India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒక గ్రామంలో జ్వరం కేసు నమోదు అయితే ఆ గ్రామంలో ప్రతి వ్యక్తినీ పరిశీలించాల్సిందే అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ప్రతి కేసును క్షుణ్ణంగా విచారణ చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టరేట్లో బుధవారం సమీక్షించారు. జిల్లాలో మలేరియా, డెంగ్యూ కేసులు ఎక్కడా నమోదు కాకుండా శత శాతం చర్యలు చేపట్టాలన్నారు.
కొరియా దేశానికి చెందిన పారిశ్రామిక వేత్తలతో రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వాళ్లకి వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పాలని, ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని మంత్రి వివరించారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి ఎక్స్లో పోస్ట్ చేశారు.
రాష్ట్రంలో హత్యా రాజకీయాలతో కూటమి ప్రభుత్వం దమన కాండ చేస్తోందన్న ఆరోపణలతో ఢిల్లీలో నిరసనకు వైసీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, రాజాం మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు తదితరులు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. వారి వెంట నెక్కల నాయుడు బాబు, కేవీ సూర్యనారాయణ రాజు ఉన్నారు.
వరి మడిలో మహిళ అనుమాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన మెరకముడిదాం మండలంలో చోటుచేసుకుంది. ఊటపల్లికి చెందిన బొత్స హైమావతి, ఆమె భర్త వేరు వేరుగా పొలానికి వెళ్లారు. వరి మడిలో పని చేస్తుండగా హైమావతి మూర్ఛ వచ్చి మృతి చెందింది. సమాచారం అందుకున్న చీపురుపల్లి సీఐ షణ్ముఖరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తండ్రి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఎస్ఐ లోకేశ్ తెలిపారు.
కేంద్ర బడ్జెట్లో ముద్రా రుణ పరిమితిని రూ.20 లక్షల వరకు పెంచిన సంగతి తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరంలో విజయనగరం జిల్లాలో 57,066 మందికి రూ.480.45 కోట్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 13,923 కోట్లు ముద్రా రుణాలు ఇచ్చారు. త్రీ, ఫోర్ వీలర్ కొనుగోలు, జిమ్, బ్యూటీ పార్లర్, షాపులు, తయారీ, ట్రేడింగ్, సేవారంగాల్లో రుణాలు ఇస్తారు. అర్హత, వ్యాపారాలను బట్టి రూ.50 వేల నుంచి లోన్కు అప్లే చేసుకోవచ్చు.
గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సిబ్బందిని ఆదేశించారు. విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషన్ను ఆయన మంగళవారం సందర్శించారు. కేసుల పురోగతిని తెలుసుకున్నారు. గంజాయి వినియోగదారులు ఎక్కువగా పట్టణ శివార్లలో నివసిస్తున్నారని, వారిని అదుపు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్ నిర్వహించి, ప్రజలకు రక్షణ చట్టాల పట్ల అవగాహన కల్పించాలన్నారు.
డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసిన స్పెషల్ కేటగిరి విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన డాక్టర్ వి.ఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రారంభమైంది. దృవపత్రాల పరిశీలన 23, 24, 25 తేదీలలో జరుగుతుందని, ప్రవేశాల కోఆర్డినేటర్ డి.రమేశ్ తెలియజేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన చేస్తామన్నారు.
ఆలయం చుట్టూ ఉన్న స్థలాలు దేవాదాయ శాఖకు చెందినవేనని రెవెన్యూ అధికారులు తేల్చారు. ఆలయం వద్ద అభివృద్ధి పనులు చేపట్టడానికి అధికారులు సన్నాహాలు చేస్తుండగా స్థానిక దుకాణదారులు అడ్డగించారు. దీంతో పూర్తిస్థాయిలో సర్వేచేసి, తమ స్థలం అప్పగించాలని ఇటీవల రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. స్పందించిన రెవెన్యూ అధికారులు సోమవారం సర్వేచేసి, ఆలయం చుట్టూ స్థలం, కోనేరు దేవస్థానానికి చెందినట్లు తేల్చారు.
విజయనగరం ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఈనెల26న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి డి.అరుణ వెల్లడించారు. అభ్యర్థుల వయస్సు 18-35 సంవత్సరాల మధ్య ఉండాలని, పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.17 నుంచి రూ.19 వేల వరకు జీతం, ఈ.ఎస్.ఐ., పి.ఎఫ్., మెడికల్, ఓ.టి. వంటి ఇతర సౌకర్యాలను వర్తింపజేస్తారన్నారు. స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులన్నారు.
భారీ వర్షాల కారణంగా కొత్తవలస- కిరండూల్ మార్గంలో నడిచే పలు రైళ్లను దారి మళ్లించారు. విశాఖ- కిరండూల్ (18514), కిరండూల్- విశాఖ(18513) రైలు విజయనగరం, రాయగడ, కొరాపుట్ మీదుగా దంతెవాడ చేరుకుంటుందని తెలిపారు. తిరిగి అదే మార్గంలో విశాఖ వైపు వెళ్తుందని వాల్తేరు డివిజనల్ వాణిజ్య మేనేజర్ కె.సందీప్ వెల్లడించారు. విశాఖ- కిరండూల్ పాసింజర్ దంతెవాడ వరకు మాత్రమే రాకపోకలు సాగిస్తుందన్నారు.
Sorry, no posts matched your criteria.