India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గంజాయి విక్రయిస్తే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని ఆశ పడ్డారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు విశాఖపట్నానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు గంజాయి విక్రయించడానికి ఎస్.కోట-విశాఖ రహదారిలో బైక్పై తీసుకువెళ్తుండగా కొత్తవలస పోలీసులకు చిక్కారు. వారితో పాటు గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేసారు. 3.42 కిలోల గంజాయి, బైక్ స్వాధీనం చేసుకున్నారు.
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని ఏడుగురు ఎమ్మెల్యేలు తొలిసారి అసెంబ్లీలో గళం వినిపించనుండగా.. వారిలో కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధ్యారాణి మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్.కోట నుంచి కోళ్ల, చీపురుపల్లి నుంచి కిమిడి వంటి సీనియర్లు ఉన్నారు. మరి మీ MLA అసెంబ్లీలో ఏ సమస్యపై ప్రస్తావించాలనుకుంటున్నారో కామెంట్ చెయ్యండి.
కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో జలాశయాలు నిండుకుండాల్లా మారాయి. తోటపల్లి పూర్తి స్థాయి నీటిమట్టం 105 మీటర్లు కాగా.. ప్రస్తుతం 104 మీటర్ల వరకు నీరు చేరింది. వట్టిగెడ్డలో 121.62 M.కి 115.82మీ., పెద్దగెడ్డలో 213.80 M.కి 213.82 M., వెంగళరాయసాగర్లో 161మీ.కి 157.45మీ., జంఝావతిలో 124మీ.కి 122.56 M నీటిమట్టం ఉంది. దీంతో నదీ తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
విజయనగరం జిల్లా జొన్నాడ సమీపంలో ఆదివారం జరిగిన ఘోర <<13674170>>రోడ్డు ప్రమాదం<<>>లో మృతులను డెంకాడ పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో తురక ప్రవీణ్ చంద్ (గుంటూరు), బాడిత మాను సన్యాసి(గుంపాం) అక్కడికక్కడే మరణించారు. మరో ఎనిమిది మంది వరకూ గాయపడ్డారు. క్షతగాత్రులను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డెంకాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఉపాధి హామీ వేతన దారులు వేతనాల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. వేతన చెల్లింపులకు రెండు జిల్లాల్లో రూ.1.05 కోట్ల బకాయిలు ఉన్నాయి. వాస్తవానికి 15 రోజులకోసారి వేతనాలు చెల్లించాల్సి ఉన్నా రెండు నెలల నుంచి ఆ ప్రక్రియ సాగలేదు. ఫలితంగా విజయనగరం జిల్లాలో రూ.60లక్షలు, పార్వతీపురం మన్యం జిల్లాలో రూ.55లక్షలు పెండింగ్లో ఉన్నాయి. త్వరగా చెల్లింపులు చేయాలని వేతనదారులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు, సౌకర్యాలు ఉన్నా రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు ఎందుకు వెళ్తున్నారని కలెక్టర్ డా.బీఆర్.అంబేడ్కర్ ప్రభుత్వ వైద్యాధికారులును ప్రశ్నించారు. శనివారం ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగిలిన కేసుల్లో వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. నమ్మకం కలిగించేలా పనిచేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో శతశాతం ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవకన్నారు.
బొబ్బొలిలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. DSP శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓ కాలనీలో ఇద్దరి కుమార్తెలతో నివాసముంటున్న తండ్రి శుక్రవారం సాయంత్రం మద్యం మత్తులో 11 ఏళ్ల కూతురిపై అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటనపై బాలిక అమ్మమ్మ స్థానికుల సాయంతో తమను ఆశ్రయించగా దర్యాప్తు చేశామన్నారు. బాలికను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించి, నిందుతుడిపై పోక్సో కేసు నమోదు చేశామన్నారు.
విద్యుత్ షాక్తో తండ్రి, కూతురు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డెంకాడ మం. డీ.తాళ్లవలసలో సూర్యారావు కుమార్తె సంధ్యారాణి(23) శుక్రవారం రాత్రి మేడపై ఉన్న బట్టలు తేవడానికి వెళ్లింది. అక్కడ విద్యుత్ వైర్లు తగలడంతో కేకలు వేస్తూ కింద పడింది. అది విన్న సూర్యారావు(55) పైకి వెళ్లాడు. కింద పడి కొట్టుకుంటున్న కుమార్తెను లేపేందుకు యత్నించగా అతను కూడా విద్యుత్ షాక్కి గురయ్యాడు.
స్టేట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డైరెక్టర్గా నిశాంత్ కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. జిల్లాలో 2024 సాధారణ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేశారు. జిల్లా ఏర్పడిన తర్వాత అన్ని శాఖల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లారని ఈయనకు పేరుంది.
* పార్వతీపురం జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించిన డీఈఓ
* గిరి ప్రదక్షిణ కోసం సింహాచలం చేరుకుంటున్న భక్తులు
* VZM: ఐదు నెలల్లో 87 మంది శిశువులు మృతి
* విజయనగరంలో రద్దీగా సింహాచలం బస్సులు
* VZM: 24 గంటలు బీ అలర్ట్
* విజయనగరంలో వికసించిన బ్రహ్మ కమలాలు
* పార్వతీపురం: ఆర్టీసీ ప్రయాణకులకు అలర్ట్
* విజయనగరంలో 48.2 మి.మీ. వర్షపాతం నమోదు
Sorry, no posts matched your criteria.