Vizianagaram

News June 1, 2024

నేడు విజయనగరం జిల్లా అవతరణ దినోత్సవం

image

ఉమ్మడి విజయనగరం జిల్లా 1 జూన్ 1979 న అవతరించింది. తొలత విశాఖ జిల్లా నుంచి విజయనగరం, గజపతినగరం, S.KOTA , భోగాపురం తాలూకాలతో…శ్రీకాకుళంలోని బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, కురుపాం, చీపురుపల్లితో కలిసి 9 జిల్లాలు ఏర్పడ్డాయి. 1979లో విజయనగరం, S. KOTA, బొబ్బిలి విభజనతో నెల్లిమర్ల , వియ్యంపేట, బాడంగి మూడు తాలూకాలను జోడించారు.1985 లో తాలూకాలు, ఫిర్కాస్ స్థానంలో 34 రెవెన్యూ మండలాలను భర్తీ చేశారు.

News June 1, 2024

గుమ్మలక్ష్మీపురం: లారీని ఢీకొన్న కారు

image

భద్రగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టరుగా పనిచేస్తున్న దుర్గాప్రసాద్ శనివారం ఉదయం గుమ్మలక్ష్మీపురం నుంచి పార్వతీపురం కారులో వెళ్తుండగా కోనగూడ మలుపు వద్ద కారు ప్రమాదవశాత్తూ లారీని ఢీకొంది. గమనించిన స్థానికులు ఆయన్ను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో అతడు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

News June 1, 2024

గరివిడి: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

గరివిడి మండలం ఎం.దుగ్గివలస గ్రామానికి చెందిన దాసరి సత్యం (38) మనస్సు సరిగ్గా లేకపోవడంతో ఆతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.గురువారంఉదయం బయటకు వెళ్ళాడు. రమణఅనే వ్యక్తి తన కుమారుడు చీపురుపల్లి వద్ద పడిపోయినట్టు సమాచారం అందజేశారు. వెంటనే కుటుంబసభ్యులు ఆపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని విజయనగరం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అదే రోజు రాత్రి మరణించినట్లు తల్లి తెలియజేసారని ఎస్సై కె.కె నాయుడు తెలిపారు

News June 1, 2024

గజపతినగరం: సామంతుల పైడిరాజు పాము కాటుతో మృతి

image

గజపతినగరం మండలం లోగిశ గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు సామంతులు పైడిరాజు శనివారం ఉదయం పాముకాటు కారణంగా మృతి చెందినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. గురువారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తూ స్పృహ తప్పి పడిపోయిన పైడిరాజుకు శుక్రవారం రాత్రి వరకు విజయనగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించినప్పటికీ మృతి చెందినట్లు తెలిపారు.

News June 1, 2024

నేడే ఎగ్జిట్ పోల్స్.. విజయనగరం జిల్లాలో గెలుపెవరిది.?

image

ఎన్నికల ఫలితాల కోసం విజయనగరం జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో COMMENT చేయండి.

News June 1, 2024

విజయనగరం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

నగరంలోని రామానాయుడు రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. లంకాపట్నానికి చెందిన పొడుగు కిశోర్, పొడుగు హేమంత్ ఇద్దరూ కలిసి కోట వద్ద ఉన్న తన అమ్మమ్మకు క్యారేజి ఇచ్చేందుకు వెళ్లారు. ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కనున్న డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు.

News June 1, 2024

విజయనగరం: పెట్రోల్ బంకులకు నోటీసులు జారి

image

జిల్లాలో వున్న పెట్రోల్ బంకులలో ప్లాస్టిక్ బాటిల్స్, క్యాన్‌లకు పెట్రోల్, డీజిల్ ఇవ్వకూడదని జిల్లా పోలీసు యంత్రాంగం ఆదేశించింది. జిల్లాలో ఉన్న ప్రతి బంక్‌లో నోటీసులు జారీ చేశామని విజయనగరం ఒకటవ పట్టణ సీఐ బీ.వెంకటరావు తెలిపారు. అపార్ట్‌మెంట్‌లలో జనరేటర్లకు తప్పని సరిగా అనుమతి పొందాలన్నారు. బంకు యజమానులు ఈ నిబంధనలను పాటించాలని కోరారు. లేనియెడల చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News May 31, 2024

VZM: సీతం వద్ద ప్రమాదానికి గురైన అంబులెన్స్

image

జిల్లాలోని సీతం కళాశాల సమీపంలో ఓ అంబులెన్సు శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అంబులెన్స్‌లో పేషెంట్‌ను తీసుకువస్తున్న సమయంలో సీతం కళాశాల వద్ద లారీను తప్పించబోయి ఈ ప్రమాదం సంభవించింది. ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా.. అంబులెన్స్‌లో ఉన్న మరో ఇద్దరు స్వల్పంగా గాయపడినట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News May 31, 2024

నెల్లిమర్ల కూటమిలో బకెట్ సింబల్ కలవరం

image

నెల్లిమర్లలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలు వైసీపీ-జనసేన మధ్య హోరాహోరీగా జరిగాయి. వైసీపీ తరఫున సిట్టింగ్ MLA బడ్డుకొండ పోటీలో నిలవగా.. కూటమి అభ్యర్థిగా నాగ మాధవి బరిలో నిలిచారు. గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నప్పటికీ, కూటమి శ్రేణుల్లో మాత్రం బకెట్ గుర్తు కలవర పెడుతోందని సమాచారం. ఈవీఎంలో తొమ్మిదో నంబర్ బకెట్ గుర్తు కాగా.. పదో నంబర్ గ్లాస్ గుర్తు రావడమే ఈ కలవరానికి కారణంగా తెలుస్తోంది.

News May 31, 2024

విజయనగరం: మూడు రోజులు మద్యం షాపులు బంద్  

image

ఓట్ల లెక్కింపు రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జూన్ 3, 4, 5 తేదీలలో మద్యం షాప్‌లు మూసివేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. లెండి, జే‌ఎన్‌టీ‌యూ కళాశాలలో ఓట్ల లెక్కింపు సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం ఈవీఎంల ఓట్లు లెక్కిస్తామన్నారు.