India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి గుమ్మిడి సంధ్యారాణి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం ఏఎన్ఎంల నియామకం ఫైల్పై తొలి సంతకం చేశారు. గిరిజనులకు డోలీ మోతలు తప్పిస్తానని, ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెస్తానన్నారు. మాతాశిశు మరణాలు నియంత్రణ చేస్తానని, కక్ష సాధించనని , త్రికరణ శుద్ధితో ప్రజల కోసం పని చేస్తానన్నారు.
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దర్శనాలు నేడు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే లభిస్తాయని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎస్. శ్రీనివాస్ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. స్వామి వారి సోదరి అడవివరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారి పండగ మంగళవారం జరుగుతుందన్నారు. ఈ కారణంగా దర్శనాలు 6 గంటల తర్వాత లభించవని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పోతన్న వైసీపీకి రాజీనామా చేసినట్లు సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కు దశాబ్దాల కాలంగా సేవలందించిన ఈయన, మాజీ మంత్రి పెనుమత్స కు అత్యంత విధేయుడు గా పేరొందారు. వైఎస్సార్ మరణాంతరం వైసీపీ లో చేరి తన సేవలందించారు. పార్టీ కి వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావుకి తన రాజీనామా లేఖను పంపారు.
సీపీఎస్ రద్దు చేసి ఒపీఎస్ అమలు చేయాలని కోరుతూ.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు, విజయనగరం,MLA అతిథి గజపతికి అప్తా యూనియన్ ప్రతినిధులు వినత పత్రం అందజేశారు. సోమవారం అప్తా రాష్ట్ర అధ్యక్షుడు గణపతిరావు ఆధ్వర్యంలో పలువురు యూనియన్ ప్రతినిధులు వారిని కలిసి అభినందనలు తెలిపారు. జీఓ నంబర్ 117 రద్దు చేసి ప్రాథమిక విద్యను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పోతన్న వైసీపీకి రాజీనామా చేసినట్లు సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కు దశాబ్దాల కాలంగా సేవలందించిన ఈయన, మాజీ మంత్రి పెనుమత్స కు అత్యంత విధేయుడు గా పేరొందారు. వైఎస్సార్ మరణాంతరం వైసీపీ లో చేరి తన సేవలందించారు. పార్టీ కి వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావుకి తన రాజీనామా లేఖను పంపారు.
రాష్ట్ర గిరిజన శాఖ మంత్రిగా నియమితులైన సాలూరు, MLA గుమ్మడి సంధ్యారాణి గిరిజన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం వెలగపూడి సచివాలయం 3వ బ్లాక్ మొదట అంతస్థులో వేద పండితులు పూజలు నిర్వహించగా రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె పదవీ బాధ్యతలు స్వీకారాన్ని స్వయంగా చూడటానికి సాలూరు నియోజకవర్గం నుంచి పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు.
రైలు ప్రమాదంలో కొత్తవలసకి చెందిన గోలజాపు పెంటయ్య(60) రెండు కాళ్లను కోల్పోయారు. బహిర్భూమికి వెళ్లి రైలు పట్టాలు దాటుతుండగా కొత్తవలస రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్-1 చివరలో విజయనగరం నుంచి విశాఖ వెళ్లే రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో క్షతగాత్రుడికి రెండు కాళ్ళు ఛిద్రమయ్యాయి. వెంటనే 108కి ఫోన్ చేసి క్షతగాత్రుడిని విశాఖ కేజీహెచ్కు తరలించినట్లు ఆర్పీఫ్ ఎస్సై ఆర్.హసిధ, ఏఎస్ఐ ఎ.ధర్మారావు తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన గజపతినగరం మండలం బంగారమ్మపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తాడుతూరి అనూష అలియాస్ తనూజ(20) ఆదివారం అర్ధరాత్రి పశువులశాలలో ఉరివేసుకుని మృతి చెందినట్లు కొందరు చెబుతున్నారు. అయితే గ్రామానికి చెందిన వ్యక్తి వేధింపుల కారణంగా తన కుమార్తె మృతి చెందినట్లు తండ్రి ఫిర్యాదు మేరకు బొబ్బిలి DSP శ్రీనివాసరావు, గజపతినగరం CI ప్రభాకర్, SI మహేశ్ విచారిస్తున్నారు.
పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే ఎమ్మెల్యే అయ్యి కేబినేట్లో చోటు దక్కించుకున్న కొండపల్లి శ్రీనివాస్పై జిల్లా ప్రజలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. MSME మంత్రిగా అవకాశం రావడంతో జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సెర్ప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం నిర్మూళన దిశగా, NRI సాధికారత& సంబంధాలతో విదేశాల్లో ఉండే జిల్లా ప్రజానీకానికి అండగా నిలవాలని కోరుతున్నారు.
వాల్తేరు డివిజన్ పరిధిలో పూండి-పలాస సెక్షన్లో భద్రతాపరమైన ఆధునీకరణ పనులు కారణంగా పలు రైళ్ళను రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే. సందీప్ తెలిపారు. ఈనెల 17న, పలాస- విశాఖ(07471) విశాఖ పలాస(07470), విశాఖ-గుణుపూర్ (08522), గుణుపూర్-విశాఖ(08521), విశాఖ-బ్రహ్మపుర (18526) రైళ్లను, 18న బ్రహ్మపుర-విశాఖ(18525) రైలును రద్దు చేశారు. ప్రయాణికుల గమనించాలని ఓ ప్రకటనలో తెలిపారు.
Sorry, no posts matched your criteria.