Vizianagaram

News May 23, 2024

విజయనగరం :11 ఏళ్ల బాలికపై అఘాయిత్యం

image

గంట్యాడ మండలంలోని ఒక గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలిక ఆడుకుంటున్న సమయంలో 54 సంవత్సరాలు వయస్సు గల అడ్డూరి చందర్రావు మంగళవారం అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో రక్తం మడుగులో ఉన్న బాలికను విజయనగరం హాస్పిటల్‌కి చికిత్స నిమిత్తం తరలించారు. బాలిక అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయనగరం దిశ పోలీస్ స్టేషన్ ఎస్సై నారాయణరావు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకొని రిమాండ్‌కి తరలించారు.

News May 23, 2024

VZM: పీజీ ప్రవేశాల గడువు పొడిగింపు

image

విజయనగరం గిరిజన యూనివర్సిటీలో వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు తుది గడువును ఈ నెల 26వ తేది వరకు పొడిగిస్తున్నట్లు వైస్ ఛాన్స్‌లర్ ప్రొ.తేజస్వి కట్టిమని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశ పరీక్ష రాసిన వారు 26వ తేదీ రాత్రి 11.55 వరకు https://www.ctuap.ac.in లో గాని https://ctuapcuet.samarth.edu.in/pg లో గాని దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News May 23, 2024

ఆర్థిక ఇబ్బందుల్లో సాలూరు లారీ పరిశ్రమ

image

రాష్ట్రంలో విజయవాడ తరువాత జిల్లాలో సాలూరు లారీ పరిశ్రమకు పెట్టింది పేరు. ఇక్కడ సుమారు 2300 వరకు లారీలు ఉన్నాయి. ఈ మోటారు పరిశ్రమపై 18 వేల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగాను ఆధారపడి జీవిస్తున్నాయి. ఇంతమందికి జీవనాధారమైన ఈ పరిశ్రమ పెరిగిన ఆయిల్, విడిభాగాలు ధరలకు అనుగుణంగా కిరాయిలు పెరగకపోవడంతో బాటు లోడింగ్ లేక అధిక మొత్తం లారీలు యార్డ్‌లోనే ఉంటున్నాయి. దీనివలన చాలా కుటుంబాల వారు రోడ్డున పడ్డారు.

News May 22, 2024

పామాయిల్ తోటల్లో గజరాజుల గుంపు

image

గరుగుబిల్లి మండలం సుంకి గ్రామ సమీపంలో ఉన్న పామాయిల్ తోటల్లో గజరాజుల గుంపు సంచరిస్తోంది. దీంతో సమీప ప్రాంత ప్రజలంతా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల గుంపు ఏ క్షణాన ఎవరిపై దాడికి వస్తుందోనన్న భయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో పంటలు వేసేందుకు రైతులు పంట పొలాలను దుక్కులు వేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇదిలా ఉంటే తక్షణమే ఏనుగులను ఈ ప్రాంతాల నుంచి తరలించాలని కోరుతున్నారు.

News May 22, 2024

VZM: పది సప్లమెంటరీ పరీక్షలు రాయనున్న 4,210 మంది విద్యార్థులు

image

ఈ నెల 24 నుంచి జూన్ 3 వ‌ర‌కు ప‌దోత‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు ప్రారంభకానున్నాయి. ప‌రీక్ష ఉద‌యం 9.30కి మొదలై మ‌ధ్యాహ్నం 12.45కి ముగుస్తుంది. జిల్లాలో మొత్తం 4,210 మంది విద్యార్థులు ప‌రీక్ష‌లు రాయ‌నున్నారు. వీరిలో 2,482 మంది బాలురు, 1728 మంది బాలికలు ఉన్నారు. వీరికోసం జిల్లా వ్యాప్తంగా 19 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

News May 22, 2024

VZM: 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఈ నెల 24 నుంచి 31 వ‌ర‌కు ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు ప్రారంభంకానున్నాయి. మొద‌టి సంవ‌త్స‌రం విద్యార్థులు 14,904 మంది, ద్వితీయ సంవ‌త్స‌రం విద్యార్ధులు 7,927 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కానున్నారు. మొత్తం 42 ప‌రీక్షా కేంద్రాల్లో, మొద‌టి సంవ‌త్స‌ర ప‌రీక్ష ఉద‌యం 9 నుంచి 12 గంట‌లు వ‌ర‌కు, రెండో సంవ‌త్స‌ర ప‌రీక్ష మ‌ధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వ‌ర‌కు జ‌రుగుతుందని అధికారులు తెలిపారు.

News May 22, 2024

విజయనగరం: టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై కలెక్టర్ సమీక్ష

image

ఈ నెల 24వ తేదీ నుంచి జరగనున్న టెన్త్‌ అడ్వాన్స్డ్ స‌ప్లిమెంట‌రీ, ఇంట‌ర్ సప్లిమెంటరీ ప‌రీక్షల‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా కలెక్టర్ నాగ‌ల‌క్ష్మి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా.. పదోతరగతి, ఇంట‌ర్, సప్లిమెంటరీ, డైట్ సెట్ పరీక్షల నిర్వహణపై త‌న ఛాంబర్‌లో అధికారులతో బుధవారం స‌మీక్షించారు. ఆయా శాఖల అధికారుల ద్వారా సమాచారం అడిగి తెలుసుకున్నారు.

News May 22, 2024

రక్తహీనతపై శ్రద్ధ వహించాలి: మన్యం కలెక్టర్

image

రక్తహీనతపై శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ గర్భిణీలలో రక్తహీనత, ప్రసవ మరణాలు, తల్లిబిడ్డల నమోదు, కంటి వెలుగు, 108 వాహనాలు వంటి తదితర అంశాలపై సమీక్షించారు.

News May 22, 2024

పెద మానాపురం: బావిలో పడి వ్యక్తి మృతి

image

ప్రమాదవశాత్తు బావిలో పడి ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందినట్లు పెదమానాపురం ఎస్సై శిరీష బుధవారం విలేకరులకు తెలిపారు. విశాఖకు చెందిన కునిచెర్లపటి శివాజీ కుమార్ (60)తో పాటు మరో నలుగురు చినకాద శివారు రాజుల పేటలో జరిగే పండగకు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం వాష్ రూమ్‌కి వెళ్లిన కుమార్ ఎంతకీ రాకపోయేసరికి పరిసర ప్రాంతాలు వెతకగా నేలబావిలో మృతదేహం లభించిందని చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.

News May 22, 2024

చీపురుపల్లి: ప్రేమ విఫలం.. యువకుడు ఆత్మహత్య

image

చీపురుపల్లి మండలంలోని కర్లాం గ్రామంలోని జీడి మామిడి తోటలో మరువాడ లక్ష్మణరావు (25) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు గుర్తించారు. పోలీసులు కథనం ప్రకారం.. మృతుడు అదే గ్రామంలోని ఓ యువతితో ప్రేమలో పడినట్లు, వీరి ప్రేమకు అబ్బాయి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కె కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు.

error: Content is protected !!