలో సర్వేచేసి, తమ స్థలం అప్పగించాలని ఇటీవల రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. స్పందించిన రెవెన్యూ అధికారులు సోమవారం సర్వేచేసి, ఆలయం చుట్టూ స్థలం, కోనేరు దేవస్థానానికి చెందినట్లు తేల్చారు.

News July 23, 2024

విజయనగరంలో జాబ్ మేళా

image

విజయనగరం ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఈనెల26న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి డి.అరుణ వెల్లడించారు. అభ్యర్థుల వయస్సు 18-35 సంవత్సరాల మధ్య ఉండాలని, పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.17 నుంచి రూ.19 వేల వ‌ర‌కు జీతం, ఈ.ఎస్.ఐ., పి.ఎఫ్., మెడికల్, ఓ.టి. వంటి ఇతర సౌకర్యాలను వర్తింపజేస్తారన్నారు. స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులన్నారు.

News July 23, 2024

విశాఖ- కిరండూల్ రైలు దారి మళ్లింపు

image

భారీ వర్షాల కారణంగా కొత్తవలస- కిరండూల్ మార్గంలో నడిచే పలు రైళ్లను దారి మళ్లించారు. విశాఖ- కిరండూల్ (18514), కిరండూల్- విశాఖ(18513) రైలు విజయనగరం, రాయగడ, కొరాపుట్ మీదుగా దంతెవాడ చేరుకుంటుందని తెలిపారు. తిరిగి అదే మార్గంలో విశాఖ వైపు వెళ్తుందని వాల్తేరు డివిజనల్ వాణిజ్య మేనేజర్ కె.సందీప్ వెల్లడించారు. విశాఖ- కిరండూల్ పాసింజర్ దంతెవాడ వరకు మాత్రమే రాకపోకలు సాగిస్తుందన్నారు.

News July 23, 2024

VZM: ‘పాఠశాలలకు సెలవు ప్రకటించాలని డిమాండ్’

image

రానున్న మూడు రోజుల పాటు జిల్లాలో భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారని, అలాగే విజయనగరం జిల్లాలో కూడా సెలవు ప్రకటించాలని కోరుతున్నారు.

News July 23, 2024

మూడు రోజుల పాటు భారీ వర్షాలు: విజయనగరం కలెక్టర్

image

జిల్లాలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిందని కలెక్టర్ డా బి.ఆర్ అంబేడ్కర్ తెలిపారు. భారీ వర్ష సూచన దృష్ట్యా ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈదురు గాలులు బలంగా వీచే అవకాశం ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద తలదాచుకోకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.

News July 23, 2024

విజయనగరం: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 29 ఫిర్యాదులు

image

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం నిర్వహించారు. ప్రజల నుంచి 29 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించి, వారి సమస్యలను విని సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News July 22, 2024

విజయనగరం: ఆగ‌స్టు 15న 3 అన్న‌ క్యాంటీన్లు ప్రారంభం

image

రాష్ట్ర‌ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు ఆగ‌స్టు 15న ప్రారంభించేందుకు విజయనగరం జిల్లాలో 3 అన్నా క్యాంటీన్లను సిద్ధం చేయాల‌ని క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. విజ‌య‌న‌గ‌రం, బొబ్బిలి, రాజాం, నెల్లిమర్ల మున్సిప‌ల్ కమిషనర్లతో త‌న ఛాంబ‌ర్‌లో సోమ‌వారం స‌మావేశం నిర్వ‌హించారు. ముందుగా మున్సిపాలిటీల్లో తాగునీటి స‌ర‌ఫ‌రా, పారిశుద్ధ్యం, వ్యాధుల వ్యాప్తిపై స‌మీక్ష నిర్వహించారు.

News July 22, 2024

గంజాయి అక్రమ రవాణా సూత్రదారులను వదలం: VZM ఎస్పీ

image

గంజాయి అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన వ్యక్తులతోపాటు, అక్రమ రవాణకు కారకులైన ప్రధాన సూత్రధారుల మూలాలలను వెలికితీస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు ఎవరూ పాల్పడినా ఉపేక్షించేది లేదన్నారు. నిందితులనువిచారించి,సమాచారం సేకరించడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గంజాయి అక్రమ రవాణాకు ప్రధాన సూత్రదారులను గుర్తించి అరెస్టు చేస్తామన్నారు.

News July 22, 2024

VZM: ‘విద్యుత్ సమస్యలపై కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు’

image

వర్షాకాలంలో విద్యుత్తు ప్రమాదాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని ఈపీడీసీఎల్ ఎస్.ఈ ఎం.లక్ష్మణరావు సూచించారు. ఉమ్మడి జిల్లాలో 6 కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సమస్యలపై 1912 టోల్‌ ఫ్రీ నంబరుతో పాటు విజయనగరం సర్కిల్‌లో 94906 10102, టౌన్‌లో 63005 49126, రూరల్‌లో 94409 07289, బొబ్బిలిలో 94906 10122, పార్వతీపురంలో 83320 46778 నంబర్లను సంప్రదించాలన్నారు.

News July 22, 2024

విజయనగరంలో అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ అరెస్ట్

image

విజయనగరంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న ప్రవీణ్ కుమార్ ఖాతాదారులు చెల్లించిన సొమ్మును బ్యాంక్‌లో జమ చేయకుండా సొంత అవసరాలకు వాడేసుకున్నారు. హోమ్ లోన్లు తీసుకున్న ఖాతాదారులు చెల్లించిన డబ్బులు సుమారు రూ.34 లక్షలు వాడేసుకున్నారు. ఇది గుర్తించిన బ్యాంక్ యాజమాన్యం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రవీణ్ కుమార్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని S.I హరిబాబు తెలిపారు.

error: Content is protected !!