Vizianagaram

News June 7, 2024

పెదమానాపురం: గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

దత్తిరాజేరు మండలంలోని పెదమానాపురం రైల్వే గేట్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం గూడ్స్ రైలు ఢీకొనగా గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు విజయనగరం రైల్వే ఎస్సై రవివర్మ తెలియజేశారు. రైలు పట్టులు దాటుతుండగా మృతి చెందినట్లు చెప్పారు. గూడ్స్ రైలు లోకో పైలట్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 7, 2024

VZM: అప్పుడు 7 వేలు ఓట్లు.. ఇప్పుడు 1,09,915

image

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన లోకం నాగ మాధవి కేవలం 7వేల ఓట్లకే పరిమితమయ్యారు. 2024లో టిక్కెట్ దక్కించుకున్న ఆమె.. తన చరిష్మాతో నియోజకవర్గమంతా తిరిగి ప్రజాభిమానాన్ని సంపాదించారు. ముఖ్యంగా పరిశ్రమలు పెట్టి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చి యువతను తన వైపు ఆకర్షించారు. ఫలితంగా 1,09,915 ఓట్లు సాధించి భారీ విజయాన్ని అందుకున్నారు.

News June 7, 2024

పార్వతీపురం: పోస్టల్ ద్వారా గ్రీటింగ్స్ చెప్పే అవకాశం

image

సార్వత్రిక ఎన్నికల్లో విజేతలుగా గెలిచిన నాయకులకు ఈ పోస్ట్ సర్వీస్ ద్వారా అభినందనలు తెలిపే వెసులుబాటును పోస్టల్ శాఖ కల్పించిందని సూపరింటెండెంట్ రెడ్డి బాబురావు రావు అన్నారు. కేవలం రూ.10 చెల్లించి సమీప తపాలా కార్యాలయంలో ఈ పోస్టు ద్వారా తమ ప్రియతమ నేతకు శుభాకాంక్షలు తెలియజేయవచ్చు అన్నారు. ఇలా పంపించిన సందేశాలు నేరుగా నేతలకు వెళ్తాయని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

News June 7, 2024

నాకు కూడా బాధగా ఉంది బ్రదర్: కిమిడి నాగార్జున

image

విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ‘X’ లో చేసిన ఓ ట్వీట్‌కు అతని అభిమాని ‘అన్నా నీకు టిక్కెట్‌ రానందుకు ప్రతి కార్యకర్త బాధపడ్డాడు. భవిష్యత్తులో మీకు మంచి పదవి రావాలని కోరుకుంటున్నాను. బాబు గారు సరైన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను అన్న’ అంటూ కామెంట్ చేశాడు. దీనికి నాగార్జున ‘164లో భాగం కాలేకపోయాను అన్న బాధ నాకు కూడా ఉంది బ్రదర్’ అంటూ రిప్లే ఇచ్చారు.

News June 7, 2024

చెవిటి పిల్లలకు విజయనగరంలో ప్రత్యేక పాఠశాల

image

విజయనగరం పేర్ల వారి వీధిలో గల చెవిటి పిల్లల పాఠశాలలో 1 నుండి 10వ తరగతి వరకు ప్రవేశం కొరకు దరఖాస్తులు కోరుతున్నట్లు సెక్రటరీ కె.ఆర్.డి ప్రసాదరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27వ తేది నుండి ఉ 9 గం.లనుండి 11వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉచిత విద్య, బాలబాలికలకు వేరు వేరు హాస్టల్లో ఉచిత వసతి కల్పించబడునని, డిజిటల్ క్లాస్ ద్వారా పాఠాలు బోధించబడునన్నారు. వివరాలకు సంప్రదించాలన్నారు.

News June 7, 2024

VZM: వైసీపీ కార్యకర్తలకు అండగా పదిమందితో కమిటీ

image

YCP కార్యకర్తలపై దాడులు జరిగితే వారికి అండగా ఉండేందుకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కమిటీలను పార్టీ అధిష్టానం కమిటీ ఏర్పాటు చేసింది. విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గానికి 10 మందితో కమిటీని నియమించింది. కమిటీలో బొత్స సత్యన్నారాయణ, సూర్యనారాయణ రాజు, బెల్లాన చంద్రశేఖర్, మజ్జి శ్రీనివాస్, తలే రాజేష్, శంబంగి అప్పలనాయుడు, అప్పలనరసయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, వీరభద్రస్వామి, కడుబండి శ్రీనివాస్ ఉన్నారు.

News June 7, 2024

ఒడిశాలో బీజేపీ.. కొఠియా, జంఝావతి సమస్య కొలిక్కి వచ్చేనా..!

image

కేంద్రంలో TDP కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్న తరుణంలో కొఠియా, జంఘావతి సమస్యలు తెరపైకి వచ్చాయి. దీనికి తోడు ఒడిశాలో BJP ప్రభుత్వం కొలువుతీరనున్న నేపథ్యంలో జిల్లా ప్రజాప్రతినిధులు ఈ సమస్యలపై ఒత్తిడి తేవాలని కోరుతున్నారు. ఒడిశాలో పలు గ్రామాలతో పాటు కొంత భూభాగం ముంపునకు గురవ్వడంతో రబ్బరు డ్యాం నిర్మించాల్సి వచ్చింది. కొఠియా ప్రజల అభీష్టం మేరకు వారితో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

News June 7, 2024

విజయనగరం: మూడు కేంద్రాల్లో ఎడ్ సెట్

image

ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎడ్‌సెట్-24 పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని పరిశీలకులు ఎన్.శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరంలోని సీతం ఇంజినీరింగ్ కళాశాల, అయాన్ డిజిటల్ జోన్, ఎంవీజీఆర్ కళాశాల కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామని, ఉ 9 గంటల నుంచి 11 వరకు జరుగుతుందని, 850 మంది పరీక్ష రాస్తున్నట్లు వెల్లడించారు. హాల్ టికెట్లలో నిర్దేశించిన విధంగా అభ్యర్థులు నిబంధనలు పాటించాలన్నారు.

News June 7, 2024

విజయనగరం మహిళా మంత్రి ఎవరు?

image

విజయనగరం చరిత్రలో ఐదుగురు మహిళా ప్రజాప్రతినిధులు అసెంబ్లీలోకి అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. కురుపాంలో జగదీశ్వరి, సాలూరులో సంధ్యారాణి, విజయనగరంలో అదితి గజపతి, నెల్లిమర్ల నుంచి జనసేన తరఫున గెలిచిన లోకం మాధవి మొదటిసారి అసెంబ్లీకి వెళుతన్నారు. అటు ఎస్.కోటలో మూడోసారి నెగ్గిన కోళ్ల లలితకూమారి అసెంబ్లీలో తన గళాన్ని వినిపించనున్నారు. మరి వీరిలో ఎవరికి మంత్రి పదవి వరిస్తుందో చూడాలి.

News June 7, 2024

విజయనగరంలో 30 ఏళ్ల క్రితం టీడీపీ క్లీన్ స్వీప్

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో సరిగ్గా 30 ఏళ్ల క్రితం టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. 1994లో జరిగిన ఎన్నికల్లో నాగూరు, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, తెర్లాం, గజపతినగరం, విజయనగరం, చీపురుపల్లి, సతివాడ, భోగాపురం, ఉత్తరావల్లి, ఎస్.కోటలో టీడీపీ అభ్యర్థులు గెలిపొందారు. నాగూరు, సతివాడ నియోజకర్గాలు కురుపాం, సతివాడగా మారగా.. తెర్లాం, భోగాపురం, ఉత్తరావల్లి నియోజకర్గాలు పునర్విభజనలో రద్దయ్యాయి.

error: Content is protected !!