Vizianagaram

News June 9, 2024

విజయనగరం: మంత్రి పదవి వరించేది ఎవరినో..?

image

విజయనగరంలో క్లీన్ స్వీప్ చేసిన కూటమి అభ్యర్థుల్లో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. సీనియర్ విభాగంలో కోళ్ల, కిమిడి పదవి ఆశిస్తుండగా.. క్షత్రియ సామాజికవర్గానికి చెందిన బేబినాయన, అదితి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. అటు జనసేన ఏకైక మహిళా MLA లోకం మాధవితో పాటు ఎస్టీ కేటగిరీలో గుమ్మడి పేరు జోరుగా వినిపిస్తోంది. మరి వీరిలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి.

News June 9, 2024

నాడు ఈనాడు జర్నలిస్టు.. నేడు విజయనగరం ఎంపీ

image

1995 నుంచి 2000 వరకు ఈనాడులో జర్నలిస్టుగా పనిచేసిన కలిశెట్టి అప్పలనాయుడు.. నేడు విజయగనం ఎంపీ అయ్యారు. ఈనాడు సంస్థ ఉద్యోగిగా ఉన్న తాను ఎంపీగా ఎదగడానికి రామోజీరావే స్ఫూర్తి అని ఆయన తెలిపారు. జీవిత పాఠాలు నేర్పిన ఆయన ఇక లేరన్న విషయం కలిచివేసిందన్నారు. జీవితాంతం రామోజీరావుకు రుణపడి ఉంటానన్న కలిశెట్టి.. రామోజీరావును తలుచుకున్న ప్రతిసారీ కన్నీరు వస్తుందన్నారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

News June 9, 2024

విజయనగరంలో కూటమికి జైకొట్టిన ఉద్యోగులు

image

విజయనగరం MP స్థానంలో 22,301 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా 13,329(59.74%) ఓట్లు NDAకి పడ్డాయి. YCPకి 6,071(27.21%) ఓట్లు లభించగా.. ఇండియా కూటమికి 353(1.58%) మంది మాత్రమే ఓటు వేశారు. అరకు MP స్థానంలో 21,432 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా కూటమికి 9,312(43.44%) ఓట్లు పడ్డాయి. YCPకి 5,535(25.83%) ఓట్లు లభించగా.. ఇండియా కూటమికి 4,113(19.19%) మంది ఓటు వేశారు. రాష్ట్రంలో ఇండియా కూటమికి ఇదే అత్యధికం.

News June 9, 2024

విజయనగరం: ‘రైలు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’

image

రైలు ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చీఫ్ డీటీఐ సీహెచ్వీ. రమణ పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ లెవెల్ క్రాసింగ్ అవేర్నెస్ డే పురస్కరించుకుని స్థానిక వీటీ. అగ్రహారం సమీపంలో ఉన్న రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద శనివారం ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే క్రాసింగ్ ఉన్నప్పుడు ప్రయాణీకులు గేట్ల కింద దూరి వెళ్లరాదన్నారు.

News June 8, 2024

పార్వతీపురం: రైలు కిందపడి యువకుడు మృతి

image

రైలు కింద పడి యువకుడు మృతి చెందిన ఘటన పార్వతీపురం మండలం దాలినాయుడు వలస రైల్వే గేట్ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం పట్టణం బూరాడ వీధికి చెందిన తెంటు భరత్ (31) రైల్వే గేట్ దాటుతుండగా గూడ్స్ ఢీకొనడంతో మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

News June 8, 2024

అల్లూరిలో అభ్యర్థి ఎవరైనా వైసీపీదే విజయం

image

అరకు, పాడేరు నియోజకవర్గాలు YCPకి కంచుకోటగా మారాయి. రెండింటిలోనూ YCP ఒక్కసారి కూడా ఓడిపోలేదు. 2014 నుంచి YCP పోటీలో నిలవగా.. 3సార్లు వేర్వేరు అభ్యర్థులే పోటీచేసి గెలిచారు. అరకులో 2014లో కిడారి సర్వేశ్వరరావు, 2019లో చెట్టి ఫాల్గుణ, 2024లో రేగం మత్స్యలింగం గెలిచారు. ఇటు పాడేరులో 2014 గిడ్డి ఈశ్వరి, 2019లో భాగ్యలక్ష్మి, 2024లో విశ్వేశ్వర రాజు గెలిచారు. అరకు MP స్థానంలో కూడా ఇదే ఫార్ములా నడిచింది.

News June 8, 2024

విజయనగరం : ప్రశాంతంగా ముగిసిన ప్రవేశ పరిక్ష

image

బిఈడి ప్రవేశాలకు సంబందించిన ఎడ్ సెట్-2024 ప్రవేశ పరిక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 90% మంది విద్యార్థులు హాజరయ్యారని అబ్జర్వర్ డాక్టర్ శ్రీనివాస మోహన్ తెలిపారు. ఈ పరీక్షకు MVGR కళాశాలలో 120 మందికి 103 మంది విద్యార్థులు, సీతం ఇంజినీరింగ్ కళాశాలలో 150 మందికి 131 మంది విద్యార్థులు, ఐయాన్ డిజిటల్ పరీక్ష కేంద్రంలో 500 మందికి 454 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలియజేసారు.

News June 8, 2024

ఏనుగులు ఎటాక్.. చాకచక్యంగా వ్యవహరించిన రైతు 

image

కురుపాం నియోజకవర్గంలో ఏనుగుల బెడద రోజురోజుకు పెరుగుపోతుంది. జియ్యమ్మవలస మండలం గౌరీపురం వద్ద ఎడ్లబండితో వెళ్తున్న రైతుపై ఏనుగుల గుంపు దాడి చేసింది. పెదకుదమ గ్రామానికి చెందిన బోను తిరుపతిరావు శుక్రవారం ఇసుక కోసం నాటుబండిపై వెళ్తుండగా ఏనుగులు ఎటాక్ చేశాయి. చాకచక్యంగా వ్యహరించిన రైతు ఎడ్లు తాలు విప్పి వాటిని తోలేసి.. తానూ ప్రాణాలను కాపాడుకున్నాడు. కాగా.. ఏనుగులు నాటుబండిని ధ్వంసం చేశాయి.

News June 8, 2024

విజయనగరం: పోక్సో కేసులో యువకుడి అరెస్టు

image

గజపతినగరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారానికి పాల్పడి తల్లిని చేసిన యువకుడిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. ఆమె కళాశాలకు వెళ్లి వచ్చినప్పుడు అతను లోబర్చుకున్నట్లు తెలుస్తోందని, గర్భవతి అయినట్లు తెలియకుండా కాన్పు జరగడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారన్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్ట్ చేశామన్నారు.

News June 8, 2024

మన్యం: ప్రతిష్ఠాత్మకంగా ప్రిజం -10 ప్రాజెక్ట్ అమలు

image

జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రిజం -10 ప్రాజెక్ట్‌ను పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి కమిటి జిల్లాకు శుక్రవారం వచ్చింది. క్షేత్ర స్థాయిలో అమలు చేస్తున్న పరిస్థితిని కమిటీ పరిశీలిస్తోంది. కమిటీ సభ్యులుగా డీఓపీటీ డైరెక్టర్ మొలాయ్ శాన్యాల్, బొగ్గు మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ ( సీపీడీ) సుదర్శన్ భగత్ జిల్లాకు చేరుకున్నారు. శనివారం గ్రామాల్లో పర్యటించనున్నారు.

error: Content is protected !!