India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో ఉపాధ్యాయ MLC ఎన్నికల కోడ్ అమలకు నోడల్ అధికారుల నియమిస్తూ జిల్లా ఎన్నికల అధికారి అంబేడ్కర్ ఉత్తర్వులు జారీ శనివారం చేశారు. MCC అమలుకు జిల్లా స్థాయి నోడల్ అధికారిగా ZP CEOసత్యనారాయణ నియమితులయ్యారు. ఆయన జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును పర్యవేక్షిస్తారు. ఫిర్యాదులను స్వీకరించి చర్యలు చేపడతారు. ఎంపీడీవో, కమీషనర్ల ద్వారా మోడల్ కోడ్ అమలు చేస్తారు.

విజయనగరం జిల్లా గంట్యాడ మండలం నీలావతి గ్రామానికి చెందిన శివ(21) అనే యువకుడిపై పోక్సో, వరకట్న కేసులు నమోదయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానికంగా ఉంటున్న మైనర్ బాలికతో యువకుడు పరిచయం పెంచుకున్నాడు. ఆమెను శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు పెద్దలు వీరికి వివాహం జరిపించారు. ఇటీవల శివ, కుటుంబ సభ్యులు వర కట్నం కోసం తనను వేధిస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంటిపెద్ద అకాల మరణంతో ఓ కుటుంబం అనాథగా మారింది. మెరకముడిదాం గ్రామానికి చెందిన గౌరీనాయడు(50) శుక్రవారం మృతి చెందాడు. గడ్డిని ట్రాక్టర్పైకి ఎక్కిస్తుండగా కిందపడటంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. తోటి కార్మికులు ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని చీపురుపల్లి ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడికి భార్య లక్ష్మీతో పాటు ఇద్దరు కుమార్తెలున్నారు.

గుర్ల మండలంలో ఓ యువకుడు విద్యుత్ వైర్లు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్ రాష్ట్రానికి చెందిన పులేషణ కుమార్ గుర్ల మండలం కోటగండ్రేడు రైస్మిల్లులో 2 నెలలుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రైస్మిల్ దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ వైర్లను పట్టుకున్నాడు. గమనించిన స్థానికులు విద్యుత్ సరఫరా నిలిపివేసి యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందగా SI నారాయణ కేసునమోదు చేశారు.

ఫిబ్రవరి నెలకు పెన్షన్ పంపిణీ వేకువజాము నుంచే సర్వర్ డౌన్ కావడంతో పెన్షన్ పంపిణీ ఆలస్యం అవుతుంది. ఇప్పటికే జామి, ఎస్.కోట, తదితర మండలాల్లో సచివాలయం సిబ్బంది పెన్షన్ పంపిణీ కోసం వేకువజామునే లబ్ధిదారుల ఇంటికి చేరుకున్నారు. సర్వర్ డౌన్ కావడంతో లబ్ధిదారులు ఇంటి వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఈ విషయంపై జామి మండల అధికారులు మాట్లాడుతూ.. సాంకేతిక సమస్యను టెక్నికల్ టీమ్కు తెలిపామన్నారు.

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నిక కోసం ఈ నెల 29న షెడ్యూల్ వెలువడినందున ఆ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల కోడ్ గురించి రాజకీయ ప్రతినిధులకు వివరించారు. పలు శాఖల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలకు సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షలు పక్కడ్భంధీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. శనివారం నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభమవుతాయి అని ఆర్ఐ ఓ ఆదినారాయణ తెలిపారు. ఈ సమావేశంలో పలు శాఖలు అధికారులు పాల్గొన్నారు.

విజయనగరం జిల్లా పోలీసుశాఖలో స్నిఫర్ డాగ్గా విశేషమైన సేవలందించి, మృతి చెందిన పోలీసు డాగ్ ‘వీనా’కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. 2014 సం.లో ఫిమేల్ స్నిఫర్ డాగ్గా ‘వీనా’ ఇంటిలిజెన్సు విభాగంలో శిక్షణ పూర్తి చేసుకొని జిల్లాకు వచ్చినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. తన చివరి శ్వాస వరకు జిల్లా పోలీసుశాఖకు సేవలందించిందన్నారు.

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నిక కోసం ఈ నెల 29న షెడ్యూల్ వెలువడినందున ఆ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ గురువారం తెలిపారు. ఈ ఎన్నిక కోసం విశాఖపట్నం జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి, ఏ.ఎస్.ఆర్ జిల్లాల డి.ఆర్.ఓ లు సహాయ రిటర్నింగ్ అధికారులుగా ఉంటారని తెలిపారు.

ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి రోజు ఉపాధి పనులు తప్పక జరగాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఉపాధిహామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులు, పనిదినాల కల్పనపై ఎం.పి.డి.ఓ లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో తన ఛాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం కలెక్టర్ సమీక్షించారు. ఉన్నది రెండు నెలల గడువేనని, ఈ ఏడాది లక్ష్యాలను పూర్తి చేయకపోతే వచ్చే ఏడాదికి నిధులు రాకపోవచ్చునన్నారు.
Sorry, no posts matched your criteria.