Vizianagaram

News July 6, 2024

నేడు జిల్లాకు మంత్రి శ్రీనివాస్ రాక

image

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి శనివారం ఉదయం టీటీడీసీ మహిళా ప్రాంగణంలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ వసతులను పరిశీలిస్తారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని మంత్రి కోరారు.

News July 5, 2024

VZM: ‘రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి’

image

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆ సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. దాసన్నపేట కార్యాలయంలో ఉమ్మడి విజయనగరం జిల్లా రజక సంఘ నేతల శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రజకులపై సాంఘిక బహిష్కరణ జరగకుండా తక్షణమే రజక చట్టం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు భాస్కర్, సన్యాసి, చిన్న తదితరులు పాల్గొన్నారు.

News July 5, 2024

VZM: ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా

image

ఈ నెల 10న ఎస్.వీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చింతల చలపతిరావు తెలిపారు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. పది, ఇంటర్, ఐటీఐ. డిప్లొమా ఏదైనా డిగ్రీ బీటెక్ ఉత్తీర్ణులైన 35 ఏళ్లలోపు అభ్యర్థులు ఇంటర్వ్యూలకు అర్హులన్నారు. ఆసక్తి గలవారు 10వతేదిన ఉదయం సర్టిఫికెట్స్ జిరాక్స్‌తో హాజరు కావాలన్నారు.

News July 5, 2024

VZM: పోస్టింగులకు కార్యదర్శుల ఎదురు చూపులు..!

image

సరిగ్గా మూడు నెలల క్రితం జిల్లాలో తొమ్మిది మంది గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-1 ఉద్యోగులుగా పదోన్నతి లభించింది. ఇప్పటికీ కూడా వారికి పోస్టింగులు ఇవ్వకపోవడంతో ఎదురు చూస్తున్నారు. మార్చి 16 నుంచి జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిబంధనలు అడ్డొచ్చాయి. కోడ్ ముగిసి నెల దాటుతున్నా పోస్టింగులు ఇవ్వకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.

News July 5, 2024

‘APEPDCL యాప్‌లో బిల్లులు చెల్లించాలి’

image

రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా మార్గదర్శకాలను అనుసరించి విద్యుత్తు బిల్లులను ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లించవద్దని ఏపీఈపీడీసీఎల్ సహాయ గణాంక అధికారిణి ఎం.కుసుమకుమారి ఒక ప్రకటనలో సూచించారు. వినియోగదారుల APEPDCL యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని లేదా సంబంధిత డిస్కం వెబ్ సైట్‌లో బిల్లులు చెల్లించాలని సూచించారు.

News July 5, 2024

VZM: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు..!

image

సాధారణంగా జూన్, జులై నెలల్లో కూరగాయల ధరలు అదుపులోనే ఉంటాయి. ఈ సారి మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. ధరలు అమాంతంగా పెరగడంతో వినియోగదారులు కొనేందుకు బెంబేలెత్తిపోతున్నారు. పచ్చి మిర్చి, అల్లం, టమాటా ధరలు భారీగా పెరిగాయి. కిలో అల్లం రూ. 150 పైచిలుకు పలుకుతోంది. దళారుల ప్రవేశంతో సిండికేట్‌గా మారి ధరలు పెంచేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.

News July 5, 2024

అందుకే మంత్రి పదవి రాలేదేమో: బొబ్బిలి ఎమ్మెల్యే

image

మంత్రి పదవి రాకపోవడంతో బొబ్బిలి ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోమటిపల్లి జ్యోతిబాపులే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రి కిట్లు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ‘నేను డిగ్రీ కూడా పూర్తి చెయ్యలేదు.. అందుకనే మంత్రి పదవి రాలేదేమో’ అని ఆయన నవ్వుతూ వ్యాఖ్యానించారు. చదువు చాలా అవసరమని ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలను చేరుకోవాలని వారికి సూచించారు.

News July 5, 2024

పార్వతీపురం వైసీపీ ఆఫీస్‌కి రెండోసారి నోటీసులు

image

పార్వతీపురం వైసీపీ జిల్లా కార్యాలయానికి వార్డు సచివాలయాల టౌన్‌ ప్లానింగ్‌ సెక్రటరీలు గురువారం రెండోసారి నోటీసును అంటించారు. పట్టణంలోని బెలగాంలో 16వ వార్డులో సాయినగర్‌ కాలనీకి ఆనుకుని అనుమతులు పొందకుండా వైసీపీ జిల్లా కార్యాలయాన్ని నిర్మిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ కమిషనర్‌ కె.శ్రీనివాసరావు ఆదేశాలతో సిబ్బంది నోటీసులు అంటించారు.

News July 5, 2024

జిల్లాలో మంత్రి కొండపల్లి పర్యటన నేడు

image

రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం జిల్లాలో పర్యటిస్తారు. ఆయన ఉదయం 10 గంటల నుంచి జిల్లాపరిషత్ అతిథి గృహంలో అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం 3 గంటలకు దత్తిరాజేరు మండలం కోమటిపల్లిలో జరిగే పార్టీ సమావేశంలో పాల్గొంటారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొవాలని అన్నారు.

News July 4, 2024

VZM: 11 నెలలుగా కోమాలో.. నేడు మృతి

image

కొమరాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒప్పంద అధ్యాపకులుగా పనిచేస్తున్న ఎం. సత్యనారాయణ గురువారం మృతి చెందినట్లు ప్రిన్సిపల్ నాగేశ్వరరావు తెలిపారు. గతేడాది ఆగస్టు 8న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయమయ్యింది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయన నేడు మృతి చెందినట్లు ప్రిన్సిపాల్ వెల్లడించారు. ఆయన మృతి పట్ల ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు మౌనం పాటించి నివాళులర్పించారు.