India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు నెల్లిమర్ల పట్టణానికి చెందిన నౌపడ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తన రాజీనామా పత్రాన్ని ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసరెడ్డికి పంపించినట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో డైరెక్టర్గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినట్లు శ్రీనివాసరావు తెలిపారు.
వెంకంపేట పంచాయితీ YKMనగర్ కాలనీలో అద్దెకు ఉంటున్న పల్లా సింహాచలం (39) అనే యువకుడు ఇంట్లో భార్య బిడ్డలు లేని సమయంలో గురువారం ఉదయం ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతికి కారణం ఆర్థికంగా ఇబ్బందులు అని బంధువులు చెబుతున్నారు. ఫర్నిచర్ షాపులో పనిచేస్తున్న అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు వెళ్లిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చంద్రబాబు నివాసం వద్ద ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్ బ్యానర్లకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాన్య కార్యకర్తను ఎంపీగా చేసిన ఘనత లోకేశ్కే దక్కుతుందని అన్నారు. ఈ స్థాయికి తీసుకువచ్చిన చంద్రబాబు, లోకేశ్ను కలిసి అభినందనలు తెలిపేందుకు వచ్చానని ఆయన తెలిపారు.
సాలూరు ఎమ్మెల్యేగా 13,733 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థిని గుమ్మడి సంధ్యారాణి.. వైసీపీ అభ్యర్థి రాజన్నదొరపై గెలుపొందారు. నియోజకర్గంలో మండలాల వారీగా ఇద్దరు అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ వివరాలు ఇలా ఉన్నాయి.
☛ సాలూరు రూరల్లో YCPకి 3,155
☛ సాలూరు టౌన్లో TDPకి 12,579
☛ పాచిపెంటలో YCPకి 104
☛ మెంటాడలో TDPకి 4,258
☛ మక్కువలో YCPకి 520
☛☛ పోస్టల్ బ్యాలెట్లో TDPకి 675 ఓట్ల మెజార్టీ వచ్చింది.
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందినట్లు ఎస్. బూర్జివలస ఎస్. ఐ లక్ష్మీ ప్రసన్నకుమార్ గురువారం తెలిపారు. పి.లింగాలవలస గ్రామానికి చెందిన పరిగి సుబ్బారావు (45) స్వగ్రామం వస్తుండగా జగన్నాథపురం సమీపంలో ఆటో ఢీకొట్టి మృతి చెందాడు. అనకాపల్లి జిల్లా వెంకన్నపాలెం గ్రామానికి చెందిన గొంతినె శ్రీనివాసరావు బైక్పై వస్తుండగా మరడాం జంక్షన్ వద్ద బొలెరో వాహనం ఢీకొనడంతో మృతి చెందారు.
ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం ప్రజల తీర్పు చర్చనీయాంశమయ్యింది. గత ఎన్నికల్లో 9 స్థానాల్లోనూ YCP అభ్యర్థులను గెలిపించిన ప్రజలు.. ఈసారి రివర్స్ తీర్పు ఇచ్చారు. కూటమి అభ్యర్థులకు పట్టం కట్టారు. గెలిచిన అభ్యర్థులు తమ నియోజకవర్గానికి కావాల్సిన నిధులపై అసెంబ్లీలో చర్చిస్తారు. కాకపోతే జిల్లాలో అభివృద్ధి, సమస్యలపై ప్రస్తావించేందుకు ప్రతిపక్షపాత్ర పోషించే నేత అప్పుడూ.. ఇప్పుడూ లేకపోవడం గమనార్హం.
ఉత్తరావల్లి నియోజకవర్గ కేంద్రంగా ఉన్నప్పుడు 1983లో కోళ్ల లలిత కుమారి తాత అప్పలనాయుడు టీడీపీ తరఫున 30,329 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పటి వరకు అదే అత్యధిక మెజార్టీ. S.కోట నియోజకవర్గ కేంద్రం ఏర్పాటయ్యాక 2009లో TDP తరఫున పోటీ చేసిన కోళ్ల 3,440 ఓట్ల ఆధిక్యత సాధించగా.. 2104లో 28,572 మెజార్టీతో గెలిచింది. ఈ ఎన్నికల్లో 38,790 ఓట్ల మెజార్టీతో గెలిచి.. తన తాత పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.
కురుపాంలో పుష్పశ్రీవాణికి సొంత మండలంలోనే చుక్కెదురయ్యింది. G.M వలసలో గతంలో ఆమెకు 173 మెజార్టీ రాగా.. ఈసారి TDPకి 6,720 ఓట్ల భారీ మెజార్టీ వచ్చింది. G.L పురంలో గతంలో 11,150 భారీ మెజార్టీ రాగా.. ఈసారి TDPకి 2,300 ఓట్లు అధికంగా పోలయ్యాయి. కురుపాం 9,459 మెజార్టీ రాగా.. ఈసారి TDPకి 2,800, కొమరాడలో YCPకి 3,668 మెజార్టీ రాగా.. ఇప్పుడు TDPకి 6,008, గరుగుబిల్లిలో ఈసారి TDPకి 3,926 మెజార్టీ వచ్చింది.
చీపురుపల్లి నియోజకవర్గంలోని మెరకముడిదాం మండలంలో గతంలో బొత్సకు 9 వేల ఆధిక్యత రాగా.. ఈసారి కళాకు 607 మెజార్టీ వచ్చింది. గతంలో బొత్సకు ఆరు వేల మెజార్టీ వచ్చిన గరివిడి మండలంలో ఈసారి కళా వెంకట్రావు 4,225 ఓట్ల ఆధిక్యత సాధించారు. చీపురుపల్లి గతంలో బొత్సకు 4వేల ఆధిక్యత రాగా.. ఈసారి టీడీపీకి 4,315 మెజార్టీ వచ్చింది. గుర్లలో గతంలో బొత్సకు 5,900 ఆధిక్యత సాధించగా.. ఈసారి టీడీపీకి 2,492 ఓట్ల మెజార్టీ వచ్చింది.
అందరి సహకారంతో జిల్లాలో ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ప్రశాంతంగా, స్వేచ్చగా, సజావుగా ఎన్నికలను పూర్తి చేయడానికి సహకారం అందించిన అధికారులు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు, పాత్రికేయులతో పాటు పౌరులందరికీ బుధవారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.