India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
⁍సాలూరు: గుమ్మడి సంధ్యారాణి (TDP)
⁍బొబ్బిలి: బేబినాయన (TDP)
⁍పార్వతీపురం: బోనెల విజయచంద్ర (TDP)
⁍కురుపాం: తోయక జగదీశ్వరి (TDP)
⁍చీపురుపల్లి: కళా వెంకట్రావు (TDP)
⁍గజపతినగరం: కొండపల్లి శ్రీనివాస్ (TDP)
⁍ఎస్.కోట: కోళ్ల లలిత కుమారి (TDP)
⁍విజయనగరం: అదితి గజపతిరాజు (TDP)
⁍నెల్లిమర్ల: లోకం మాధవి (JSP)
ఉమ్మడి విజయనగరం జిల్లా డీసీఎంఎస్ ఛైర్స్ పర్సన్ పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు డాక్టర్ అవనాపు భావన ప్రకటించారు. అదేవిధంగా వైసీపీ యూత్ వింగ్ ఇంఛార్జ్ విక్రమ్ పార్టీ పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అధితి విజయలక్ష్మి గజపతిరాజు ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి కోలగట్ల వీరభద్ర స్వామ పై 57,729 ఓట్ల మెజార్టీ సాధించారు. అతిధి విజయలక్ష్మికి అన్ని రౌండ్లు కలిపి 1,16,393 పోల్ అయ్యాయి. వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్ర స్వామికి అన్ని రౌండ్లు కలిపి 58,664 ఓట్లు పోలయ్యాయి. కాగా ఈ విజయంతో ఉమ్మడి జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది.
బొబ్బిలికి సంబంధించి 19 రౌండ్లలో లెక్కింపు పూర్తి కాగా TDP అభ్యర్థి బేబి నాయన ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచే తన ఆధిపత్యం చూపించిన బేబినాయన చివరి రౌండ్ వరకు అదే జోరును కొనసాగించారు. తన ప్రత్యర్థి శంబంగి చిన అప్పలనాయుడిపై 43,845 ఓట్ల తేడాతో గెలుపొందారు. YCP అభ్యర్థి అప్పలనాయుడికి 56,114 ఓట్లు పడగా.. బేబినాయనకి 99,959 ఓట్లు పడ్డాయి. దీంతో బొబ్బిలి కోటలో టీడీపీ శ్రేణులు సంబరాలు మొదలుపెట్టారు.
చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి 19 రౌండ్లు ఉండగా 15 రౌండ్ల లెక్క ముగిసింది. ఇప్పటి వరకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కళా వెంకట్రావుకు 70,000 ఓట్లు రాగా.. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణకి 60,084 ఓట్లు పడ్డాయి. దీంతో బొత్స 9,916 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.
9వ రౌండ్ పూర్తయ్యేసరికి చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ మరింత వెనుకబడ్డారు. ఇక్కడ టీడీపీ నుంచి కళా వెంకట్రావుకి 39,328 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణకి 35,051 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన 4,277 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.
ఉమ్మడి విజయనగరంలో మొదటి మూడు రౌండ్లు ముగిసేసరికి అన్నీ స్థానాల్లోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. మొదటి రౌండ్లో ఆధిక్యంలో ఉన్న బొత్స రెండో రౌండ్ నుంచి వెనుకంజ వేశారు. అటు పార్వతీపురం జిల్లాలో సాలూరు నుంచి రెండు రౌండ్లు లీడ్లో ఉన్న రాజన్న దొర మూడో రౌండ్కి వెనుకబడ్డారు. దీంతో జిల్లాలోని 9 సీట్లలో 8 టీడీపీ, 1 జనసేన ఆధిపత్యం కనబరుస్తున్నాయి.
మూడో రౌండ్ పూర్తయ్యేసరికి చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కళా వెంకట్రావు ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ పోటీలో ఉన్నారు. 3వ రౌండ్లో వెంకట్రావుకి 12,637 ఓట్లు పోలవ్వగా.. బొత్స సత్యనారాయణకి 11,717 ఓట్లు పడ్డాయి. దీంతో బొత్స 920 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు. 1వ రౌండ్లో కలిశెట్టి అప్పలనాయుడుకి 6,687 ఓట్లు పోలవ్వగా.. చంద్రశేఖర్కి 3,772 ఓట్లు పడ్డాయి. అప్పలనాయుడు 2,915 ఓట్ల మెజార్టీతో ఉన్నారు.
గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర ఉద్యానవన కళాశాలలో రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలు కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత కల్పించినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం కౌంటింగ్ కేంద్రం వద్ద విధులకు హాజరవుతున్న పోలీసులకు సమావేశం నిర్వహించి విధివిధానాలు తెలియజేశారు. కౌంటింగ్ హాజరైన వారికి ఐడీ కార్డు లేనిదే లోనికి అనుమతించరాదన్నారు. 400 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.