Vizianagaram

News November 6, 2024

VZM: ఎన్నికల నియమావళి అమలుకు బృందాల ఏర్పాటు

image

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంగా విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కోసం అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించినట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. మున్సిపల్ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, MRO, MPDO, SI సభ్యులుగా ఉంటారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో  MRO, MPDO, ఎస్ఐ ఈ బృందంలో సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు.

News November 5, 2024

VZM: సింగిల్ విండో ద్వారా రాజకీయ పార్టీలకు అనుమతులు

image

విజయనగరం జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి రాజకీయ పార్టీల అభ్యర్థులకు సింగిల్ విండో ద్వారా అవసరమైన అనుమతులు మంజూరు చేయనున్నట్టు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అంబేడ్కర్ వెల్లడించారు. ఈ సింగిల్ విండో సెల్‌కు నోడల్ అధికారిగా ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఎల్.జోసెఫ్ వ్యవహరిస్తారని, బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రదర్శనల నిర్వహణకు అనుమతులు ఆయనే ఇస్తారని చెప్పారు.

News November 5, 2024

VZM: టెట్ టాపర్లకు కలెక్టర్ అభినందనలు

image

టెట్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపి, రాష్ట్ర‌స్థాయిలో మొద‌టి, రెండ‌వ ర్యాంకులను సాధించిన విద్యార్థినుల‌ను విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ అభినందించారు. టెట్‌లో జిల్లాకు చెందిన కోండ్రు అశ్వ‌ని 150/150 మార్కులను, దాస‌రి ధ‌న‌ల‌క్ష్మి 149.99 మార్కుల‌ను సాధించి రాష్ట్ర‌స్థాయిలో ప్ర‌ధ‌మ‌, ద్వితీయ స్థానంలో నిలిచారు. అలాగే 149.56 మార్కుల‌ను సాధించిన‌ దేవ హారికకు అభినందనలు తెలిపారు.

News November 5, 2024

TET RESULTS: మన విజయనగరం అమ్మాయికి 150/150 మార్కులు

image

టెట్‌ ఫలితాల్లో విజయనగరం అమ్మాయి కొండ్రు అశ్విని ఎస్జీటీ(పేపర్1-ఏ)లో 150కి 150 మార్కులు సాధించి ఏపీ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఆటో డ్రైవర్ అయిన శంకర్రావు, తల్లి వెంకటలక్ష్మి ఆమె సాధించిన మార్కుల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మంచి టీచర్‌గా మారి పిల్లలను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆమె తెలిపింది. వీటి అగ్రహారానికి చెందిన ధనలక్ష్మి 149.99/150, చీపురుపల్లికి చెందిన హారిక 149.46/150 మార్కులు సాధించారు.

News November 5, 2024

ఆర్డీవో కార్యాలయాల్లో కౌంటింగ్ కేంద్రాలు: విజయనగరం కలెక్టర్

image

శాస‌నమండలి ఉప ఎన్నికల‌ పోలింగ్ నిర్వ‌హ‌ణ కోసం పార్వ‌తీపురం, విజ‌య‌న‌గ‌రం ఆర్‌.డి.ఓ. కార్యాల‌యాల్లో పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయనున్నట్లు క‌లెక్ట‌ర్‌ అంబేడ్కర్ తెలిపారు. న‌వంబ‌రు 28న‌ ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 4 వ‌ర‌కు పోలింగ్ జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు డిసెంబరు 1వ తేదీ ఉద‌యం 8 గంట‌ల నుంచి జ‌రుగుతుంద‌న్నారు. డిసెంబ‌రు 2 నాటికి ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్త‌వుతుంద‌న్నారు.

News November 5, 2024

ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఓటర్ల సంఖ్య ఇదే..

image

ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఓటర్లు మొత్తం 727మంది ఉన్నారు. వీరిలో పార్వ‌తీపురం జిల్లాలో 325 మంది ఉండగా, ఇందులో పురుషులు 132, మ‌హిళ‌లు 193 మంది ఉన్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మొత్తం 402 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 239 మంది మ‌హిళా ఓట‌ర్లు, 163 పురుష ఓట‌ర్లు ఉన్నారు. రాజ‌కీయ పార్టీలు ముసాయిదా జాబితాపై త‌మ క్లెయిమ్‌లు, అభ్యంత‌రాల‌ను ఈ నెల 8వ తేదీ లోగా తెలియ‌జేయ‌వ‌చ్చు.

News November 5, 2024

విజయనగరం జిల్లా TOP NEWS TODAY

image

* విజయనగరంలోని పలు ప్రాంతాల్లో రేపు కుళాయిలు బంద్
* గంట్యాడ: 8 మంది అరెస్టు
* ఎమ్మెల్సీ ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా జేసీ ఎస్‌.సేతు మాధ‌వ‌న్
* పార్వతీపురం జిల్లాలో 49 ఆధార్ కేంద్రాలు
* ఎన్నికల నిబంధనలను తప్పక పాటించాలి: కలెక్టర్
* VZM: సంఖ్యాబలంలో వైసీపీనే టాప్..!
* మన్యంలో పెరిగిన చలి తీవ్రత
* ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్లు స్వీకరణ ప్రారంభం
* శైవ క్షేత్రాల్లో కార్తిక శోభ

News November 4, 2024

VZM: ఎమ్మెల్సీ ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా జేసీ

image

శాస‌న‌మండలి స్థానిక సంస్థ‌ల ఉప ఎన్నిక నిర్వ‌హ‌ణకు జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సేతు మాధ‌వ‌న్ రిట‌ర్నింగ్ అధికారిగా వ్య‌వ‌హ‌రించనున్నారు. విజ‌య‌న‌గ‌రం, పార్వ‌తీపురం జిల్లా రెవెన్యూ అధికారులు ఏ.ఆర్‌.ఓ.లుగా వ్య‌వ‌హ‌రిస్తారు. ప్ర‌తి రోజు ఉద‌యం 11 నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌రకు జాయింట్ క‌లెక్ట‌ర్ ఛాంబ‌ర్‌లో నామినేష‌న్లు స్వీక‌రిస్తారు. న‌వంబ‌రు 11న మ‌ధ్యాహ్నం వ‌ర‌కు నామినేష‌న్లు స్వీక‌రిస్తారు.

News November 4, 2024

విజయనగరం జిల్లాలో క్యాంపు రాజకీయాలు.?

image

విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో క్యాంపు రాజకీయాలు తప్పనిసరి అంటూ వైసీపీ అధిష్ఠానం భావిస్తోన్నట్లు సమాచారం. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక లాగే పోలింగ్ రోజు వరకు స్థానిక సంస్థల ఓటర్లను వివిధ ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

News November 4, 2024

దీపావళితో రాష్ట్రంలో వెలుగులు నిండాయి: మంత్రి

image

అల్లూరి జిల్లాలో లక్షా యాభై వేల మంది లబ్ధిదారులకు దీపం పథకం ద్వారా ఉచితంగా మూడు గ్యాస్ సిలెండర్లు ఇస్తున్నట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. పాడేరు మండలం, బంగారుమెట్ట గ్రామంలో దీపం-2.0 కార్యక్రమంలో మంత్రి పాల్గొని, లబ్ధిదారులకు గ్యాస్ సిలెండర్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దీపావళితో రాష్ట్రంలో వెలుగులు నిండాయని అన్నారు.