Vizianagaram

News February 3, 2025

ఈనెల 5న ఫీజు పోరు: జడ్పీ ఛైర్మన్

image

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు ఫీజులు చెల్లించడం లేదని, వారికి వైసీపీ అండగా నిలుస్తుందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం విజయనగరం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ..ప్రభుత్వానికి హెచ్చరికగా ఈనెల 5న జిల్లా కేంద్రంలో ‘ఫీజు పోరు’ చేపడతామన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు,కరుమజ్జి సాయి, గదుల సత్యలత, పలువురు పాల్గొన్నారు.

News February 3, 2025

పెళ్లికి ఒప్పుకోలేదనే యువతిపై దాడి: ఎస్పీ

image

శ్రీకాకుళంలో ఉమెన్స్ కాలేజీలో ఓ విద్యార్థినిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. నిందితుడు సారవకోటకు చెందిన జగదీశ్‌ను అరెస్ట్ చేశామని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి వెల్లడించారు. ‘విజయనగరం(D) సంతకవిటికి చెందిన యువతి డిగ్రీ చదువుతూ హాస్టల్లో ఉంటోంది. గతంలో జగదీశ్‌తో ఆమెకు పరిచయం ఉంది. గతనెల 30న ఆమెను కలిసి పెళ్లి చేసుకోవాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో అతను దాడి చేసి గాయపరిచాడు’ అని ఎస్పీ చెప్పారు.

News February 2, 2025

ఆండ్ర ఎస్ఐపై విచారణకు ఆదేశం

image

ఆండ్ర ఎస్ఐ సీతారాములు తీరుపై విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ విచారణకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కొంతమంది రాజకీయ నాయకులను ఆయన కలిసినట్లుగా వచ్చిన ఆరోపణలపై బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డిని విచారణ చేసి నివేదిక పంపాలని ఆదేశించామన్నారు. విచారణలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు తేలితే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఎస్పీ తెలిపారు.

News February 2, 2025

భూముల రీసర్వే సందేహాలకు ఎక్స్‌ప‌ర్ట్ సెల్: JC

image

భూముల రీస‌ర్వేకు సంబంధించి భూముల య‌జ‌మానుల‌కు వ‌చ్చే సందేహాల‌ను నివృత్తి చేసేందుకు ఎక్స్‌ప‌ర్ట్ సెల్‌ను ఏర్పాటు చేసిన‌ట్టు జాయింట్ క‌లెక్ట‌ర్ సేతుమాధ‌వ‌న్ శనివారం తెలిపారు. ఎక్స్‌ప‌ర్ట్ సెల్ అధికారిగా స‌ర్వే భూరికార్డుల శాఖ‌కు చెందిన ఏ.మ‌న్మ‌ధ‌రావును నియ‌మించినట్లు పేర్కొన్నారు. ఆయ‌న కార్యాల‌య ప‌నిదినాల్లో ఉద‌యం 10.30 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు అందుబాటులో ఉంటారన్నారు.

News February 2, 2025

VZM: ప్రజా సమస్యల పరిష్కార వేదిక తాత్కాలికంగా రద్దు: SP

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం తెలిపారు. జనవరి 29 నుంచి మార్చి 8 వరకు జిల్లాలో కోడ్ అమల్లో ఉన్నందున ఫిర్యాదులు స్వీకరించమన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఎస్పీ కోరారు.

News February 1, 2025

VZM: ఎన్నికల కోడ్ అమలుకు నోడల్ అధికారులు

image

జిల్లాలో ఉపాధ్యాయ MLC ఎన్నికల కోడ్ అమలకు నోడ‌ల్ అధికారుల‌ నియ‌మిస్తూ జిల్లా ఎన్నిక‌ల అధికారి అంబేడ్కర్ ఉత్త‌ర్వులు జారీ శనివారం చేశారు. MCC అమ‌లుకు జిల్లా స్థాయి నోడ‌ల్ అధికారిగా ZP CEOస‌త్య‌నారాయ‌ణ నియ‌మితుల‌య్యారు. ఆయ‌న జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి అమ‌లును ప‌ర్య‌వేక్షిస్తారు. ఫిర్యాదుల‌ను స్వీక‌రించి చ‌ర్య‌లు చేప‌డ‌తారు. ఎంపీడీవో, కమీషనర్ల ద్వారా మోడల్ కోడ్ అమలు చేస్తారు.

News February 1, 2025

VZM: యువకుడుపై పోక్సో కేసు నమోదు

image

విజయనగరం జిల్లా గంట్యాడ మండలం నీలావతి గ్రామానికి చెందిన శివ(21) అనే యువకుడిపై పోక్సో, వరకట్న కేసులు నమోదయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానికంగా ఉంటున్న మైనర్ బాలికతో యువకుడు పరిచయం పెంచుకున్నాడు. ఆమెను శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు పెద్దలు వీరికి వివాహం జరిపించారు. ఇటీవల శివ, కుటుంబ సభ్యులు వర కట్నం కోసం తనను వేధిస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 1, 2025

మెరకుముడిదాం: ట్రాక్టర్ నుంచి పడి వ్యక్తి మృతి

image

ఇంటిపెద్ద అకాల మరణంతో ఓ కుటుంబం అనాథగా మారింది. మెరకముడిదాం గ్రామానికి చెందిన గౌరీనాయడు(50) శుక్రవారం మృతి చెందాడు. గడ్డిని ట్రాక్టర్‌పైకి ఎక్కిస్తుండగా కిందపడటంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. తోటి కార్మికులు ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని చీపురుపల్లి ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడికి భార్య లక్ష్మీతో పాటు ఇద్దరు కుమార్తెలున్నారు.

News February 1, 2025

గుర్ల: విద్యుత్ వైర్లు పట్టుకుని యువకుడి సూసైడ్

image

గుర్ల మండలంలో ఓ యువకుడు విద్యుత్ వైర్లు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్‌ రాష్ట్రానికి చెందిన పులేషణ కుమార్ గుర్ల మండలం కోటగండ్రేడు రైస్‌మిల్లులో 2 నెలలుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రైస్‌మిల్ దగ్గర ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వైర్లను పట్టుకున్నాడు. గమనించిన స్థానికులు విద్యుత్ సరఫరా నిలిపివేసి యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందగా SI నారాయణ కేసునమోదు చేశారు.

News February 1, 2025

జామి: సర్వర్ డౌన్.. పెన్షన్ పంపిణీ ఆలస్యం

image

ఫిబ్రవరి నెలకు పెన్షన్ పంపిణీ వేకువజాము నుంచే సర్వర్ డౌన్ కావడంతో పెన్షన్ పంపిణీ ఆలస్యం అవుతుంది. ఇప్పటికే జామి, ఎస్.కోట, తదితర మండలాల్లో సచివాలయం సిబ్బంది పెన్షన్ పంపిణీ కోసం వేకువజామునే లబ్ధిదారుల ఇంటికి చేరుకున్నారు. సర్వర్ డౌన్ కావడంతో లబ్ధిదారులు ఇంటి వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఈ విషయంపై జామి మండల అధికారులు మాట్లాడుతూ.. సాంకేతిక సమస్యను టెక్నికల్ టీమ్‌కు తెలిపామన్నారు.