Vizianagaram

News June 5, 2024

నెల్లిమర్ల నుంచి మొదటి మహిళా ఎమ్మెల్యే

image

నెల్లిమర్ల నియోజకవర్గం 2007-08 పునర్‌వ్యవస్థీకరణలో ఏర్పడింది. 2009,19లలో బడ్డుకొండ అప్పలనాయుడు, 2014లో పతివాడ నారాయణస్వామి గెలిచారు. దీంతో నెల్లిమర్ల నుంచి మూడు సార్లు పురుషులే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. అయితే 2024లో జనసేన అభ్యర్థి మాధవి 39వేల పైచిలుకు మెజార్టీతో గెలిచి నెల్లిమర్ల మొదటి మహిళా ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు.

News June 5, 2024

VZM: జిల్లాలో అతిది గజతిరాజుదే ఫస్ట్ ప్లేస్

image

ఉమ్మడి జిల్లాలో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అత్యధిక మెజార్టీ సాధించారు. మొత్తం 1,17,808 ఓట్లు పడగా.. 60,795 ఓట్ల మెజార్టీ వచ్చింది. జిల్లాలో గెలిచిన మిగతా అభ్యర్థులతో పోల్చితే ఇదే అత్యధికం. అదితి తరువాత 44,918 మెజార్టీతో బొబ్బిలి నుంచి బేబినాయన సెకెండ్ ప్లేస్‌లో నిలిచారు. చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావు 11,639 ఓట్ల మెజార్టీతో చివరి స్థానంలో నిలిచారు.

News June 5, 2024

విజయనగరం: నాలుగు ఎన్నికలు.. నాలుగు పార్టీలు

image

నెల్లిమర్ల నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన సాధారణ ఎన్నికల్లో నాలుగు వేర్వేరు పార్టీలకు చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో నెల్లిమర్ల నియోజకవర్గం ఏర్పడింది. 2009లో కాంగ్రెస్, 2014లో టీడీపీ, 2019లో వైసీపీ, 2024లో జనసేన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.

News June 5, 2024

విజయనగరం: అన్న చేతిలో తమ్ముడి దారుణ హత్య

image

అన్న చేతిలో తమ్ముడు దారుణ హత్యకు గురైన ఘటన సీతానగరం మండలంలో తీవ్ర కలకలం రేపింది. రూరల్ సీఐ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పెదభోగిలికి చెందిన గుజ్జల రవీంద్ర, హేమంత్ అన్నదమ్ములు. మంగళవారం సాయంత్రం వారి మధ్య గొడవ రావడంతో హేమంత్‌ని అన్న రవీంద్ర కత్తెరతో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్ఐ తెలిపారు.

News June 5, 2024

కురుపాంలో 30 ఏళ్ల తర్వాత ఎగిరిన టీడీపీ జెండా

image

తోయక జగదీశ్వరీ విజయంతో కురుపాం కోటపై 30 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగిరింది. టీడీపీ నేతల కృషితో పాటు పుష్పశ్రీవాణి ఉన్న వ్యతిరేకతను తమ అనుకూలంగా మలచుకోవడంలో కూటమి నేతలు సక్సెస్ అయ్యారు. గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండకు చెందిన జగదీశ్వరీ ఎల్విన్ పేట MPTCగా ఉన్నారు. ఆర్థిక బలం లేకపోయినా చంద్రబాబు మన్ననలు, కూటమి సపోర్ట్, చివర్లో మాజీ ఎంపీ ప్రదీప్ దేవ్ కొడుకు వీరేశ్ చంద్రదేవ్ అండతో గెలుపొందారు.

News June 5, 2024

సాలూరు తొలి మహిళా ఎమ్మెల్యేగా సంధ్యారాణి

image

సాలూరు నియోజకవర్గం తొలి మహిళా ఎమ్మెల్యేగా గుమ్మిడి సంధ్యారాణి రికార్డు సాధించారు. పీడిక రాజన్నదొరపై 13,733 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. సాలూరులో 1952 నుంచి పురుషులే ఎమ్మెల్యేగా పనిచేశారు. తొలిసారిగా మహిళ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే సాలూరు నుంచి ఎమ్మెల్సీగా పని చేసిన తొలి వ్యక్తి సంధ్యారాణి కావడం గమనార్హం. ఎమ్మెల్సీగా పని చేసిన అనంతరం ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

News June 5, 2024

పార్వతీపురంలో 30 ఏళ్లుగా ఒకే సెంటిమెంట్

image

పార్వతీపురంలో 30 ఏళ్లుగా ఒకసారి గెలిచిన వారు మరోసారి ఎమ్మెల్యేగా గెలవలేకపోతున్నారు. 1994 నుంచి 2019 ఎన్నికల వరకు ఇదే కొనసాగింది. 2009లో ఈ స్థానం ఎస్టీలకు కేటాయించగా.. విజయరామరాజు పాతపట్నంకి మారడంతో సవరపు జయమణి గెలిచారు. 2014లో జయమణి ఎన్నికలకు దూరంగా ఉండగా.. చిరంజీవులు గెలిచారు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గెలుపుపై ధీమాగా ఉన్నప్పటికీ బోనెల విజయ్ చంద్ర 20వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.

News June 5, 2024

VZM: మొదటిసారి అధ్యక్షా అనబోతున్నారు!

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిది సీట్లను ఎన్డీఏ కూటమి సొంతం చేసుకుంది. వీటిలో 8 సీట్లను టీడీపీ గెలవగా పొత్తులో భాగంగా నెల్లిమర్ల నుంచి జనసేన గెలుపొందింది. అయితే తొమ్మిది మందిలో కోళ్ల లలిత కుమారి, కిమిడి కళా వెంకట్రావు మినహా మిగిలిన ఏడుగురు మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. వీరిలో బేబినాయన, తోయక జగదీశ్వరి, కొండపల్లి శ్రీనివాస్, విజయచంద్ర తొలిసారి బరిలో నిలిచి విజయం సాధించారు.

News June 5, 2024

ఉమ్మడి విజయనగరం జిల్లాలో గెలుపు గుర్రాలు వీరే..

image

⁍సాలూరు: గుమ్మడి సంధ్యారాణి (TDP)
⁍బొబ్బిలి: బేబినాయన (TDP)
⁍పార్వతీపురం: బోనెల విజయచంద్ర (TDP)
⁍కురుపాం: తోయక జగదీశ్వరి (TDP)
⁍చీపురుపల్లి: కళా వెంకట్రావు (TDP)
⁍గజపతినగరం: కొండపల్లి శ్రీనివాస్ (TDP)
⁍ఎస్.కోట: కోళ్ల లలిత కుమారి (TDP)
⁍విజయనగరం: అదితి గజపతిరాజు (TDP)
⁍నెల్లిమర్ల: లోకం మాధవి (JSP)

News June 4, 2024

VZM: ధ్రువపత్రం అందుకున్న కలిశెట్టి అప్పలనాయుడు

image

2024 విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుకు జిల్లా ఎన్నికల అధికారి నాగమణి గెలుపు ధ్రువపత్రం అందించారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌పై 2,29,216 ఓట్లు మెజార్టీతో విజయనగరం ఎంపీగా గెలిచారు. కలిశెట్టికి మొత్తం 7,18,294 ఓట్లు పడ్డాయి.

error: Content is protected !!