Vizianagaram

News September 22, 2025

VZM: తీవ్రంగా గాయపడిన యువకుడి మృతి

image

అనంతగిరి మండలంలో డముకు వ్యూ పాయింట్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు మృతి చెందాడు. విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన కిషోర్ (32)అనే యువకుడు అరకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి స్కూటీపై వస్తుండగా అదుపు తప్పి బోల్తా పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు మృతి చెందాడు.

News September 22, 2025

కలెక్టరేట్లో నేడు పీజీఆర్ఎస్: కలెక్టర్

image

విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం PGRS జరుగుతుందని కలెక్టర్ రామ సుందర రెడ్డి ఆదివారం తెలిపారు. తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చని అన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్‌ను కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News September 21, 2025

విజయనగరంలో ఘనంగా గురజాడ జయంతి

image

విజయనగరం జిల్లా కేంద్రంలో గురజాడ వెంకట అప్పారావు జయంతి ఆదివారం ఘనంగా నిర్వహించారు. గురజాడ నివాసంలో ఆయన విగ్రహానికి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లా, రామ్ సుందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలుగు వారికి ఖ్యాతి తెచ్చిన గురజాడ అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.

News September 21, 2025

విజయనగరంలో కేజీ చికెన్ రూ.200

image

సండే వచ్చిందంటే చాలు కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. ఆర్థిక పరిస్థితిని భట్టి కొందరు మటన్ తెచ్చుకుంటే మరికొందరు చికెన్, చేపలతో సండే విందును కంప్లీట్ చేస్తుంటారు. అయితే విజయనగరంలో మటన్ కేజీ రూ.900 వరకు పలుకుతుండగా. చికెన్ (స్కీన్) రూ.200, (స్కీన్ లెస్) రూ.220, ఫిష్ రూ.170 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.

News September 21, 2025

అతిధి ప్రోటోకాల్ సక్రమంగా చూడాలి: మంత్రి

image

పైడితల్లి అమ్మవారి పండగ సందర్భంగా విజయనగరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అమ్మవారి పండగ ప్రతి ఒక్కరి మదిలో మధుర స్మృతిగా నిలిచిపోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం అమ్మవారి పండగ, ఉత్సవ ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి సమీక్షించారు. నగరమంతా సుందరీకరణ చేయాలని, రహదారుల పై గుంతలు లేకుండా చూడాలని, అతిధుల పట్ల ప్రొటోకాల్ సక్రమంగా చూడాలని అధికారులను ఆదేశించారు.

News September 21, 2025

ఎస్.కోట: పిడుగుపాటుతో మహిళ మృతి

image

ఎస్.కోట మండలంలో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి పిడుగుపడి సింబోయిన చెల్లమ్మ అనే గిరిజన మహిళ మృతి చెందింది. ఎస్.కోట రైల్వే స్టేషన్ వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ సమీపంలో 15 సంవత్సరాలుగా భర్త కొత్తయ్యతో కలిసి పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుంది. శనివారం పొలానికి వెళ్లిన ఆమె రాత్రి అయినా తిరిగిరాకపోవడంతో భర్త వెళ్లి చూడగా పాకలో చనిపోయి ఉంది. సాయంత్రం పిడుగు పడి మృతి చెందినట్లు గుర్తించారు.

News September 21, 2025

VIPలకు ఒక్క నిమిషమే సమయం: కలెక్టర్

image

VIPలను గర్భగుడిలో ఒక్క నిమిషం కన్నా ఎక్కువ కాలం ఉండకుండా త్వరగా పంపడం వలన సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడవచ్చని కలెక్టర్ రామ సుందర రెడ్డి అభిప్రాయపడ్డారు. పైడిమాంబ ఉత్సవ ఏర్పాట్లుపై జరిగిన సమావేశంలో పలు సూచనలు అందజేశారు. ప్లాస్టిక్ వినియోగం లేకుండా చూడాలని, చెత్తను వెంట వెంటనే తొలగించి పరిశుభ్రంగా ఉండేలా చూడాలని మున్సిపల్ కమీషనర్‌కు సూచించారు. గుంతలు పూడ్చాలని ఆదేశించారు.

News September 20, 2025

వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎం&హెచ్ఓ

image

కలరా వంటి జలమూల వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.జీవనరాణి శనివారం సూచించారు. విరేచనాలు, వాంతులు, శరీర నిస్సత్తువ, డీహైడ్రేషన్ లాంటి లక్షణాలు గమనించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కలుషిత నీరు, కలుషిత ఆహారం వల్లే ఈ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయని, కాబట్టి మరిగించిన లేదా ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు.

News September 20, 2025

VZM: ‘గంజాయిపై ఉక్కుపాదం మోపాం’

image

అందరి సహకారం, సమన్వయంతో జిల్లాను రాష్ట్రంలో అన్ని విభాగాల్లోను అగ్రగామిగా నిలిపామని విజయనగరం పూర్వ ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. స్థానిక పోలీస్ పరేడ్‌లో శనివారం వీడ్కోలు కార్యక్రమం జరిగింది. గంజాయి మూలాలను సమూలంగా నాశనం చేశామని, గంజాయి అక్రమ రవాణకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసి, వారి ఆస్తులను కూడా అటాచ్ చేశామన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయడం వలనే ఇది సాధ్యమైందన్నారు.

News September 20, 2025

విజయనగరంలో ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు శనివారం నిర్వహించారు. విజయనగరం పట్టణంలో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా పచ్చ జెండా ఊపి స్వచ్ఛాంధ్ర ర్యాలీను ప్రాంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజారోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.