Vizianagaram

News March 17, 2024

బొబ్బిలిలో రైలు ఢీకొని మృతి

image

బొబ్బిలి ఇందిరమ్మకాలనీ సమీపంలో రైలు ఢీకొని వృద్దుడు తామాడ అప్పలస్వామి(68) మృతి చెందినట్లు రైల్వే హెచ్‌సి బి.ఈస్వరరావు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. బాడంగి మండలం అనవరం గ్రామానికి చెందిన అప్పలస్వామి గొల్లపల్లి పెళ్లికి వెళ్లాడు. తిరిగు ప్రయాణంలో ఇందిరమ్మకాలనీ వద్ద రైల్వే పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని ట్రైన్ ఢీకొని మృతి చెందారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

News March 17, 2024

విజయనగరం: సిట్టింగులకే ఛాన్స్

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలనే వైసీపీ మళ్లీ అభ్యర్థులుగా ప్రకటించింది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో గెలిచిన 9 మందిలో బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి, పీడిక రాజన్నదొరకి జగన్ కేబినెట్‌లో చోటు ఇచ్చారు. కోలగట్ల వీరభద్రస్వామికి డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం ఇచ్చారు. శంబంగి చినఅప్పలనాయుడు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో వీరి గెలుపుపై మీ కామెంట్

News March 17, 2024

నేటి నుంచి చీపురుపల్లి కనకమహాలక్ష్మి జాతర

image

చీపురుపల్లిలో నేటి నుంచి మూడు రోజులు పాటు జరగనున్న శ్రీకనక మహాలక్మి అమ్మవారు జాతర జరగనుంది. ఈ జాతరకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ చక్రవర్తి తెలిపారు. స్థానిక పోలీసు అధికారులతో శనివారం చీపురుపల్లిలో పర్యటించారు. 18 సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, సుమారు 8 వందల మంది పోలీసులు బందోబస్తు డ్యూటీలు వేశామన్నారు. అల్లరి మూకలపై, ప్రత్యేక నిఘా పెట్టినట్లు వెల్లడించారు.

News March 17, 2024

నేతల ఫ్లెక్సీలను తొలగించండి: విజయనగరం కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా నేటి నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి చెప్పారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశమై ఎన్నికల నేపథ్యంలో ఆయా శాఖలు పాటించాల్సిన నిబంధనలపై ఆదేశాలిచ్చారు. నేతల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు తొలగించడంలో ముమ్మరంగా పనిచేయాలన్నారు.

News March 16, 2024

విజయనగరం: ‘విద్యుత్ చౌర్యం చేస్తే సమాచారం అందించండి’

image

విద్యుత్ నిఘా శాఖ, DPE అధికారులు విజయనగరం సర్కిల్ పరిదిలో పలు ప్రాంతాల్లో సంయుక్తంగా దాడులు చేసినట్లు విద్యుత్ విజిలెన్స్ విజయనగరం సర్కిల్ సీఐ కె. కృష్ణ శనివారం తెలిపారు. తెర్లాం మండలం బూరిపేట, మెరకముడిదాం మండలం బుదరాయవలస గ్రామాలలో విద్యుత్ చౌర్యం చేస్తున్న నిందితుల నుంచి 1,03,548 అపరాద రుసుం, రూ.10వేలు జరిమానా విధించామన్నారు. విద్యుత్ చౌర్యం సమాచారం తెలిస్తే 08922-234579కి తెలియజేయాలన్నారు.

News March 16, 2024

నేతల ఫ్లెక్సీలను తొలగించండి: విజయనగరం కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా నేటి నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి చెప్పారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశమై ఎన్నికల నేపథ్యంలో ఆయా శాఖలు పాటించాల్సిన నిబంధనలపై ఆదేశాలిచ్చారు. నేతల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు తొలగించడంలో ముమ్మరంగా పనిచేయాలన్నారు.

News March 16, 2024

VZM: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

image

గంట్యాడ మండలంలోని వసాది గ్రామ సమీపంలో కొత్త వెలగాడ రహదారి జంక్షన్‌లో రహదారిపై, శనివారం మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్.కోట మం. కొత్తూరు గ్రామానికి చెందిన భార్యా భర్తలు ఒక బైక్‌పై, వేరొక బైక్‌పై జామి మం. తానవరానికి చెందిన ముగ్గురు యువకులు వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కొత్తూరు వాసి మృతిచెందగా, అతని భర్యతో పాటు తానవరానికి చెందిన ముగ్గురు యువకులు గాయపడ్డారు.

News March 16, 2024

రామభద్రపురం: చెట్టు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

నాయుడువలస గ్రామానికి చెందిన M. నారాయణ రావు (46)చెట్టు మీద నుంచి జారిపడి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నారాయణ రావు హైదరాబాద్‌లో చక్కెర కర్మాగారంలో పనిచేస్తూ సెలవుపై సొంతూరు కొద్ది రోజుల ముందు వచ్చారు. ఈరోజు ఇంటివద్ద ఉన్న చింతచెట్టు కాయలు కోస్తుండగా కాలుజారి పడ్డాడు. గాయాలు కావడంతో అస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు హెచ్సీ సత్యనారాయణ తెలిపారు.

News March 16, 2024

అరకు ఎంపీ వైసీపీ అభ్యర్థిగా డాక్టర్

image

అరకు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా చెట్టి తనూజారాణికి టిక్కెట్ కేటాయిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తనూజారాణికి అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ కుమారుడు వినయ్‌తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. తనూజారాణి తండ్రి శ్యాం సుందర్ హుకుంపేట మండలం అడ్డుమండ సర్పంచ్. తనూజారాణికి ఎంపీ కేటాయింపుతో మూడు సామాజిక వర్గాలకు న్యాయం చేకూరిందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 16, 2024

విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన నేపథ్యం ఇదే

image

విజయనగరం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మళ్లీ బెల్లాన చంద్రశేఖర్‌కే అవకాశం దక్కింది. బీఎల్ చదివిన ఆయన జెడ్పీటీసీ‌గా, జడ్పీ ఛైర్మన్‌గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా పోటీ చేసి అశోక్ గజపతి రాజుపై విజయం సాధించారు. డిగ్రీ చదివిన రోజుల్లో విద్యార్థి సంఘ నాయకుడిగా కూడా పనిచేశారు. ఆయన భార్య శ్రీదేవి చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా 10 ఏళ్లు పనిచేశారు.