India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యేల జాడ కనిపించడం లేదు. కనీసం పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు సొంతపార్టీ నుంచే వినిపిస్తున్నాయి. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల సైతం ఎవరినీ కలవడానికి ఇష్టపడడం లేదని సమాచారం. పదవిలో ఉన్న ఎమ్మెల్సీ పెనుమత్స కూడా అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి.

ఇకపై ప్రతి సోమవారం మండల, మున్సిపల్, డివిజన్ స్థాయిల్లో ప్రజా వినతుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుందని JC సేతు మాధవన్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. మండల స్థాయిలో నిర్వహించే ప్రజా వినతుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎంపీడీవో, తహసిల్దార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ తదితరులతో కూడిన మండల స్థాయి సమన్వయ కమిటీ నిర్వహించాల్సి ఉంటుందన్నారు.

జిల్లాలో ఉన్న రామతీర్థం దేవస్థానాన్ని తీర్థయాత్ర పర్యాటక స్థలంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ ఇటీవల సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రామతీర్థంలో మ్యూజియం, కేఫ్ టేరియా, వ్యూ పాయింట్లు, రోప్వే నిర్మాణం, లైటింగ్, బౌద్ధ ప్రదేశాల వద్ద వసతులు, కోనేరు రహదారి విస్తరణ వంటి పనులకు అధికారులు త్వరలో ప్రతిపాదనలు తయారు చేయనున్నారు.

జిల్లాలో ఏర్పాటవుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును కూటమి ప్రభుత్వం ప్రతిపాదించింది. విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరును పెడుతున్నట్లు ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా అల్లూరి సేవలను గుర్తు చేసుకున్నారు.

5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ అసెంబ్లీలో తెలిపారు. ఈ లక్ష్యం చేరుకోవాలంటే 164 మంది ఎన్డీఏ ఎమ్మెల్యేలు సహకరించాలని కోరారు. విశాఖ ఐటీ హిల్స్పై రాబోయే 3 నెలల్లో రెండు ఐటీ కంపెనీలతో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. నిక్సీతో పాటు సింగపూర్ నుంచి సీ లైనింగ్ కేబుల్ను విశాఖకు తీసుకొచ్చే బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

విశాఖతో పాటు విజయనగరం విజ్జీ స్టేడియంలో ఈనెల 23 నుంచి సయ్యద్ ముక్తర్ అలీ క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ బాబు పేర్కొన్నారు. అస్సాం, ఒడిశా, పాండిచ్చేరి, చత్తీస్గఢ్, విదర్భ, రైల్వేస్ జట్లు పోటీ పడనున్నాయని అన్నారు. ఐపీఎల్లో ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు ఈ మ్యాచ్లలో పాల్గొంటారని అన్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.

ఉమ్మడి విజయనగరం జిల్లాలో చలి తీవ్రత క్రమేపీ పెరుగుతోంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను చలి వణికిస్తోంది. శృంగవరపుకోట మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో చలి తీవ్రత పెరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరి శిఖర ప్రాంతాల్లో వాతావరణం కూల్గా ఉంటోంది. మైదాన ప్రాంతాల్లో గడిచిన ఐదు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తగ్గాయి. గతేడాది పోలిస్తే ఈ సమయానికి చలి తక్కువేనని ప్రజలు చెబుతున్నారు.

ఉత్తరాంధ్రలోనే అతి ప్రధాన దేవాలయంగా రామతీర్థం విరాజిల్లుతోంది. బోడికొండ, దుర్గా భైరవకొండ, గురు భక్తుల కొండలు ఇక్కడ ఉన్నాయి. పాండవులు, బౌద్ధులు సంచరించే ఆనవాళ్లు ఉన్నట్లు స్థానికులు చెబుతుంటారు. పర్యాటక ప్రాంతాల్లో వసతుల కల్పనలో భాగంగా రామతీర్థం పేరును కలెక్టర్ అంబేద్కర్ ప్రకటించారు. తీర్థయాత్ర పర్యాటక ప్రాంతంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సైబర్ నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మన్యం జిల్లా పార్వతీపురం ఎస్పీ SV మాధవరెడ్డి సూచించారు. పార్వతీపురం పోలీస్ వెల్ఫేర్ ఫంక్షన్ హాలులో జిల్లాలోని బ్యాంకు అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. సైబర్ నేరాలు జరిగిన తరువాత బాధపడే కన్నా నేరం జరగకుండా తగు జాగ్రత్తలు పాటించడం మేలన్నారు. దర్యాప్తు అధికారులు కోరిన సమాచారం అందించి సైబర్ నేరాల నియంత్రణకు అధికారులు కృషి చేయాలని కోరారు.

విజయనగరం జిల్లాలో పని చేసిన సమయంలో భూ అక్రమాలకు వత్తాసు పలికారనే ఆరోపణలు వచ్చిన నాటి జేసీ కిషోర్ కుమార్ను సస్పెండ్ చేయాలని బుధవారం అసెంబ్లీలో సభ్యులు సిఫార్సు చేశారు. ఇప్పటికే అతని మీద జరిగిన విచారణ నివేదిక సాదారణ పరిపాలన శాఖ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం కిషోర్ కుమార్కు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచారు. అసెంబ్లీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
Sorry, no posts matched your criteria.