India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో రూ.300 కోట్లతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆధ్వర్యంలో అధ్యయన కమిటీని వేశారు. వీరు రుషికొండ భవనంపై అధ్యయనం చేయడంతో పాటు విశాఖ, SKLM, VZM జిల్లాలో కొత్త పర్యాటక ప్రాంతాలను గుర్తించనున్నారు. పర్యాటకుల సంఖ్య పెరిగే విధంగా సూచనలిస్తారు. మరి మీ దగ్గర పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ప్రాంతం ఏదైనా ఉంటే కామెంట్ చెయ్యండి
పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా పనిచేస్తున్న సేతు మాధవన్ విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్గా బదిలీపై వచ్చారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. జిల్లాపై కొంత వరకు అవగాహన ఉందని, ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ విధులు నిర్వహిస్తానని తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ అయ్యేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.
సాలూరులోని అన్న క్యాంటీన్లో భోజనం అందించేందుకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. బుధవారం సాలూరు తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో అన్న క్యాంటీన్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రూ.60 లక్షల అంచనా వ్యయంతో భవనాన్ని నిర్మిస్తున్నారు. పేదలు ఆకలితో అలమటించకూడదనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
హత్య కేసులో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ మంగళవారం రాత్రి పార్వతీపురం రెండవ అదనపు జిల్లా జడ్జి దామోదర్ రావు తీర్పునిచ్చినట్లు పోలీసులు తెలిపారు. 2015లో పట్టణంలోని జరిగిన ఘర్షణ, హత్య కేసులో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.1000 జరిమానా, ఏడుగురికి సంవత్సరం పాటు జైలు శిక్షతో పాటు రూ. 500 జరిమానా విధించినట్లు తెలిపారు.
విశాఖ స్థానిక సంస్థల MLC ఉప ఎన్నికలలో బొత్సను వైసీపీ అధిష్ఠానం బరిలో దింపింది. అయితే కూటమి నుంచి ఎవరూ పోటీలోలేరని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బొత్స విజయం ఖాయం కానుంది. దీనిపై స్పందిస్తూ మాజీ మంత్రి అంబటి ” YSRCP పూర్వ వైభవానికి బీజం వేసిన బొత్స విజయం ” అంటూ తన X లో పేర్కొన్నారు. ఇది నిరుత్సాహంలో ఉన్న వైసీపీకి ఊరటనిచ్చే విషయమేనని పలువురు చర్చించుకుంటున్నారు.
కన్నబిడ్డల ఎదుటే భార్యను, భర్త హత్య చేసిన ఘటన విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో జరిగింది. సీఐ నారాయణమూర్తి వివరాల మేరకు.. మూలబొడ్డవర పంచాయతీకి చెందిన డి.దేముడు భార్యపై అనుమానంతో ఆదివారం రాత్రి టేకు చెక్కతో దాడి చేశాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగా..స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందింది. దీనిపై కేసు దర్యాప్తులో ఉందని, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు.
విజయనగరం జిల్లా కేంద్రంలో రెండు అన్న క్యాంటీన్ల ప్రారంభానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అదే రోజు జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రకాశం పార్క్ వద్ద అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. కాగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఆ రోజు ఎక్కడా అన్న క్యాంటీన్లు ప్రారంభం కావడం లేదు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మంగళవారం భేటీ అయ్యారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. జగన్ ను కలిసిన వారిలో జిల్లాకు చెందిన పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా ఈ నెల 16న విజయనగరం జిల్లాకు రానున్నారు. ఆగస్టు 15 నుంచి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 16న సిసోడియా జిల్లాకు విచ్చేసి రోజంతా వివిధ మండలాల్లో పర్యటిస్తారని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఎంపీడీఓలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి గ్రామాల్లో పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించాలన్నారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉత్తరాంధ్ర వైసీపీ కేడర్ నిరుత్సాహానికి గురైంది. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చింది. గెలవడడానికి బలమున్నా సరే టీడీపీ పోటీలో ఉంటే ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇదే సమయంలో బొత్సను వైసీపీ అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. చివరకు పోటీ నుంచి కూటమి తప్పుకోవడంతో ఆయన గెలుపు లాంఛనం కానుంది. బొత్స లాంటి సీనియర్ నేత MLC అయితే YCPకి జోష్ వస్తుందా? మీ కామెంట్.
Sorry, no posts matched your criteria.