Vizianagaram

News July 10, 2024

సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణ రూట్ మ్యాప్ ఇదే

image

ఈనెల 20న జరిగే సింహాద్రి అప్పన్న గిరి ప్రదర్శనకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 32 కిలోమీటర్ల మేర జరిగే ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. సింహాచలం, అడివివరం, బి.ఆర్.టీ.ఎస్ రహదారి మీదుగా, ముడసర్లోవ, హనుమంతువాక, వెంకోజిపాలెం, సీతమ్మధార, మాధవధార, ఎన్.ఎ.డి కూడలి నుంచి గోపాలపట్నం మీదుగా సింహాచలం వరకు భక్తులు కాలి నడకన చేరుకుంటారు. > Share it

News July 10, 2024

ప్రతిభ చూపితే భవిత విద్యార్థులదే: డీఈవో

image

ప్రతిభ చూపితే భవిత విద్యార్థుల దేనని జిల్లా విద్యాశాఖ అధికారిని జి.పగడాలమ్మ పేర్కొన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించేందుకు విద్యార్థి విజ్ఞాన్ మందన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు. 6-11 తరగతి విద్యార్థులకు అర్హులని వెల్లడించారు. సెప్టెంబర్ 15 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అన్నారు.

News July 10, 2024

సీఎం చంద్రబాబు భోగాపురం పర్యటన వివరాలు

image

ఈనెల 11న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లా భోగాపురంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.35 గంటలకు ఆయన హెలికాప్టర్లో భోగాపురం చేరుకుంటారు. 12.35 నుంచి 1.30 వరకూ భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించి, సమీక్షిస్తారు. 1.35 నిమిషాలకు హెలిపాడ్‌కు చేరుకుని విశాఖపట్నం బయలుదేరి వెళ్తారు.

News July 10, 2024

VZM: రోడ్డు ప్రమాదంలో విశ్రాంత పశువైద్యాధికారి మృతి

image

పూసపాటిరేగ మండలం చోడమ్మఅగ్రహారం వద్ద హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత పశువైద్యాధికారి మృతి చెందారు. శ్రీకాకుళం నుంచి విశాఖ వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విశ్రాంత పశువైద్యాధికారి పక్కి నర్సింగరావు మృతి చెందగా.. డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు. మృతుడిని విశాఖ జిల్లా మర్రిపాలెం చెందినవారుగా పోలీసు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 9, 2024

బొబ్బిలి: ప్రేమ పేరుతో మోసం.. వ్యక్తికి 10 ఏళ్ల జైలు శిక్ష

image

బొబ్బిలి గుడారి వీధికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి దాడితల్లి కాలనీకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను లోబరుచుకున్నడాని, ఆ తర్వాత పెళ్లికి నిరాకరించినట్లు యువతి 2016లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టామన్నారు. తాజాగా నేరం రుజువు కావడంతో అతనికి ఉమెన్ కోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.30వేల జరిమాన విధించినట్లు బొబ్బిలి సీఐ నాగేశ్వరరావు తెలిపారు.

News July 9, 2024

తిరుమల ఎక్స్‌ప్రెస్ రద్దు

image

దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో జరుగుతున్న ఆధునీకరణ పనుల కారణంగా విశాఖ నుంచి బయలుదేరే విశాఖ-కడప (17488) తిరుమల ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 5 నుంచి 10 వరకు, తిరుగు ప్రయాణం చేసే కడప-విశాఖ (17487) తిరుమల ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 6 నుంచి 11వ తేదీ వరకు రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజనల్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే.సందీప్ తెలిపారు.

News July 9, 2024

VZM: ఇక గ్రామాల్లో చెత్త కనిపించదు

image

గ్రామాల్లో ఇక నుంచి చెత్త కనిపించకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీనికోసం పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేకంగా పీఆర్-1 యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా విజయనగరం జిల్లాలోని 27 మండలాల్లో ఉన్న 777 పంచాయతీలు, మన్యం జిల్లాలోని 15 మండలాల్లో ఉన్న 451 పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించనున్నారు.గ్రామీణ నీటి పధకాలు, కాలువలు, బ్లీచింగ్ వంటి వివరాలు యాప్ లో నమోదు చేస్తారు.

News July 9, 2024

విశాఖ-అరకు రహదారి విస్తరణకు గ్రీన్ సిగ్నల్..!

image

విశాఖ-అరకు జాతీయ రహదారి విస్తరణకు త్వరలో మోక్షం కలగనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని కొత్తవలస, శృంగవరపుకోట మీదుగా రహదారి విస్తరణ పనులు జరగనున్నాయి. గత ఏడాది విస్తరణ పనులు ప్రారంభించినప్పటికీ కేంద్రం ఆదేశాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా చంద్రబాబు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లడంతో సానుకూలంగా స్పందించారు.కొత్తవలస, ఎల్ కోట, వేపాడ, ఎస్ కోట మీదుగా 4 లైన్లకు విస్తరించనున్నారు.

News July 9, 2024

ఉమ్మడి జిల్లాలో మందకొడిగా ఖరీఫ్ సాగు

image

జులై మొదటి వారం గడుస్తున్నప్పటికీ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఖరీఫ్ సేద్యం మందకొడిగా సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఆశాజనకంగా కురవకపోవడమే దీనికి కారణంగా రైతులు చెబుతున్నారు. అధికారిక గణంకాల ప్రకారం విజయనగరం జిల్లాలోని 4 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలోని 6 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. ప్రాజెక్టుల్లో నీరు లేని కారణంగా వరి సాగుకు ఇబ్బందులు ఏర్పడ్డాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News July 9, 2024

విజయనగరం జిల్లాలో నేడు కేంద్ర మంత్రి పర్యటన

image

విజయనగరం జిల్లాలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం పర్యటించనున్నారు. భోగాపురం మండలంలో జరుగుతున్న అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను మధ్యాహ్నం రెండు గంటలకు రామ్మోహన్ నాయుడు పరిశీలించనున్నారు. విమానాశ్రయ నిర్మాణ పనుల పురోగతి, వేగవంతానికి చేపట్టాల్సిన చర్యలపై మంత్రి ఆరా తీయనున్నారు.