Vizianagaram

News August 13, 2024

అరకు ఎంపీ ఎన్నికను రద్దు చేయాలని హైకోర్టులో సవాల్

image

అరకు ఎంపీ తనూజా రాణి ఎన్నికను రద్దు చేయాలని బీజేపీ అభ్యర్థి గీత హైకోర్టును ఆశ్రయించారు. ఆమె ఎన్నికల అఫిడవిట్‌లో అవాస్తవాలు చూపారని ఆరోపించారు. ఓట్ల పరంగా రెండో స్థానంలో ఉన్న తనను ఎన్నికైనట్లు ప్రకటించాలన్నారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు తనూజాతో పాటు పదిమంది అభ్యర్థులకు, లోక్ సభ సెక్రటరీ జనరల్, అరకు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేసింది.విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది.

News August 13, 2024

నాటు తుపాకీ గుర్తింపు.. విజయనగరం వాసుల అరెస్ట్

image

విశాఖ జిల్లా కొండెంపూడిలో లైసెన్స్ లేని నాటు తుపాకీతో సంచరిస్తున్న విజయనగరం జిల్లా వాసులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై డి.ఈశ్వరరావు తెలిపారు. ఎల్.కోటకు చెందిన ఎం.సత్యనారాయణ నుంచి దాసరి సత్యారావు తుపాకిని కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. వీరిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. తుపాకీ, గంధకం, శురాకారం, నల్ల బొగ్గు, గన్ పౌడర్, సైకిల్ బాల్స్ స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ చెప్పారు.

News August 13, 2024

పెరిగిన బొత్స ఆస్తులు

image

విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నిన్న నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2024 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆయన ఆస్తులు రూ.73.14 లక్షలు, అప్పులు రూ.95 లక్షలు మేర పెరిగాయి. మేలో ఆయన రూ.73.14 లక్షల విలువైన ఆస్తులు కొనుగోలు చేశారు.

News August 13, 2024

ఆగస్టు 15 నుంచి రెవెన్యూ సదస్సులు: కలెక్టర్

image

భూ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను పూర్తిస్థాయిలో ప‌రిష్క‌రించే ల‌క్ష్యంతో ఆగ‌స్టు 15 నుంచి రెవెన్యూ స‌దస్సుల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ చెప్పారు. జిల్లాలోని తాశిల్దార్లు, ఎంపిడిఓలు, ఇత‌ర సిబ్బందితో క‌లెక్ట‌రేట్లోని త‌న ఛాంబ‌ర్‌ నుంచి సోమ‌వారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం గొప్ప ఆశ‌యంతో, ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌డుతున్న ఈ స‌దస్సుల‌ను విజ‌య‌వంతం చేయాల‌న్నారు.

News August 12, 2024

విజయనగరంలో భారీగా గో మాంసం స్వాధీనం

image

జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ ఆదేశాల మేరకు విజయనగరం వన్ టౌన్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా పశువుల కబేళాపై రైడ్ చేశారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంటోన్మెంట్ ఏరియాలో స్లాటర్ హౌస్‌‌లో ఈ తనిఖీలు జరిగాయి. 1100 కేజీల గోమాంసంతో పాటు 13 కోసిన, 37 జీవంతో ఉన్న ఆవులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 12, 2024

పార్వతీపురంలో ఈనెల 20న జాబ్ మేళా

image

ఈనెల 20న పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయికుమార్ తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల వయస్సు గల డిగ్రీ, పీజీతో పాటు ఆక్వా కల్చర్, మైక్రో బయాలజీ చదువుకున్న వారు అర్హులన్నారు. ఆసక్తిగల వారు రెజ్యూమ్, విద్యార్హత సర్టిఫికెట్లు జిరాక్స్‌తో పాటు ఒక పాస్ పోర్టు సైజ్ ఫొటోతో ఉ.9 గంటలకు హాజరవ్వాలని సూచించారు.

News August 12, 2024

పార్వతీపురం: గుంటూరు – రాయగడ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

image

గత ఆరు నెలలుగా నిలిపివేసిన గుంటూరు – రాయగడ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సర్వీస్‌లు పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. ఈ రైలు విజయనగరం, పార్వతీపురంతో పాటు పలు చోట్ల ఆగనుంది. రైలును పునరుద్ధరించడంతో జిల్లా వాసులకు, ముఖ్యంగా గిరిజన ప్రాంత వాసులకు ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. ఈ నిర్ణయంపై ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

News August 12, 2024

VZM: ఇద్దరు బాలికల కిడ్నాప్..UPDATE

image

విజయనగరం వాసి ఎం.వెంకటేశ్ 15 రోజులు కిందట తూ.గో జిల్లాకు చెందిన ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశామన్నారు. బాలికలను కాకినాడలోని హాస్టల్‌లో వదులుతానని తీసుకుపోయినట్లు వారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధవళేశ్వరం సీఐ గణేశ్ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. వారు నెల్లూరులో ఉన్నట్లు గుర్తించి నిందితుడికి అదుపులోకి తీసుకున్నట్లు సమచారం.

News August 12, 2024

జిమ్మయ్యవలసలో పెళ్లి ఇంట్లో విషాదం

image

జియ్యమ్మవలస మండలం గౌరీపురంలో ఆదివారం పెళ్లింట విషాదం నెలకొంది. విద్యుత్ షాక్‌తో పెళ్లికుమారుడి సోదరుడు చంద్రశేఖర్ మృతి చెందాడు. తండ్రి లేకపోవడంతో తమ్ముడు లక్ష్మణరావు పెళ్లిని దగ్గరుండి చంద్రశేఖర్ చేయిస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

News August 11, 2024

విజయనగరం రైల్వేస్టేషన్లో డెడ్‌బాడీ

image

విజయనగరం రైల్వే స్టేషన్ 4వ ప్లాట్‌ఫాంపై సుమారు 35 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్న పురుషుడి మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు గుర్తించినట్లు ఎస్‌ఐ తెలిపారు. అనారోగ్యంతో చనిపోయినట్లు భావిస్తున్నారు. మృతుడు నీలం రంగు హాఫ్ హ్యాండ్ షర్ట్, కాఫీ రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడన్నారు. వివరాలు తెలిసినవారు విజయనగరం జీఆర్పీ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.