Vizianagaram

News July 4, 2024

ఎయిర్ ఫోర్సులో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

అగ్ని వీర్ స్కీంలో భాగంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి వహీదా తెలిపారు. పది, ఇంటర్ వివాహం కానీ యువతీ యువకులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చని అన్నారు. ఈనెల 8 నుంచి 28 వరకు అప్లికేషన్ నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. http://agnopathvayu.cdac.in లింకు ద్వారా అప్లే చేసుకోవాలని సూచించారు.

News July 4, 2024

VZM: నిరుద్యోగ యువతకు శుభవార్త

image

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కేంద్రీయ గిరిజన వర్శిటీతో పాటు వీటీ అగ్రహారంలో ఉన్న నాక్ శిక్షణ కేంద్రంలో స్కిల్ హబ్స్ ఏర్పాటు చేస్తున్నామని జిల్లా అధికారి గోవిందరావు తెలిపారు. 18 నుంచి 45 ఏళ్ల వయసు ఉండి కనీసం 8వ తరగతి చదివిన వారికి 3 నెలల పాటు వివిధ కోర్సుల్లో శిక్షణ అందిస్తామన్నారు. ఆసక్తి గల వారు తక్షణమే రెండు కేంద్రాల్లో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.

News July 4, 2024

గంజాయి సాగు చేయకుండా కార్యాచరణ: మంత్రి సంధ్యారాణి

image

గంజాయి సాగు చేయకుండా కార్యాచరణ సిద్ధం చేస్తామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. హోం మంత్రి అనిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, రవీంద్ర, సత్యకుమార్, సంధ్యారాణి, అధికారులు పాల్గొన్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకోవల్సిన పటిష్ఠమైన చర్యలపై సబ్ కమిటీలో సుదీర్ఘంగా చర్చించారు.

News July 4, 2024

VZM: 28,490 పెంపుడు కుక్కలకు ఉచిత టీకాలు

image

జునోసిస్ దినోత్సవ సందర్భంగా ఈ నెల 6న జిల్లాలోని 28,490 పెంపుడు కుక్కలకు ఉచితంగా టీకాలు వేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ జిల్లా సంయుక్త సంచాలకుడు వై.వి.రమణ తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న పెంపుడు కుక్కల యజమానులు సద్వినియోగపరచుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు సమీప పశు వైద్య కేంద్రాలను సంప్రదించాలన్నారు.

News July 4, 2024

VZM: మార్కెట్‌లో సెంచరీ కొట్టిన మిరప

image

మార్కెట్‌లో మిరప మరింత ఘాటెక్కింది. స్థానిక రామభద్రపురం కూరగాయల మార్కెట్‌లో గత నెల కిలో రూ.30 ఉన్న మిర్చిని ప్రస్తుతం రూ.100కు వ్యాపారులు అమ్ముతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మిరపకు తెగుళ్లు సోకి, పంట పాడైపోవడంతో గిరాకీ పెరిగిందని రైతులు చెబుతున్నారు. ఒకే సారి భారీగా పెరిగిపోవడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.

News July 4, 2024

VZM: రేపు పలు రైళ్లు రద్దు చేసిన రైల్వే అధికారులు

image

పలాస-విజయనగరం డివిజన్ పరిధిలో భర్త భద్రతాపరమైన పనులు కారణంగా రేపు పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డిసిఎం కే సందీప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 07471 పలాస-విశాఖ, 07470 విశాఖ -పలాస, 08522 విశాఖ – గునుపూర్, 08521 గునుపూర్ – విశాఖ, 08504 విశాఖ – భవానీపట్నం, 08532 విశాఖ – బ్రహ్మపుర ప్యాసింజర్ ట్రైన్ లు, 22820 విశాఖ – భువనేశ్వర్ ఇంటర్ సిటీ రైలు రద్దు చేసినట్లు తెలిపారు.

News July 4, 2024

నేడు మంత్రుల సబ్ కమిటీ సమావేశం

image

రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు మంత్రుల సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర హోంమంత్రి అనిత అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన ఈ సబ్ కమిటీలో రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, కొల్లు రవీంధ్ర, సత్యకుమార్ యాదవ్, గుమ్మిడి సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు. ఈ సబ్ కమిటీ తొలి సమావేశం 4వ తేదీ గురువారం రాష్ట్ర సచివాలయం ఐదో బ్లాక్ మొదటి అంతస్తులో ఉదయం 11.00 గంటల నుంచి జరుగనుంది.

News July 4, 2024

VZM: నేడు కలెక్టరేట్‌లో అల్లూరి జయంతి

image

నేడు కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటలకు అల్లూరి సీతారామ రాజు జయంతిని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా.బీఆర్.అంబేడ్కర్ తెలిపారు. జిల్లా అధికారులు, సిబ్బంది ఈ వేడుకలకు హాజరు కావాలని ఆదేశించారు. అన్ని జిల్లా, డివిజినల్, మండల, గ్రామ స్థాయి కార్యాలయాల్లో అల్లూరి జయంతి వేడుకలను నిర్వహించాలని సర్కులర్ జారీ చేశారు.

News July 3, 2024

VZM: పోక్సో కేసులో నిందితులకు జైలు శిక్ష

image

బాలికను అపహరించి.. అసభ్యంగా ప్రవర్తించినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో స్థానిక దిశ పోలీస్ స్టేషన్‌లో 2021లో పోక్సో కేసు నమోదయ్యింది. ఈ కేసులోని నిందితులకు కోర్టు జైలు శిక్ష విధించిందని దిశ సీఐ నాగేశ్వరరావు తెలిపారు. నిందితులుగా ఉన్న పూసపాటిరేగ మం. తిప్పలవలసకు చెందిన రాగితి.సత్తయ్య(A1)కు రూ.2,500 జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష, వాసుపల్లి కన్నయ్య(A2)కు రూ.500 జరిమానా, ఏడాది శిక్ష ఖరారైందని చెప్పారు.

News July 3, 2024

ఈనెల 6న శ్రీకాకుళం జిల్లాకు విజయనగరం ఎంపీ

image

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈనెల 6న శనివారం శ్రీకాకుళం జిల్లాకు వెళ్లనున్నారు. ఇటీవల ఢిల్లీలో కలిశెట్టి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శ్రీకాకుళం మొదటిసారి వెళ్తున్నారు. ఈ సందర్భంగా విశాఖ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యకర్త నుంచి కలిశెట్టి ఎంపీగా అత్యధిక మెజారిటితో గెలిచిన విషయం తెలిసిందే.