Vizianagaram

News November 18, 2024

VZM: హైదరాబాద్‌లో రైస్ బ్యాగులు కొనుగోలు..!

image

విజయనగరం PW మార్కెట్లో తక్కువ రకం బియ్యాన్ని బ్రాండెడ్ కవర్లలో నింపి విక్రయిస్తున్న షాపుపై పోలీసులు రైడ్ చేసిన సంగతి తెలిసిందే. జయలక్ష్మి ట్రేడర్స్ షాపు ప్రతినిధి పెంటపాటి ఈశ్వర వెంకట్(రాజా) హైదరాబాద్‌లో పద్మావతి పాలీసాక్స్‌ను నడుపుతున్న శ్రీనివాస్ నుంచి కాలీ బ్రాండెడ్ రైస్ కవర్లు కొని తక్కువ రకం బియ్యాన్ని నింపుతున్నట్లు గుర్తించామని ఎస్ఐ నరేశ్ తెలిపారు. 

News November 17, 2024

విజయనగరంలో విద్యార్థిని సూసైడ్

image

విజయనగరంలోని పడాల్ పేటకు చెందిన విద్యార్ధిని సూసైడ్ చేసుకుంది. రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్ వివరాల ప్రకారం.. వీర వెంకట లక్ష్మి (19) మైగ్రేన్ సమస్యలతో బాధపడుతోందన్నారు. ఈనెల 13న నొప్పి భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగేసిందని తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News November 17, 2024

VZM: జిల్లాలో నిఘానేత్రాన్ని పటిష్ఠం చేస్తున్నాం: SP

image

జిల్లాలోని ముఖ్య కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపులు, కాలేజ్‌లు, వాణిజ్య సముదాయాలు, ప్రధాన రహదారులపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని SP వకుల్ జిందాల్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. అదనంగా మరిన్ని కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా షాపు యజమానులకు, వ్యాపారవేత్తలకు, అపార్టుమెంట్ వాసులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. నేరాల నియంత్రణకు డ్రోన్ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామన్నారు.

News November 17, 2024

హిందూస్థాన్ టైమ్స్ సదస్సులో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి

image

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హిందూస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును ఎంపీ కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సదస్సులో చంద్రబాబు ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుందని, యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని, కింజరాపు పాల్గొన్నారు.

News November 16, 2024

VZM: విద్యాశాఖకు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

ఈ నెల 20 లోపు 1 నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్ధులందరికీ అపార్ ఐడీలు జనరేట్ చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్లో యాక్షన్ టేకాన్ రిపోర్ట్‌పై విద్యా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆధార్ సమస్యను పరిష్కరించుకొని వెంటనే అపార్ ఐ.డిలను జారీ చేయాలని సూచించారు. బడి బయట ఉన్న 6 సంవత్సరాల పైబడిన బాలల వివరాలను, బడి బయట ఉండడానికి గల కారణాలను తెలపాలన్నారు.

News November 16, 2024

పరిశ్రమల పర్యవేక్షణకు జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు: కలెక్టర్

image

జిల్లాలో MSME, ఇతర పరిశ్రమల పర్యవేక్షణకు జిల్లా స్థాయి కమిటీని నియమించినట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. శనివారం కలెక్టర్ ఛాంబర్లో పరిశ్రమల శాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 9 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీకి డిప్యూటీ కలెక్టర్ జోసెఫ్‌ను ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహానికి అవసరమైన భూ సమస్యలను రెవెన్యూ అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు.

News November 16, 2024

దత్తిరాజేరు: ‘ప్రభుత్వ స్కూల్లో చదివి కలెక్టర్ అయి వచ్చాడు’

image

దత్తిరాజేరు జెడ్పీ హైస్కూల్లో చదివిన పూర్వ విద్యార్థి ఎం.కూర్మారావు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కలెక్టర్‌గా పదవి బాధ్యతలు చేపట్టారు. కూర్మారావు సొంత ఊరు అయిన పొరలికి వచ్చి, దత్తిరాజేరు స్కూల్‌ను శనివారం పరిశీలించారు. జిల్లా అధికారి మాణిక్యం నాయుడు, మండల ఎంఈఓ వెంకట్రావు, స్కూల్ హెచ్ఎం స్వర్ణ కలెక్టర్‌కు ఘనంగా స్వాగతించి అభినందనలు తెలిపారు.

News November 16, 2024

ఎస్.కోట: మహిళపై ఉపాధ్యాయుడి అత్యాచారయత్నం

image

మహిళపై స్కూల్ HM అత్యాచారయత్నం చేసినట్లు ఎస్.కోట పోలీసలు కేసు నమోదు చేసుకున్నారు. సీఐ వీ.ఎన్ మూర్తి వివరాల ప్రకారం.. గంట్యాడ మండలంలోని ఓ మహిళ తన కుమారుడి స్టడీ సర్టిఫికెట్లు సరిదిద్దాలని ఆ గ్రామ ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎమ్‌ను కోరారు. సరి చేయడం కోసం బొడ్డవర వెళ్లాలని చెప్పి ఆమెను బైక్ ఎక్కించుకున్నాడు. సమీప తోటల్లోకి తీసుకువెళ్లి అత్యాచారయత్నం చేయబోగా ఆమె గట్టిగా కేకలు వేయడంతో వదిలేశాడు.

News November 16, 2024

విజయనగరం మాజీ ఎంపీకి కీలక బాధ్యతలు

image

ఇటీవల కాలంలో పలువురు వైసీసీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాళ్లకు అండగా నిలిచేందుకు విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జోగారావుకి బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని కార్యకర్తలకు వీళ్లు అండగా ఉంటారని చెప్పారు. లీగల్ సెల్‌తో అండగా ఉంటూ కేడర్‌కు భరోసా ఇవ్వాలని జగన్ సూచించారు.

News November 16, 2024

VZM: ‘జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి’

image

వచ్చే నెల 14న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి మీనా దేవి కోరారు. శుక్రవారం తన ఛాంబర్‌లో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన కేసులన్నీ లోక్ అదాలతో పరిష్కరించు కోవాలన్నారు. దీనికి లోక్ అదాలత్‌ను వేదికగా చేసుకుని కక్షిదారులకు డబ్బు, సమయం వృథా కాకుండా చూడాలన్నారు.