India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రామభద్రపురం మండలంలోని ఓ గిరిజన గ్రామంలో పసికందుపై జరిగిన <<13625276>>అత్యాచార<<>> ఘటనపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఆమె స్థానిక పోలీస్ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరికాసేపట్లో విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఘోషాసుపత్రిలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
లద్దాక్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో అసువులుబాసిన సైనికుడు గొట్టాపు శంకరరావు భౌతిక కాయం శనివారం బొత్సవానివలస చేరుకుంది. సైనిక లాంఛనాలతో అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. ‘నా పిల్లలు ఏం పాపం చేశారు దేవుడా.. ఇంత చిన్న వయసులో వారికి తండ్రిని దూరం చేశావని’ భార్య కోమలత రోదించిన తీరు, దు:ఖాన్ని దిగమింగి తండ్రి భౌతికాయానికి సెల్యూట్ చేసిన పిల్లలను చూసి అక్కడున్నవారు కన్నీరు పెట్టుకున్నారు.
రామభద్రపురం మండలంలోని ఓ గిరిజన గ్రామంలో దారుణం జరిగింది. ఆరు నెలల పసికందుపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు తల్లిదండ్రులు శనివారం రాత్రి పోలీసులను ఆశ్రయించారు. బాధిత చిన్నారికి తీవ్రంగా రక్తస్రావం జరగడంతో బాడంగి ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. వైద్యుల సూచనల మేరకు అక్కడ నుంచి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.
గత విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ లో అధిక సంఖ్యలో సీట్లు దక్కాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 381 మందికి సీట్లు లభించాయి. విజయనగరం జిల్లాలో 286 మంది విద్యార్థులు సీట్లు సాధించి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలవగా, పార్వతీపురం మన్యం జిల్లాలో 95 మంది విద్యార్థులు సీట్లు సాధించి 20వ స్థానంలో నిలిచారు.
జిల్లా ఎస్పీగా దీపిక పాటిల్ మూడేళ్లు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. 2021 జులై 12న విధుల్లో చేరిన ఆమె తక్కువ కాలంలోనే అన్ని పోలీస్ స్టేషన్లలో సుడిగాలి పర్యటనలు చేసి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. రామభద్రపురం, పీ.కోనవలస, బొడ్డవర చెక్ పోస్ట్లను బలోపేతం చేసి గంజాయి అక్రమ రవాణాను సాధ్యమైనంతగా నిరోధించారు. మత్తు పదార్థాలకు యువత బానిస కాకుండా అవగాహన సదస్సులు నిర్వహించారు.
విజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ప్రస్తుతం బాపట్ల ఎస్పీగా పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఎస్పీ ఎం.దీపిక అనకాపల్లికి బదిలీ అయ్యారు. అదేవిధంగా APSP 5వ బెటాలియన్ కమాండెంట్గా మలికా గర్గ్ను నియమించారు. ఈమె ప్రస్తుతం పల్నాడు జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. కాగా SP వకుల్, మలికా గర్గ్ భార్యాభర్తలు కావడం విశేషం.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను సోమవారం సీతంపేటలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీతంపేట ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ సమస్యలు సమర్పించవచ్చని ఆయన చెప్పారు. స్థానిక ప్రజలు గిరిజనులు అంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
విజయనగరంలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 18 నుంచి 21 వరకు జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్, ఎంపిక పోటీలు జరుగుతాయని అసోసియేషన్ ఛైర్మన్ ఇందుకూరి రఘు రాజు తెలిపారు.అసోసియేషన్ సీఈవో పి. శ్రీరాములుతో కలిసి మాట్లాడారు.ఈ నెల 18న అండర్-11,13,19న అండర్-15, 17 బాలబాలికలు,20న అండర్-19, స్త్రీ, పురుషులకు,21న వెటరన్ స్త్రీ, పురుషులకు పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈనెల 15 లోపు వివరాలు అందించాలన్నారు.
అగ్నిపథ్లో భాగంగా అగ్నివీర్-వాయు సేనలో ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అవివాహిత పురుష,మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యువజన సర్వీసుల శాఖ సీఈవో రాంగోపాల్ తెలిపారు.ఇంజినీరింగ్లో మూడు సంవత్సరాలు చదివిన వారు,రెండు సంవత్సరాల ఒకేషనల్ కోర్సు పూర్తి చేసిన వారు కూడా అర్హులని చెప్పారు.ఈనెల 28 వరకు అవకాశం ఉందని అన్నారు. https://agni- pathavaya.cdac.in వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలన్నారు.
పరీక్షల్లో తప్పినా పాస్ చేయించాక ఉద్యోగం ఇప్పిస్తామని ఓ ముఠా రూ. 12 లక్షలు కొల్లగొట్టిన ఘటన బొబ్బిలిలో జరిగింది. విద్యార్థి రాజాంలోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదివాడు. కొన్ని సబ్జెక్టులు ఫెయిలయ్యాడు. మే రెండో వారంలో ముఠా అతని తండ్రికి ఫోన్ చేసి పాస్ చేసి, ఉద్యోగం ఇప్పిస్తామని వసూలు చేశారు. ఫలితాలు వెలువడడం ,మళ్లీ ఫెయిలవడంతో మోసపోయానని గ్రహించారు. దీనిపై శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు.
Sorry, no posts matched your criteria.