India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సింహాచలం గిరి ప్రదక్షిణ పురస్కరించుకొని విశాఖ నగర పోలీసు కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో రవాణా శాఖ ట్రాఫిక్ ఆంక్షలు జారీచేశారు. అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే వాహనదారులకు విశాఖపట్నం సిటీ గుండా వెళ్లేందుకు అనుమతిలేదని తెలిపారు. ప్రత్యామ్నాయంగా లంకెలపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం గుండా ప్రయాణించాని సూచించారు. అలానే శ్రీకాకుళం వైపు నుంచి అనకాపల్లి రావాలని తెలిపారు.
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసిన విద్యుత్ స్తంభాలను నేరుగా తాకరాదని విద్యుత్ శాఖ SE మువ్వల లక్ష్మణరావు సూచించారు. పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా విద్యుత్ తీగలు మీద చెట్లు విరిగిపడిన, విద్యుత్ తీగలు తెగిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లో విద్యుత్ పరికరాలను తడి చేతితో తాకవద్దన్నారు. విద్యుత్ ప్రమాదాలను గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు గాని, 1912 టోల్ ఫ్రీ నంబరుకు తెలియజేయాలన్నారు.
ఏ.పి. కోస్టల్ మేనేజ్ మెంట్ జోన్ పై ఈనెల 19న ఉదయం 10-30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించనున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ సరిత తెలిపారు. కలెక్టర్ అంబేద్కర్ అధ్యక్షతన ఉదయం 10-30 గంటలకు కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో పబ్లిక్ హియరింగ్ జరుగుతుందని చెప్పారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 2019 చట్ట నిబంధనల మేరకు ఈ పబ్లిక్ హియరింగ్ జరుగుతుందని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 401 గ్రామాల్లో మలేరియా స్ప్రేయింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా మలేరియా అధికారి వై.మణి తెలిపారు. జూలై 15 నుంచి ఎంపిక చేసిన 401 గ్రామాల్లో షెడ్యూల్ ప్రకారం స్ప్రేయింగ్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో రక్త పరీక్షలు జరిపి వెంటనే చికిత్స జరిపేలా పీహెచ్సీ వైద్యాధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
ఎంపీకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అని అరకు పార్లమెంట్ ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజరాణి ప్రశ్నించారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రంలోని వైసీపీ నాయకులపై దాడులు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. ఎంపీ మిథున్ రెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తే ఆయనపై దాడి చేశారన్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకునేందుకు సైతం వెనకంజ వేయడం అన్యాయం అన్నారు.
ఈనెల 20న జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణ తొలి పావంచ వద్ద మొదలుపెట్టి.. అడవివరం-ధారపాలెం-ఆరిలోవ-హనుమంతువాక-పోలీసు క్వార్టర్స్- కైలాసగిరి టోల్ గేట్- అప్పుఘర్ జంక్షన్- MVPడబుల్ రోడ్-వెంకోజీపాలెం- HB కాలనీ-కైలాసపురం-మాధవధార-మురళీనగర్-బుచ్చిరాజుపాలెం-లక్ష్మీ నగర్-ఇందిరా నగర్- ప్రహ్లాదపురం-గోశాల జంక్షన్-తొలి పావంచ మీదుగా సింహాచలం మెట్ల మార్గం చేరుకోవాలి. సుమారు 32 కిలోమీటర్ల ప్రదక్షిణ చేయాలి. >Share it
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతిగా ఈసీఈ విభాగం సీనియర్ ఆచార్యులు జి.శశిభూషణరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆచార్య శశిభూషణరావు ఏయూ పాలకమండలి సభ్యునిగా పనిచేశారు. రక్షణ రంగ సంబంధ పరిశోధనలో శశిభూషణ్ రావు నిష్ణాతులు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ శ్రేణులపై దాడులు పెరిగిపోయాయని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలన్నారు. పాలన చేయమని మంచి మెజార్టీ ఇస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వినుకొండలో జరిగిన హత్యతోపాటు, ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీపై దాడులకు తెగబడడం సరికాదన్నారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహచలం గిరి ప్రదక్షిణ చేసే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 20,21 తేదీలలో జరుగుతున్న గిరిప్రదక్షిణకు హాజరవుతున్న ప్రయాణికులకు APSRTC విజయనగరం డిపో నుంచి సింహచలం వరకు 40 ప్రత్యేక బస్సులు నడపబడుతున్నాయన్నారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 16 నుంచి సీట్ల కేటాయింపు మొదలైంది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ కళాశాలలకు ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు జిల్లాల్లో సింహభాగం ప్రైవేటు, అన్ఎయిడెడ్ విద్యాలయాల్లో కనిష్ఠంగా రూ.40 వేలు ఖరారు చేశారు. గతేడాదిలో ఈ మొత్తం రూ.43వేలు ఉండేది. ఈ ఏడాది రూ.3 వేల వరకు తగ్గింది.
Sorry, no posts matched your criteria.