Vizianagaram

News July 15, 2024

విజయనగరంలో ఇద్దరు చిన్నారులు మిస్సింగ్

image

విజయనగరం పట్టణానికి చెందిన బూర ప్రసాద్, దొడ్డిరేసి రాఘవేంద్రరావు అనే ఇద్దరు పిల్లలు కనబడడం లేదని స్థానిక 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై హరిబాబు నాయుడు సోమవారం తెలిపారు. పిల్లల ఆచూకీ తెలిసిన వారు విజయనగరం 84990 04114, 91211 09419 ఫోన్ నంబర్లకు తెలియజేయాలని కోరారు.

News July 15, 2024

గుమ్మలక్ష్మీపురంలో యూట్యూబర్ హర్షసాయి పేరిట ఛీటింగ్

image

యూట్యూబర్ హర్షసాయి పేరిట గుమ్మలక్ష్మీపురం మండలం టిక్కబాయికి చెందిన బిడ్డిక సోమేశ్ సైబర్ మోసానికి గురయ్యాడు. హర్షసాయి హెల్పింగ్ టీమ్ నుంచి రూ.3 లక్షలు సాయం చేస్తామని యువకుడి ఫోన్ కు మెసేజ్ వచ్చింది. ఖాతా నిర్ధారణకు రూ.1150 వేయాలని కోరగా సోమేశ్ నగదు చెల్లించాడు. తొలి విడత లక్ష వేసినట్లు నకిలీ స్క్రీన్ షాట్ పంపించారు. జీఎస్టీ లేని కారణంగా నగదు జమకాలేదని.. మరికొంత వేయాలనగా నగదు చెల్లించి మోసపోయాడు.

News July 15, 2024

విజయనగరం: గత రెండేళ్లలో జరిగిన అత్యాచారాలు ఎన్నంటే..!

image

రామభద్రపురంలో ఆదివారం 6నెలల చిన్నారిపై జరిగిన ఘటన తల్లుల గుండెల్ని పిండేస్తోంది.అయితే విజయనగరం జిల్లాలో 18 ఏళ్లకు పైబడిన వారికి సంబంధించి 2022లో 179,2023లో 108 లైంగిక వేధింపులు కేసులు నమోదయ్యాయి. మరోవైపు గత రెండేళ్లగా మైనర్లపై 57 అత్యాచారాలు జరిగినట్లు నివేదిక చెప్తోంది. ప్రేమ పేరుతో కొందరు మృగాళ్లుగా ప్రవర్తిస్తుంటే, మరికొందరు బంధువులే తమ కామ వాంఛలకు ముక్కపచ్చలారని చిన్నారులను కాటేస్తున్నారు.

News July 15, 2024

తాటిపూడి జలాశయంలో మృతదేహం కలకలం

image

గంట్యాడ మండలంలోని తాటిపూడి జలాశయంలో గుర్తు తెలియని మృతదేహం ఆదివారం సాయంత్రం లభ్యమైందని గంట్యాడ ఎస్‌.ఐ సురేంద్ర నాయుడు తెలిపారు. మృతుని వయస్సు సుమారు 45 – 50 మధ్య ఉంటుందన్నారు. మూడు రోజుల క్రితమే ఈ సంఘటన జరిగి ఉంటుందని ప్రాథమిక నిర్ధారణలో తెలిపారు. స్థానిక VRO సమాచారంతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని విజయనగరం కేంద్ర ఆస్పత్రికి తరలించామన్నారు. ఆచూకీ తెలిసినవారు పోలీస్ స్టేషన్‌‌ను సంప్రదించాలన్నారు.

News July 15, 2024

నెల్లిమర్ల: రోడ్డుప్రమాదంలో మహిళ మృతి

image

బైక్‌ను లారీ ఢీకొనడంతో ఓ మహిళ మృతిచెందిన ఘటన నెల్లిమర్ల మండలం వల్లూరు సమీపంలో జరిగింది. సతివాడ గ్రామానికి చెందిన శారద(39) రణస్థలం మండలం గిడిజాలపేటలోని బంధువుల అంత్యక్రియలకు కుమారుడు చందుతో కలిసి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. కొంతదూరం బైక్‌ను లారీ ఈడ్చుకెళ్లింది. శారద అక్కడికక్కడే మృతిచెందగా చందు గాయపడ్డాడు. ఎస్ఐ రామ గణేశ్‌ కేసు నమోదు చేశారు.

News July 15, 2024

బల్లంకిలో పసలమ్మ పండుగ మహోత్సవం

image

వేపాడ మండలం బల్లంకి గ్రామంలో ఆదివారం సాయంత్రం పసలమ్మ పండగ ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వరలక్ష్మీ కనకరాజు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో అమ్మవారి పండుగ జరుపుకున్నారు. పూర్వీకుల సాంప్రదాయం మేరకు ప్రతి ఏటా ఖరీఫ్ సాగుకు వరి నారు వేసిన అనంతరం ఆదివారం పశువుల పండుగ చేయడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటామని గ్రామస్థులు చెప్పారు.

News July 14, 2024

గంగాడ గ్రామంలో వివాహిత హత్య

image

బలిజిపేట మండలంలో వివాహిత మృతదేహం కలకలం రేపింది. గంగాడ గ్రామానికి చెందిన సావిత్రి (56) మిస్సింగ్‌కు సంబంధించి కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. ఆదివారం చెరువులో మృతదేహాన్ని గుర్తించామన్నారు. ఆమె భర్త, కొడుకు కలిసి హత్య చేశారని మృతురాలి మేనల్లుడు తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 14, 2024

వాడికి ఉరి శిక్ష వేయాలి: చిన్నారి తల్లి

image

రామభద్రపురం మండలంలో ఆరు నెలల చిన్నారిపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయనగరం ఘోషా ఆసుపత్రిలో <<13625276>>చిన్నారి<<>> చికిత్స పొందుతోంది. చిన్నారి తల్లి మీడియాతో మాట్లాడుతూ.. బిడ్డను ఊయలలో వేసి సరకుల కోసం బయటకి వెళ్లి వచ్చేసరికి పాప ఏడుస్తోందని తెలిపింది. ప్రశ్నించే సరికి అతడు పారిపోయాడని, పక్క గ్రామంలో తమ వాళ్లు పట్టుకున్ననట్లు చెప్పింది. అతనికి ఉరి శిక్ష వేయాలని ఆమె కోరింది.

News July 14, 2024

VZM: గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 13 అంబేడ్క‌ర్ గురుకులాల్లో గెస్ట్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి ఈనెల 18న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లాల కో-ఆర్డినేటర్ ఫ్లోరెన్స్ తెలిపారు. తెలుగు, ఫిజికల్ సైన్స్, ఇంగ్లిష్, గణితం,జువాలజీ, హిందీ, ఎకనామిక్స్, పీడీ, స్టాఫ్ నర్స్ వంటి కొలువులకు నెల్లిమర్ల గురుకులంలో ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. ఉదయం 9:30కు విద్యార్హత పత్రాలతో హాజరుకావాలని సూచించారు. >Share it

News July 14, 2024

అత్యాచార ఘటనపై జడ్పీ చైర్మన్ ధ్రిగ్భ్రాంతి

image

అభం శుభం తెలియని ఆరునెలల చిన్నారిపై అత్యాచార యత్నం చేసిన సంఘటనపై, జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సంఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత బాలిక ఆరోగ్య పరిస్థితి పై ఘోషాసుపత్రి వైద్యులు, స్త్రీ శిశు సంక్షేమ అధికారులను ఆయన వాకబు చేశారు. బాలికకు మరింత మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. నిందితుడిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

error: Content is protected !!