Vizianagaram

News July 14, 2024

ఉమ్మడి విజయనగరంలో 381 మందికి ట్రిపుల్ ఐటీల్లో సీట్లు

image

గత విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ లో అధిక సంఖ్యలో సీట్లు దక్కాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 381 మందికి సీట్లు లభించాయి. విజయనగరం జిల్లాలో 286 మంది విద్యార్థులు సీట్లు సాధించి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలవగా, పార్వతీపురం మన్యం జిల్లాలో 95 మంది విద్యార్థులు సీట్లు సాధించి 20వ స్థానంలో నిలిచారు.

News July 14, 2024

VZM: సమర్థవంతంగా మూడేళ్లు పనిచేసిన ఎస్పీ దీపిక

image

జిల్లా ఎస్పీగా దీపిక పాటిల్ మూడేళ్లు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. 2021 జులై 12న విధుల్లో చేరిన ఆమె తక్కువ కాలంలోనే అన్ని పోలీస్ స్టేషన్‌లలో సుడిగాలి పర్యటనలు చేసి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. రామభద్రపురం, పీ.కోనవలస, బొడ్డవర చెక్ పోస్ట్‌లను బలోపేతం చేసి గంజాయి అక్రమ రవాణాను సాధ్యమైనంతగా నిరోధించారు. మత్తు పదార్థాలకు యువత బానిస కాకుండా అవగాహన సదస్సులు నిర్వహించారు.

News July 13, 2024

విజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్

image

విజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ప్రస్తుతం బాపట్ల ఎస్పీగా పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఎస్పీ ఎం.దీపిక అనకాపల్లికి బదిలీ అయ్యారు. అదేవిధంగా APSP 5వ బెటాలియన్ కమాండెంట్‌గా మలికా గర్గ్‌ను నియమించారు. ఈమె ప్రస్తుతం పల్నాడు జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. కాగా SP వకుల్, మలికా గర్గ్ భార్యాభర్తలు కావడం విశేషం.

News July 13, 2024

సీతంపేటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను సోమవారం సీతంపేటలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీతంపేట ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ సమస్యలు సమర్పించవచ్చని ఆయన చెప్పారు. స్థానిక ప్రజలు గిరిజనులు అంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News July 13, 2024

విజయనగరంజిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు

image

విజయనగరంలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 18 నుంచి 21 వరకు జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్, ఎంపిక పోటీలు జరుగుతాయని అసోసియేషన్ ఛైర్మన్ ఇందుకూరి రఘు రాజు తెలిపారు.అసోసియేషన్ సీఈవో పి. శ్రీరాములుతో కలిసి మాట్లాడారు.ఈ నెల 18న అండర్-11,13,19న అండర్-15, 17 బాలబాలికలు,20న అండర్-19, స్త్రీ, పురుషులకు,21న వెటరన్ స్త్రీ, పురుషులకు పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈనెల 15 లోపు వివరాలు అందించాలన్నారు.

News July 13, 2024

విజయనగరం:అగ్నిపథ్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

అగ్నిపథ్‌లో భాగంగా అగ్నివీర్-వాయు సేనలో ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అవివాహిత పురుష,మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యువజన సర్వీసుల శాఖ సీఈవో రాంగోపాల్ తెలిపారు.ఇంజినీరింగ్‌లో మూడు సంవత్సరాలు చదివిన వారు,రెండు సంవత్సరాల ఒకేషనల్ కోర్సు పూర్తి చేసిన వారు కూడా అర్హులని చెప్పారు.ఈనెల 28 వరకు అవకాశం ఉందని అన్నారు. https://agni- pathavaya.cdac.in వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలన్నారు.

News July 13, 2024

బొబ్బిలి: పరీక్షలో పాస్ చేస్తామని రూ.12 లక్షలు టోకరా

image

పరీక్షల్లో తప్పినా పాస్ చేయించాక ఉద్యోగం ఇప్పిస్తామని ఓ ముఠా రూ. 12 లక్షలు కొల్లగొట్టిన ఘటన బొబ్బిలిలో జరిగింది. విద్యార్థి రాజాంలోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదివాడు. కొన్ని సబ్జెక్టులు ఫెయిలయ్యాడు. మే రెండో వారంలో ముఠా అతని తండ్రికి ఫోన్ చేసి పాస్ చేసి, ఉద్యోగం ఇప్పిస్తామని వసూలు చేశారు. ఫలితాలు వెలువడడం ,మళ్లీ ఫెయిలవడంతో మోసపోయానని గ్రహించారు. దీనిపై శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు.

News July 13, 2024

VZM: జడ్పీ సమావేశంలో ఆసక్తికరమైన చర్చ

image

జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ జడ్పీటీసీ సభ్యురాలు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ‘మీ పాలన మీ తాతగారిని గుర్తుచేస్తోంది’ అని మంత్రిని ఉద్దేశించి ఆమె అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ప్రజా ప్రతినిధిని ఆయన గౌరవించే వారని గుర్తు చేశారు. మంత్రి స్పందిస్తూ ‘తాతగారి బాటలో మీ అందరి సహకారంతో పనిచేస్తాం’ అని మాట ఇస్తున్నానన్నారు.

News July 12, 2024

ఇది ప్ర‌జా స్వామ్య‌మా.. రౌడీ రాజ్య‌మా?: పుష్ప శ్రీవాణి

image

కూట‌మి ప్ర‌భుత్వం వైసీపీ నాయ‌కుల దాడుల‌పై పెట్టినంత దృష్టి రాష్ట్ర ప్ర‌జ‌ల మాన‌, ప్రాణాల‌పై పెట్ట‌క‌పోవ‌డం సిగ్గుచేటు అని మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నంద్యాల‌లో బాలిక‌పై ముగ్గురు మైన‌ర్ అబ్బాయిలు అత్యాచారం చేసి హ‌త్య చేస్తే కూటమి సర్కార్ స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇది ప్ర‌జా స్వామ్య‌మా? రౌడీ రాజ్య‌మా? అంటూ వ్యాఖ్యానించారు.

News July 12, 2024

VZM: జడ్పీ సమావేశానికి ఆ ఎమ్మెల్యేలు గైర్హాజరు

image

NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన తొలి జిల్లా పరిషత్ సమావేశానికి ప్రజా ప్రతినిధులు గైర్హాజరయ్యారు. చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు, ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన, రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీ మోహన్ ఈ సమావేశాలకు హాజరు కాలేదు.