Vizianagaram

News June 24, 2024

VZM: జిల్లాలో 308 మందికి చలానాలు

image

జిల్లా వ్యాప్తంగా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశాల మేరకు గడిచిన 24 గంటల్లో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. చేపట్టిన దాడుల వివరాలను సోమవారం వెల్లడించారు. MV నిబంధనలు అతిక్రమించిన 308 మందిపై రూ.58,575 ఈ-చలానాలు విధించామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 18 కేసులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన మరో 35 మందిపై జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయన్నారు.

News June 24, 2024

విశాఖ: రైళ్ల రద్దుపై ప్రయాణికులు తీవ్ర విమర్శలు

image

విశాఖ నుంచి బయలుదేరే ఇంటర్ సిటీ రైళ్లనే రద్దు చేయడంపై ప్రయాణికుల నుంచి విమర్శలు వస్తున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లను యథావిధిగా నడుపుతూ వీటినే ఎందుకు రద్దు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా రద్దు చేయకుండా కనీసం రాజమహేంద్రవరం వరకు నడపాలని రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. జన్మభూమి, రత్నాచల్ తదితర రైళ్ల ఛార్జీలకు 4 రెట్లు బస్ ఛార్జీలు ఉంటున్నాయని మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు.

News June 24, 2024

విజయనగరం: పురుగుమందు తాగి వ్యక్తి మృతి

image

మద్యం మత్తులో ఓ వ్యక్తి పురుగుమందు తాగి మృతిచెందిన ఘటన కొమరాడ మండలంలో జరిగింది. అర్తాం గ్రామానికి చెందిన శంకరరావు(39) ఆదివారం మద్యం తాగి.. ఆ మత్తులో పురుగు మందును తాగాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లగా కుటుంబ సభ్యులు గమనించి పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.

News June 24, 2024

నేటి నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ: కలెక్టర్ నిశాంత్ కుమార్

image

సోమవారం నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10:30కు ప్రారంభం అవుతుందన్నారు. తమ పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తామని ఈ అవకాశాన్ని వినియోగించుకోవల్సిందిగా ఆయన కోరారు. ఫిర్యాదులు తెలిపేందుకు ఇది ఒక మంచి అవకాశమని అన్నారు.

News June 23, 2024

VZM: ఎస్సైపై దాడి.. నిందితుడిపై కేసు నమోదు

image

ట్రాఫిక్ ఎస్సైపై దాడి చేసిన ఘటనలో నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ బీ.వెంకటరావు అన్నారు. శనివారం రాత్రి ట్రాఫిక్ ఎస్సై లోవరాజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా మయూరి జంక్షన్ వద్ద విధులు నిర్వహిస్తుండగా గర్భాం గ్రామానికి చెందిన ఏ.నరేశ్ బైక్‌ను ఆపి పరీక్షలు నిర్వహిస్తుండగా అతను దుర్భాషలాడుతూ.. ఎస్సైపై దాడికి పాల్పడ్డాడు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

News June 23, 2024

చేయూత నగదు జమ చెయ్యండి: సీపీఎం

image

మహిళల బ్యాంక్ అకౌంట్‌లలో చేయూత నగదు జమ చెయ్యాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు పీ.శంకరరావు డిమాండ్ చేశారు. ఆదివారం బొబ్బిలిలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేయూత పథకం కింద బటన్ నొక్కినా చాలా మందికి డబ్బులు ఇంకా జమ కాలేదన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం అర్హులకు నిధులు విడుదల చేయాలని కోరారు.

News June 23, 2024

విశాఖ: జూలై 8 నుంచి ఎంఎస్సీ అప్లైడ్ కెమిస్ట్రీ పరీక్షలు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఎంఎస్సీ అప్లైడ్ కెమిస్ట్రీ 4వ సెమిస్టర్ పరీక్షలు జూలై 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జె.రత్నం తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 8న ఇండస్ట్రీస్ బేస్డ్ ఆర్గానిక్ రా మెటీరియల్స్, 9న ఫైన్ కెమికల్స్, 10న పాలిమర్స్ అండ్ ప్లాస్టిక్స్, 11న ఎలెక్టివ్స్, 12న ఇంటలెక్చువల్ ఐ.పీ.ఆర్ పరీక్షలు జరుగుతాయి.

News June 23, 2024

AU: జంబ్లింగ్ విధానంలో పరీక్ష కేంద్రాలు

image

ఏయూ పరిధిలో జులై 9 నుంచి జరగనున్న బీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాలను జంబ్లింగ్ విధానంలో కేటాయించినట్లు డిప్యూటీ రిజిస్ట్రార్ (పరీక్షలు) జె.రత్నం తెలిపారు. ఏయూ పరిధిలో ఉన్న 58 బీఈడీ కళాశాలలకు పరీక్ష కేంద్రాలను మార్పు చేశామన్నారు. ప్రిన్సిపాల్స్ తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులు కేటాయించిన పరీక్షా కేంద్రంలో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు.

News June 23, 2024

నాడు పార్వతీపురం ఆర్డీవో.. నేడు విజయనగరం కలెక్టర్..

image

విజయనగరం జిల్లా నూతన కలెక్టర్‌గా బీఆర్ అంబేడ్క‌ర్‌ను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. 2015 బ్యాచ్‌కు చెందిన ఈయన కాకినాడ ఆర్డీఓగా, కృష్ణ జిల్లా డీఆర్వోగా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల జేసీగా, చేనేత, జౌళి శాఖ డైరెక్టర్‌గా, ఆప్కో ఎండీగా, పార్వతీపురం ఆర్డీఓగా, ఐటీడీఏ పీఓగా కూడా పని చేశారు. ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్‌గా ఉన్నారు.

News June 23, 2024

విజయనగరం జోన్ పరిధిలో లీజ్‌కు ఆర్టీసీ స్థలాలు

image

విజయనగరం ఆర్టీసీ జోన్ పరిధిలో ఉన్న తొమ్మిది ఆర్టీసి ఖాళీ స్థలాలను లీజ్‌పై ఔత్సాహిక వ్యాపారస్తులకు ఇవ్వనున్నామని డిప్యూటీ సిటీఎం బి.అప్పలనాయుడు తెలిపారు. జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయంలో ఖాళీ స్థలాల లీజుకు ఆసక్తి చూపుతున్న శనివారం సమావేశమయ్యారు. ఈ నెల 26 మధ్యాహ్నం 2 గంటల లోపు జోనల్ వర్క్ షాప్ వద్ద దరఖాస్తులు స్వీకరించి, మధ్యాహ్నం 3 గంటలకు టెండర్లు ఓపెన్ చేస్తామన్నారు.