India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం ఎంపీగా వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ గెలవనున్నట్లు సీప్యాక్ సర్వే ఎగ్జిట్ పోల్ విడుదల చేసింది. అలాగే అరకు ఎంపీ అభ్యర్థిగా చెట్టి తనూజ విజయం సాధిస్తారని పేర్కొంది. ఉమ్మడి జిల్లాలోని 2 ఎంపీ స్థానాలనూ వైసీపీ కైవశం చేసుకుంటుందన్న ఈ సర్వేపై మీ COMMENT.
బొబ్బిలిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. శనివారం బొబ్బిలి ఎస్సై చదలవలస సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో గల రాముడువలస గ్రామ శివారులో తోటపల్లి కెనాల్ గట్టు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభించింది. అతని వయస్సు సుమారు 45 నుంచి 50 సంత్సరాలు ఉంటుందని తెలిపారు. స్థానిక వీఆర్వో అలజంగి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామన్నారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో టఫ్ ఫైట్ ఉండనున్నట్లు చాణక్య X సర్వే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మొత్తం 9 స్థానాల్లో కూటమి 4 సీట్లు, వైసీపీకి ఒక సీటు వస్తుందని చెప్పింది. వైసీపీకి ఒకటి, టీడీపీకి ఒకటి ఎడ్జ్ ఉండగా, ఒక సీటులో టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పింది. ఈ సర్వేపై మీ COMMENT.
ప్రధాన పార్టీలు జిల్లాలో తమకే మెజారిటీ సీట్లు వస్తాయంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదులయ్యాయి. చాలా సర్వేలలో జిల్లాలో టఫ్ ఫైట్ ఉంటుందని తెలిపాయి. 9 స్థానాల్లో 4 లేదా 5 స్థానాలను వైసీపీ, కూటమి పంచుకునే అవకాశం ఉందని అంచనా వేశాయి. విజయనగరం ఎంపీ సీటు కూడా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందట. దీంతో ఉత్కంఠ నెలకొంది.
విజయనగరంలో 09 సీట్లకు గాను NDA కూటమి 4-5 గెలుస్తుందని బిగ్టీవీ సర్వే తెలిపింది. 4-5 సీట్లు వైసీపీ సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తంమీద 175 అసెంబ్లీ సీట్లకు గాను 106- 119 కూటమి, 56- 69 సీట్లు వైసీపీ విజయం సాధిస్తుందని వెల్లడించింది.
పోస్ట్ పోల్ సర్వే ప్రకారం విజయనగరంలో వైసీపీకి 4-5, ఎన్డీఏ కూటమికి 4-5 వస్తాయని అంచనా వేసింది. అటు అరకు ఎంపీ స్థానంలో వైసీపీ (తనూజ) , విజయనగరం టీడీపీ( కలిశెట్టి అప్పలనాయుడు) గెలుస్తారని చాణక్య ఎక్స్ అంచనా వేసింది.
ఉమ్మడి విజయనగరంలో టీడీపీ -4, వైసీపీ-3, టఫ్ ఫైట్ రెండు చోట్ల ఉంటుందని చాణక్య స్ట్రాటజీ సర్వే తెలిపింది. వైసీపీ-0, టీడీపీ-8, జనసేన-1 గెలుస్తాయని కేకే సర్వే తెలిపింది. ఆరా మస్తాన్ సర్వే ప్రకారం చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ, సాలూరు నుంచి రాజన్నదొర గెలుస్తారని అంచనా వేసింది.
జూన్ 4న ఫలితాలు వెలువడనుండగా, శనివారం సాయంత్రం కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి. వీటిలో ఆరా మస్తాన్ సర్వే ఉమ్మడి విజయనగరం జిల్లాలో చీపరుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ, సాలూరు నుంచి రాజన్న దొర ఘన విజయం సాధించబొతున్నట్లు తెలిపింది.
విజయనగరం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. జిల్లాలో అత్యధికంగా పూసపాటిరేగ మండలంలో 68.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా, విజయనగరంలో 56.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. శృంగవరపుకోట మండలంలో అత్యల్పంగా 0.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలు ఆగమనంతో విరివిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఉమ్మడి విజయనగరం జిల్లా 1 జూన్ 1979 న అవతరించింది. తొలత విశాఖ జిల్లా నుంచి విజయనగరం, గజపతినగరం, S.KOTA , భోగాపురం తాలూకాలతో…శ్రీకాకుళంలోని బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, కురుపాం, చీపురుపల్లితో కలిసి 9 జిల్లాలు ఏర్పడ్డాయి. 1979లో విజయనగరం, S. KOTA, బొబ్బిలి విభజనతో నెల్లిమర్ల , వియ్యంపేట, బాడంగి మూడు తాలూకాలను జోడించారు.1985 లో తాలూకాలు, ఫిర్కాస్ స్థానంలో 34 రెవెన్యూ మండలాలను భర్తీ చేశారు.
Sorry, no posts matched your criteria.