Vizianagaram

News June 13, 2024

కేబినేట్‌లో పిన్న వయస్కుడిగా శ్రీనివాస్

image

యువ నేతలతోపాటు సీనియర్లతో ఏపీ మంత్రి మండలి కొలువుదీరిన సంగతి తెలిసిందే. CMచంద్రబాబు తప్పితే మిగిలిన 23 మంది మంత్రుల్లో వయసు పరంగా చూస్తే.. గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్(40) అతి పిన్న వయస్కుడిగా ఉన్నారు. అందరికంటే పెద్ద వయస్కుడిగా ఎన్ఎండీ ఫరూక్(74) ఉన్నారు. మన జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న కొండపల్లికి ఏ శాఖ ఇచ్చే అవకాశం ఉందో కామెంట్ చేయండి.

News June 13, 2024

ఉత్తరాంధ్రకు చంద్రబాబు ప్రాధాన్యత: విజయనగరం ఎంపీ

image

ఉత్తరాంధ్రకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారని ఎంపీ అప్పలనాయుడు అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రకు ఒక కేంద్రమంత్రి పదవి ఇచ్చారని పేర్కొన్నారు. విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా ప్రకటించారని తెలిపారు. స్కూల్ బ్యాగ్స్‌పై జగన్ ఫొటో ఉన్నా కూడా పంపిణీకి చంద్రబాబు ఆదేశించడం గొప్ప విషయమని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, సామాజిక న్యాయం పాటించి మంత్రి పదవులు ఇచ్చారన్నారు.

News June 13, 2024

భోగాపురంపై రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు

image

పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. భోగాపురం విమానాశ్రయానికి అశోక్ గజపతిరాజు హయాంలో పునాది పడిందని.. గత 5 ఏళ్లలో అక్కడ అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. వచ్చే డిసెంబర్ నాటికి రికార్డు సమయంలో విమానాశ్రయాన్ని పూర్తి చేసి విమానాలను ల్యాండ్ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

News June 13, 2024

సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

image

రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకి మంత్రి గుమ్మడి సంధ్యారాణి పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నివాసంలో మంత్రి సంధ్యారాణి మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. శాఖలు కేటాయించిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని సీఎం చంద్రబాబు మంత్రిని సూచించారు.

News June 13, 2024

మాకు ఉద్యోగ భద్రత కల్పించండి: రామచంద్రరావు 

image

ప్రభుత్వ మద్యం దుకాణం సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ.. బెవరేజెస్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రామచంద్రరావు విజయవాడలో గురువారం మంత్రి జనార్దన్‌రెడ్డి,, శ్రీనివాసరావుని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రులు స్పందిస్తూ.. వైన్ షాప్‌లు ఏ విధంగా పనిచేస్తున్నాయి, జీతభత్యలు ఎవరు చెల్లిస్తున్నారంటూ వాకబు చేశారు. అనంతరం ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్తామని హామీ ఇచ్చారు. 

News June 13, 2024

VZM: నిబంధనలు పాటించని 104 మందికి చలానాలు

image

జిల్లా వ్యాప్తంగా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశాల మేరకు గడిచిన 24 గంటల్లో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. చేపట్టిన దాడుల వివరాలను గురువారం వెల్లడించారు. MV నిబంధనలు అతిక్రమించిన 104 మందిపై రూ.25,055 ఈ చలానాలు విధించామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన ఆరుగురిపై, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన మరో 18 మందిపై జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి.

News June 13, 2024

మంత్రి స్థానం నిలబెట్టుకున్న ‘సాలూరు’ నియోజకవర్గం

image

సాలూరు నియోజకవర్గం నుంచి మొదటి సారి ఎమ్మెలేగా గెలిచిన గుమ్మడి సంధ్యారాణి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆమె సమీప ప్రత్యర్థి మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక. రాజన్నదొరపై 13,733 ఒట్ల మోజారిటీతో గెలుపొందారు. లోకేశ్ యువగళం కార్యక్రమంలో సాలూరులో ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఆమె గెలుపుతో ‘సాలూరు’ నియోజకవర్గం మంత్రి స్థానం నిలబెట్టుకుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

News June 13, 2024

27 ఏళ్ల తరువాత ‘గజపతినగరానికి’ మంత్రి పదవి

image

గజపతినగరం నియోజకవర్గం నుంచి మొదటి సారి ఎమ్మెలేగా గెలిచిన కొండపల్లి శ్రీనివాస్ మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆయన కంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో 1997 పడాల అరుణ ఇక్కడి నుంచి రాష్ట్ర మహిళా శిశుక్షేమ మంత్రిగా పనిచేశారు. కాగా 27 ఏళ్ల తరువాత ‘గజపతినగరానికి’ మంత్రి పదవి లభించింది. అతి చిన్న వయసులో మంత్రి పదవి దక్కించుకున్న వ్యక్తిగా శ్రీనివాస్‌ రికార్డ్ కొట్టారు.

News June 13, 2024

VZM: నేటి నుంచి మోగనున్న బడిగంట

image

జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి బడి గంట మోగనుంది. వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. 50 రోజుల పాటు పుస్తకాలు మూలన పడేసిన విద్యార్థులు స్కూల్‌ బ్యాగ్‌ నిండా పుస్తకాలు, చేతిలో క్యారేజీ , సైకిల్‌ మీద, ఆటోల్లో, బస్సుల్లో బడికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. విద్యార్థులకు ఘన స్వాగతం పలికేందుకు అన్ని పాఠశాలలు సిద్ధమయ్యాయి.

News June 12, 2024

I LOVE కైలాసగిరి

image

పర్యాటకులను మరింత విశేషంగా ఆకట్టుకునేలా ఆధునిక హంగులతో కైలాసగిరిపై I LOVE కైలాసగిరి పేరుతో నూతనంగా వ్యూ పాయింట్‌ నిర్మించారు. పెద్దపెద్ద అక్షరాలతో ఏర్పాటు చేసిన బోర్డులను విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున బుధవారం ప్రారంభించారు. రాత్రి వేళల్లో వెలుగులు వచ్చేలా విద్యుత్ దీపాలను కూడా అమర్చారు. ఇప్పటికే నగరంలో పలు చోట్ల ఉన్న ఐ లవ్ వైజాగ్ బోర్డులు మాదిరిగానే నూతనంగా దీనిని నిర్మించారు.