India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కు పోటీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన మెగా డీఎస్సీ హామీ మేరకు జిల్లాకు 583 పోస్టులు మంజూరయ్యాయి. డీఎస్సీకు టెట్లో వచ్చే మార్కులు వెయిటేజీ ఉండడంతో ఒక్క మార్క్ అయినా కలుస్తుందనే ఆశతో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2022 డీఎస్సీ ప్రకటనలో 16,079 మంది టెట్ పరీక్ష రాయగా, 2024 ఫిబ్రవరి ప్రకటనలో 10,429 మంది పరీక్షలు రాశారు.
సమయపాలన పాటించని అధికారులపై కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు సంబంధిత అధికారులు ఉదయం 9:45 గం.కే రావాలని ముందుగానే సమాచారం ఇచ్చారు. దీంతో చాలా మంది 10 గంటల తరువాత రావడంతో కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేస్తూ 10:05 గంటలకు ఆడిటోరియం తలుపులు మూయించారు. 36 మందికి మెమోలు జారీ చేసినట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి.
వైసీపీ ప్రభుత్వ పాలన వద్దని ప్రజలు ఛీకొట్టినా ఆ పార్టీ నేతలకు ఇంకా జ్ఞానోదయం కలగకపోవడం విచారకరమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై గంటా స్పందించారు. వైసీపీకి చెందిన వారిని వీసీలుగా నియమించుకుని జగన్ రెడ్డి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఎక్స్ వేదికగా ఎమ్మెల్యే ఆరోపించారు.
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నూతన సీఈఓగా సీ.హెచ్. ఉమా మహేశ్వరరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును ఆయన ఛాంబర్లో మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా ప్రజలకు సెంట్రల్ బ్యాంక్ ద్వారా మెరుగైన సేవలు అందించాలని జెడ్పీ ఛైర్మన్ ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జి.పగడాలమ్మ అన్నారు. జిల్లాలో ఆసక్తిగల ఉపాధ్యాయులు http://nationalawardstoteacher.education.gov.in లింకులో నామినేషన్ చేసుకోవచ్చన్నారు. ఈ నెల 27 నుంచి ఆగస్టు 15వరకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హత గల ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
పెన్షన్ పంపిణీలో సచివాలయ సిబ్బంది అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమిషనర్ మల్లయ్య నాయుడు హెచ్చరించారు. సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పెన్షన్ల మొత్తంలో కమీషన్ల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు గుర్తిస్తే తన దృష్టికి తేవాలని సూచించారు. 9849906486 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే పరిశీలించి సదరు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛను పథకం ద్వారా పెంచిన పింఛన్లు సోమవారం 96.99 శాతం పంపిణీ చేసి రాష్ట్రంలోనే మెుదటి స్థానంలో నిలిచింది. విజయనగరం జిల్లాలో 2,81,713 మంది లబ్ధిదారులకు గాను 2,73,239 మందికి పింఛన్ పంపిణీ చేసినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. రూ.186,88,88000 పెన్షన్ డబ్బులు ప్రభుత్వం విడుదల చేస్తే రూ.181,28,63000 పంపిణీ చేశారు.
పార్వతీపురం నుంచి గుణుపూర్ (ఒడిశా) వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిపైకి ఆరు ఏనుగుల గుంపు రావడంతో వాహన చోదకులు భయాందోళన చెందారు. సోమవారం మధ్యాహ్నం ఏనుగుల గుంపు గరుగుబిల్లి మండలం గిజబ గ్రామ సమీపంలో అంతర్రాష్ట్ర రహదారిపైకి వచ్చాయి. వెంటనే అటవీ శాఖ సిబ్బందికి స్థానికులు సమాచారం అందించడంతో రహదారిపై ఉన్న ఏనుగులను సమీప పంట పొలాలకు వైపు సిబ్బంది వచ్చి తరలించారు. దీంతో రహదారిపై రాకపోకలు యథావిధిగా సాగాయి.
విజయనగరం జిల్లాలోని అన్ని మండలాల్లో పాఠశాలలు తెరిచి 18 రోజులు గడిచినా కూడా నేటికీ విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు పంపిణీ కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు బ్యాగ్ లు, షూలు బయట కొనుక్కోవడం జరుగుతుంది. దీని వలన ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కిట్లు పంపిణీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నారు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గోనున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు సాలూరు పట్టణంలోని 21వ వార్డులోని గొల్లవీధి సచివాలయం, 10:30కు కందులపథం, మధ్యాహ్నం 12 గంటలకు మక్కువ మండలం కవిరిపల్లి, 3 గంటలకు పాచిపెంట మండలం మంచాడవలస, సాయంత్రం 4:30కు మెంటాడ మండలం గుర్లతమ్మిరాజుపేట సచివాలయంలో హాజరుకానున్నారు.
Sorry, no posts matched your criteria.