Vizianagaram

News June 29, 2024

విజయనగరం: ఆన్‌లైన్‌లో గురుకుల పరీక్ష ర్యాంక్ కార్డులు

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మిగులు సీట్ల భర్తీకి నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ర్యాంకు కార్డులు ఆన్లైన్లో పొందుపరిచినట్లు ఆ పాఠశాలల జిల్లా కన్వీనర్ రమామోహిని తెలిపారు. 1:2 నిష్పత్తిలో విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలుస్తామన్నారు. ఫోన్ ద్వారా సమాచారం అందుకున్న విద్యార్థులు జూలై 2, 3 తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు.

News June 28, 2024

VZM: కరెంట్ షాక్‌తో యువకుడు మృతి

image

నెల్లిమర్ల మండలంలోని సారిపల్లికి చెందిన బోనుమహంతి విజయ్‌కుమార్(28) అనే యువకుడు కరెంట్ షాక్‌తో శుక్రవారం మృతి చెందాడు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో వైరింగ్ పని చేయడానికి వెళ్లిన విజయ్‌కుమార్‌కు ఇంటి పైనుంచి వెళ్తున్న హై టెన్షన్ వైరు తగలడంతో అక్కడికక్కడే పడిపోయాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. విజయ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News June 28, 2024

VZM: ‘భూ సేకరణకు త్వరలో నోటిఫికేషన్’

image

విజయనగరం జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూ సేకరణకు అధికారులు సిద్ధమవుతున్నారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ప్రధానంగా జాతీయ రహదారుల నిర్మాణంపై చర్చ జరిగింది. పెదమానాపురం వద్ద గ్రామ కంఠానికి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉందని ఆర్డీవో సూర్యకళ కలెక్టర్ అంబేడ్క‌ర్‌కు వివరించగా… వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయన ఆదేశించారు.

News June 28, 2024

ఆంధ్ర యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామా

image

ఆంధ్ర యూనివర్సిటీ వైస్‌‌ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్‌లు రాజీనామా చేశారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవుల్లో ఉండేవారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే AU వీసీ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేయగా.. ఆయన రాజీనామా చేశారు. ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌‌‌గా కిషోర్ బాబు బాధ్యతలు స్వీకరించారు.

News June 28, 2024

38,744 ఎకరాల ఆయకట్టుకు తోటపల్లి సాగునీరు

image

తోటపల్లి జలాశయం కుడి ప్రధాన కాలువ ద్వారా ప్రాజెక్టు క్రింద మొత్తం 38,744 ఎకరాల ఆయకట్టుకు నీరు విడుదల చేశారు. కుడి ప్రధాన కాలువ క్రింద పార్వతీపురం మన్యం జిల్లాలో సీతానగరం, బలిజిపేట మండలాలలో 27 గ్రామాలకు చెందిన 13,684 ఎకరాలకు, విజయనగరం జిల్లాలో బొబ్బిలి, చీపురుపల్లి, నెల్లిమర్ల, రాజాం నియోజకవర్గాలలోని 13 మండలాలలో 66 గ్రామాలకు చెందిన 25,060 ఎకరాలకు సాగునీరు విడుదల చేశారు.

News June 28, 2024

విజయనగరం జిల్లా తైక్వాండో జట్టు ఎంపిక

image

ఈ నెల 30 నుంచి విశాఖపట్నంలో నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి క్వాడిట్ తైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే విజయనగరం జిల్లా జట్టు ఎంపిక నిర్వహించారు. గురువారం విజ్జీ స్టేడియంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో అండర్- 12, అండర్- 13, అండర్- 14 విభాగాల్లో బాల బాలికలను ఎంపిక చేశారు. జిల్లాలోని 8 మండలాల నుంచి 50 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు.

News June 28, 2024

VZM: పెన్షన్ పంపిణీకి ఏర్పాట్లు

image

పెన్షన్ దారులు ఇంటివద్దనే రూ.7వేలు నగదు తీసుకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. సచివాలయాల సిబ్బంది పెన్షన్ పంపిణీ చేయనున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 974 సచివాలయాలు ఉండగా.. వాటిలో 8,766 మంది విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో సుమారు 4,27,286 మంది లబ్ధిదారులు ఉన్నారు. అందుబాటులో లేనివారికి బ్యాంక్ ఖాతాలలో జమచేయనున్నారు. దివ్యాంగులు రూ.15వేలు అందుకోనున్నారు. అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

News June 28, 2024

VZM: జగన్ అక్కా చెల్లెమ్మలను మోసం చేశారు.. సీఐటీయూ

image

అక్క చెల్లెమ్మలను ఆదుకుంటామని మాజీ సీఎం జగన్ చేయూత లబ్ధి దారులను మోసం చేశారని ఆందోళన చేపట్టారు. విజయనగరం డీఆర్డీఏ కార్యాలయం వద్ద చేయూత లబ్ధిదారులు ఐద్వా, సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఐద్వా పట్టణ కార్యదర్శి వి. లక్ష్మి, సీఐటీయూ నగర అధ్యక్షుడు జగన్మోహన్ మాట్లాడారు. చేయూత 4వ విడతకి ఒక్కొక్కరికి రూ.18,750 ఇవ్వాలని బటన్ నిక్కిన జమకాలేదని ఆందోళన చేపట్టామన్నారు.

News June 28, 2024

నేడు తోటపల్లి ప్రాజెక్టు నీరు విడుదల

image

గరుగుబిల్లి మండలంలో ఉన్న తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు నుంచి సాగునీటిని గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నేడు విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లను చేపడుతున్నారు. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు మంత్రి సంధ్యారాణి సాగునీటిని విడుదల చేయనున్నారు. సుమారు 85 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యేలతో పాటు ఇతర అధికారులు పాల్గొనున్నారు.

News June 28, 2024

మద్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి: ఆర్జీడీ

image

మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని విశాఖపట్నం రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ బి.విజయభాస్కర్ సూచించారు. విజయనగరం డీఈఓ ఆఫీసులో విద్యాశాఖ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రతి విద్యార్థి పాఠశాలలోనే భోజనం చేసేటట్లు ప్రోత్సహించాలన్నారు. భోజన నాణ్యతను పరిశీలించాలన్నారు. అకాడమిక్ విషయాలపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. డీఈవో ప్రేమకుమార్, విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.