India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సీజనల్ వ్యాధులపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, తాగునీరు కలుషితం కాకుండ చేపట్టాల్సిన చర్యలు డెంగీ మలేరియా ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డీసీహెచ్ఎస్, జడ్పీ సీఈవో, డీపీఓ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలోని ప్రయివేటు ఆసుపత్రులపై నిఘా పెంచాలని కలెక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఆర్డీలతో కలిసి జిల్లాలోని 108 ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేసి, తనకు నివేదిక అందజేయాలని DMHOను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో శనివారం కలెక్టర్ మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ చేసినవారిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
శిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నప్పటికీ ఆగడం లేదు. కొంతమంది తల్లులకు అవగాహన లోపం..కొన్ని చోట్ల వైద్య సేవల్లో జాప్యంతో శిశు మరణాలు సంభవిస్తున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో మార్చి నెల 16, ఏప్రిల్లో 17, మే నెలలో 19, జూన్ లో 25, జులై లో 10 శిశు మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. ఇవి తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు DMHO బాస్కరరావు తెలిపారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో పాఠశాలలకు డీఈఓ పగడాలమ్మ సెలవు ప్రకటించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా పాఠశాలలకు శనివారం నాడు సెలవు ప్రకటించినట్లు ఆమె తెలిపారు. విద్యార్థులంతా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ఆమె కోరారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి విద్యార్థులు తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని ఆమె కోరారు.
జిల్లాలో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లోని వాగులు, గెడ్డలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో అన్ని మండలాల తహశీల్దార్, రెవెన్యూ డివిజన్లను అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా.బీ.ఆర్. అంబేడ్కర్ ఆదేశించారు. వాగులు, గెడ్డలు ప్రవాహం కొనసాగుతున్న ప్రదేశాల్లో ఎవరూ వాటిని దాటకుండా, ప్రమాదాలు జరగకుండా 24 గంటల పహారా ఏర్పాట్లు చేయాలన్నారు. భారీ వర్షాల దృష్ట్యా ఈ రోజు అన్నీ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోరారు. ఈ నేపథ్యంలో శనివారం జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.
సింహాచలం గిరి ప్రదక్షిణకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. 32 కిలో మీటర్ల మేర సాగే నడక మార్గంలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఈ క్రింది నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.
➣ సింహాచలం దేవస్థానం: 0891-2954944/9390501082
➣ జీవీఎంసీ కమాండ్ కంట్రోల్ సెంటర్:1800-42500009
➣ వాటర్ సప్లై&పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్: 0891-2869111
➣ విశాఖ పోలీస్: 9390105353/9330105355
>>> Share it
విజయనగరం జేఎన్టీయూ జీవీ ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్గా డి.రాజ్యలక్ష్మి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.జయసుమ, వివిధ విభాగాల డైరెక్టర్లు, కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపల్, బోధన, బోధనేతర సిబ్బంది పుష్పగుచ్ఛాలతో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అందరి సహాయ సహకారాలతో విశ్వవిద్యాలయం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.
పరవాడలో ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న తాపీ మేస్త్రీ అమరపు సురేశ్(32) మూడో ఫ్లోర్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడడంతో మృతి చెందాడు. ఈ ఘటన గురవారం సాయంత్రం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలానికి చెందిన సురేశ్ కుటుంబంతో కలిసి ఏడాదిన్నరగా పరవాడలో ఉంటున్నాడు. మృతుడు తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతని భార్య ఫిర్యాదుతో పోలీసులు మృతదేహాన్ని అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
గరుగుబిల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గొట్టాపు శశిభూషణరావును విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఈయన ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్గా పని చేస్తున్నారు. ఏయూలో సీయూసీ అధ్యాపకుడిగా 19 ఏళ్ల అనుభవం ఆయనకు ఉంది. 15 ఏళ్ల పాటు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, ఇస్రోలో పనిచేశారు. ఆయన ఉన్నత స్థాయికి వెళ్లడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.