Vizianagaram

News June 12, 2024

VZM: జిల్లాలో బాలుడి దారుణ హత్య

image

జిల్లాలోని నెల్లిమర్ల మండల కేంద్రమైన కొండపేటలో ఓ బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకి వెళ్లిన బాలుడు సమీప కొండ ప్రాంతంలో మంగళవారం విగతజీవిగా పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒంటి నిండా గాయాలు ఉండడంతో పోలీసులు హత్యగా నిర్ధారించారు. ఆన్‌లైన్ గేమ్స్ హత్యకు కారణంగా ఎస్.ఐ గణేశ్ తెలిపారు. స్నేహితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News June 12, 2024

VZM: నిబంధనలు పాటించని 77 మందికి ఈ-చలానాలు

image

జిల్లా వ్యాప్తంగా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశాల మేరకు గడిచిన 24 గంటల్లో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. చేపట్టిన దాడుల వివరాలను బుధవారం తెలిపారు. MV నిబంధనలు అతిక్రమించిన 77 మందిపై రూ. 25,055 ఈ చలానాలు విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురిపై, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన మరో 17 మందిపై జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి.

News June 12, 2024

VZM: పద్మ అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

గణతంత్ర దినోత్సవం సందర్బంగా కేంద్ర హోంశాఖ అందజేసే పద్మ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యువజన సర్వీసుల శాఖ సీఈవో జి.రామగోపాల్ తెలిపారు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులు ఇవ్వనున్నారనున్నారని చెప్పారు. కళలు, సాహిత్యం- విద్యారంగం, క్రీడలు, వైద్యం, సమాజ సేవ తదితర రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారు సెట్విజ్ కార్యాలయంలో వివరాలు అందజేయాలన్నారు.

News June 12, 2024

VZM: సీనియర్లకు దక్కని మంత్రి పదవి

image

ఉమ్మడి విజయనగరం జిల్లాకు <<13424145>>రెండు మంత్రి పదవులు<<>> దక్కిన విషయం తెలిసిందే. అయితే ఆశావాహులుగా ఉన్న సీనియర్‌ నాయకులు కళా వెంకట్రావు, కోళ్ల లలితకుమారితో పాటు, రాజకీయ వారసులు బేబినాయన, అధితి గజపతిరాజుకు నిరాశే ఎదురైంది. ఇటు కూటమి నుంచి జనసేన అభ్యర్థిగా గెలిచిన లోకం మాధవిది కూడా ఇదే పరిస్థితి.

News June 12, 2024

ఉమ్మడి విజయనగరంలో మంత్రి పదవులు వీరివే..

image

ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి ఇద్దరికి మంత్రివర్గంలోకి అవకాశం దక్కింది. గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్‌, సాలూరు ఎమ్మెల్యే సంధ్యారాణిని మంత్రి పదవులు వరించాయి. వీరిద్దరూ తొలిసారి ఎమ్మెల్యేలు కావడం విశేషం. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ జాబితా విడుదల చేయగా.. జనసేనకు 3, బీజేపీకి ఒకటి కేటాయించారు. ముగ్గురు మహిళలకు అవకాశం ఇవ్వగా.. ఇందులో సంధ్యారాణి కూడా ఉన్నారు.

News June 12, 2024

VZM: నేడు ఆలస్యంగా విశాఖపట్నం-బెనారస్ రైలు

image

రైలు నెంబరు 18311 విశాఖపట్నం నుంచి బెనారస్ వెళ్ళే రైలు నేడు తెల్లవారుజామున 04.20 విశాఖపట్నంలో బయలుదేరే బదులు ఉదయం 07.05 గంటలకు బయలుదేరుతుందని రైల్వే వర్గాలు తెలిపారు. కొత్తవలసకు ఉదయం 07.35 గంటలకు వస్తుందని తెలిపారు. ఆలస్యానికి చింతిస్తున్నామని రైల్వే అధికారులు కోరారు. ప్రయాణీకులు గమనించాలని ఓ ప్రకటనలో తెలిపారు.

News June 11, 2024

VZM: ఏపీ ఈఏపీసెట్‌లో నిశ్వాంత్‌కు 14వ ర్యాంక్

image

ఏపీలో పలు కళాశాలల్లో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మెంటాడ మండలంలోని జక్కువ గ్రామానికి చెందిన పొట్టా నిశ్వాంత్ 93.5676 స్కోర్ సాధించి జిల్లాస్థాయిలో 14 వ ర్యాంక్ సాధించాడు. ఉత్తమ ర్యాంక్‌ను సాధించిన విద్యార్థికి తల్లిదండ్రులు, గ్రామస్థులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.

News June 11, 2024

VZM: కిమిడి కళావెంకట్రావుకు లైన్ క్లియర్?

image

ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య ఆఖరి నిమిషంలో చీపురుపల్లి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన కిమిడి కళావెంకట్రావుకు ఏపీ కొత్త కేబినెట్లో చోటు దక్కినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కళా వెంకట్రావు.. చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న కీలకనేతలకు స్వయంగా ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా కేబినెట్లో చోటుపై అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది.

News June 11, 2024

VZM: విద్యుత్ కాంతులతో ప్రభుత్వ కార్యాలయాలు

image

ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం బుధవారం కొలువుదీరనున్న నేపథ్యంలో విజయనగరం పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవం పండగ వాతావరణంలో నిర్వహించాలనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కలెక్టరేట్‌తో పాటు ఆనందగజపతి ఆడిటోరియంలో ప్రత్యక్ష ప్రసారాల వీక్షణకు ఏర్పాట్లు చేశారు.

News June 11, 2024

విజయనగరం: మా ఉద్యోగాలకు భద్రత కల్పించాలి: వైన్స్‌షాపు ఉద్యోగులు

image

విజయనగరం జిల్లాలో 3,600 మద్యం షాపులు, 40 వేల కుటుంబాలు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. దత్తిరాజేరు మండలం మానాపురం, మరడాం, రాజుల రామచంద్రపురం, మేడపల్లి, చల్లపేట వైన్‌షాపుల్లో చేస్తున్న సిబ్బంది రోడ్డెక్కారు. కొత్త ప్రభుత్వంలో కొత్త మద్యం పాలసీ తీసుకొస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వారు ఆందోళన చెందారు. ఈ సమస్యని సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని మీడియాని కోరారు.