India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లద్దాక్లో ఆక్సిజన్ సిలిండర్ పేలిన ఘటనలో మృతి చెందిన బొత్సవానివలసకు చెందిన జవాన్ <<13611983>>గొట్టాపు శంకర్రావు<<>>(41) మరో ఆరు నెలల్లో రిటైర్ కాబోతున్నారు. 2003లో ఆర్మీలో చేరిన ఆయన మెకానిక్గా పనిచేస్తున్నారు. శంకర్రావుకు భార్య, తొమ్మిదేళ్ల పాప, ఏడేళ్ల బాబు ఉన్నారు. ఫిబ్రవరిలో ఇంటికి వచ్చి సరదాగా గడిపారని అతని తల్లిదండ్రులు, బంధువులు రోదిస్తున్నారు. మృతదేహాన్ని హెలికాప్టర్లో స్వగ్రామానికి తీసుకురానున్నారు.
బాడంగి మండలంలోని బొత్సవానివలసలో విషాదఛాయలు అలముకున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని లద్దాఖ్ వద్ద ఆక్సిజన్ సిలిండర్ పేలిన సంఘటనలో ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతి చెందిన వారిలో బాడంగి మండలం బొత్సవానివలసకి చెందిన గొట్టాపు శంకరరావు ఉన్నారు. శంకరరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతితో విషాదం నెలకొంది.
ఈ నెల 20న సింహాచలం గిరి ప్రదక్షిణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రదక్షిణ చేయటానికి లక్షల మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తారు. కావున వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ తగిన ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ప్రదక్షిణ చేసే భక్తులకు ఆస్తమా, జ్వరం మొదలైనవి ఉన్నట్లయితే తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రదక్షిణ సమయంలో అలసట, నీరసం వస్తే దగ్గరలో వైద్యశిబిరాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ పేరిట +977 ISD కాల్స్ వస్తున్నాయని అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికార యంత్రాంగం గురువారం తెలిపింది. +977 970-2640751 నంబర్ పేరిట కాల్ చేసి కొంత మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఇటువంటి నంబర్తో వచ్చిన కాల్స్ను ఎవరు లిఫ్ట్ చేయవద్దని అధికారులు చెబుతున్నారు. ఈ స్కామ్కి సంబంధించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఉమ్మడి విజయనగరంలో జిల్లా జనాభా 28,56,151కు చేరుకుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో 9,25,340 మంది, విజయనగరం జిల్లాలో 19,30,811 మంది జనాభా ఉన్నట్లు ఏయూ జనాభా అధ్యయన కేంద్రం అంచనా వేసింది. 2011తో పోల్చితే ఉమ్మడి జిల్లాలో సుమారు ఐదు లక్షలకు పైగా జనాభా పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి విజయనగరం జిల్లా జనాభా 23,42,868గా ఉంది.
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ గడువును ఈనెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు. 18 నుంచి 20 వరకు స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేస్తారు. 23 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్లో మార్పులు చేసుకోవడానికి 27వ తేదీన అవకాశం కల్పిస్తారు. ఈ నెల 31న తొలి దశ సీట్ల కేటాయిస్తారు. >Share it
ఉత్తరాంధ్రుల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి అమ్మవారి చదురు గుడి హుండీ ఆదాయాన్ని బుధవారం సిబ్బందితో స్థానిక కల్యాణ మండపంలో లెక్కించారు. 37 రోజులకు రూ.13,43,881 నగదు, 18.600 గ్రాముల బంగారం, 486 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ ప్రసాదరావు, దేవదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్ టి.అన్నపూర్ణ తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 11.20 నుంచి 11.50 వరకు అనకాపల్లి జిల్లాలోని దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి 12.35కు భోగాపురం చేరుకుంటారు. 1.30 వరకు ఎయిర్ పోర్టు ప్రాంతాన్ని సందర్శిస్తారు. అనంతరం పనులు జరుగుతున్న తీరుపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం విశాఖకు వెళ్లనున్నారు.
విజయనగరం పట్టణంలోని గోకపేటలో 45వ సచివాలయాన్ని విజయనగరం కమిషనర్ మల్లయ్య నాయుడు బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇద్దరు సచివాలయ కార్యదర్శులు విధులకు గైర్హాజరు కావడంతో వారికి శ్రీముఖాలు జారీ చేశారు. రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడంపై సిబ్బందిపై మండిపడ్డారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గజపతినగరం మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడి బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.40 లక్షలు తస్కరించారు. ఈ మేరకు ఆయన బుధవారం గజపతినగరం సబ్ ఇన్స్పెక్టర్ మహేశ్కు ఫిర్యాదు చేశారు. నగదు ఖాతా నుంచి డెబిట్ అయినట్లు సంక్షిప్త సందేశాలు వచ్చాయని, బ్యాంక్ ఖాతాను పరిశీలిస్తే సొమ్ము లేదని వాపోయారు.
Sorry, no posts matched your criteria.