Vizianagaram

News May 8, 2024

స్వీప్ కార్య‌క్ర‌మంలో భాగంగా బైక్ ర్యాలీ

image

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌తీఒక్క‌రూ ఓటు వేసి, జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచాల‌ని జిల్లా ఎన్నిక‌ల సాధార‌ణ ప‌రిశీల‌కులు త‌లాత్ ప‌ర్వేజ్ ఇక్బాల్ రోహిల్లా పిలుపునిచ్చారు. స్వీప్ కార్య‌క్ర‌మంలో భాగంగా బుధ‌వారం విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వ‌హించి, ఓటుహ‌క్కు వినియోగంపై అవగాహ‌న క‌ల్పించారు. క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ప‌రిశీల‌కులు స్వ‌యంగా మోటార్ సైకిల్ నడిపి ర్యాలీలో పాల్గొన్నారు.

News May 8, 2024

VZM: చంద్రబాబు సభ ఏర్పాట్ల పరిశీలన

image

గురువారం చీపురుపల్లిలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో బహిరంగ సభ స్థలం వద్ద జరుగుతున్న ఏర్పాట్లును విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున బుధవారం పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున వెంట కిమిడి సూరప నాయుడు, మొండి దివాకర్, తదితరులు పాల్గొన్నారు.

News May 8, 2024

రేపు విజయనగరం జిల్లాకు చంద్రబాబు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా కురుపాం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నట్లు టీడీపీ నియోజకవర్గ నాయకులు తెలిపారు. ఉదయం 9 గంటలకు సాయిబాబా గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుని.. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వచ్చి రావాడ జంక్షన్ వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని వెల్లడించారు. అనంతరం చీపురుపల్లిలో జరిగే రోడ్ షోలో పాల్గొనున్నారు. 

News May 8, 2024

మన్యం: ‘సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం’

image

సాధారణ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రమోద్ కుమార్ మెహర్డ అన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సూక్ష్మ పరిశీలకుల ఓరియంటేషన్ ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని మంగళ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ రహస్యంగా, ప్రశాంతంగా జరగాలని అన్నారు.

News May 7, 2024

VZM: విద్యాహక్కు చట్టం కింద 25 వేల సీట్లు భర్తీ..కేసలి అప్పారావు

image

రాష్ట్రంలోని ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో అర్హులైన 25,125 మంది పిల్లలకు విద్యాహక్కు చట్టం కింద ఉచితంగా ప్రవేశాలు కల్పించినట్లు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా వారికి ఎటువంటి ఫీజులు వసూలు చేయకుండా ప్రవేశాలు కల్పించాలన్నారు. ప్రవేశాలపై ఇబ్బందులు ఎదుర్కొంటే apscpcr2018@gmail.comకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

News May 7, 2024

విజయనగరం జిల్లాలో ప్రారంభమైన హోమ్ ఓటింగ్

image

జిల్లాలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. పోలింగ్ కేంద్రాల‌కు వ‌చ్చి ఓటు వేయ‌డానికి అవ‌కాశం లేని 85 ఏళ్లు పైబ‌డిన వ‌యో వృద్దులు, 40 శాతం విక‌లాంగ‌త్వం దాటిన విభిన్న ప్ర‌తిభావంతులు త‌మ ఇంటివ‌ద్ద‌నే ఓటు వేసే అవ‌కాశాన్ని ఎన్నిక‌ల క‌మిష‌న్‌ ఈ ఏడాది కొత్త‌గా అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. వీరి ఇళ్ల‌కు వెళ్లి ఓటు తీసుకొనే ప్రక్రియ సెక్టార్ అధికారుల పర్యవేక్షణలో మంగళవారం ప్రారంభించారు.

News May 7, 2024

అభివృద్ధి పథంలో విజయనగరం: సీఎం జగన్

image

ఈరోజు ఇచ్ఛాపురంలో జరుగుతన్న సిద్ధం సభలో CM జగన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. సాలూరులో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కురుపాంలో ట్రైబుల్ ఇంజినీరింగ్ కాలేజీ, పార్వతీపురం, విజయనగరం ప్రాంతాలలో మెడికల్ కాలేజీలు నిర్మించామన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉరుకులు పరుగులతో నిర్మాణమవుతుందన్నారు.

News May 7, 2024

REWIND: విజయనగరంలో 1,797 మంది నోటా బటన్ నొక్కేశారు..!

image

ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు నచ్చని సందర్భంలో NOTAకు ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ 2013లో అవకాశం ఇచ్చింది. 2019 ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గంలో 1,797(1.09శాతం) మంది నోటా బటన్ నొక్కేశారు. మొత్తం పది మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. ఆరుగురు అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పోలై 4వ స్థానంలో నిలిచింది. మరి మీరెప్పుడైనా నోటాకు ఓటు వేశారా?

News May 7, 2024

విజయనగరం: ఒకే మండలం.. రెండు నియోజకవర్గాలు

image

జామి మండలానికి ఓ ప్రత్యేకత ఉంది. మండల వ్యాప్తంగా 27 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. వీటిలో 13 పంచాయతీలు శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోనూ, మిగిలిన మరో 14 పంచాయతీలు గజపతినగరం నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. దశాబ్దాల కాలం నుంచి ఈ మండలానికి శృంగవరపుకోట, గజపతినగరం నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు బాధ్యత వహిస్తూ వస్తున్నారు.

News May 7, 2024

విజయనగరంలో నేడు నారాలోకేష్ యువగళం సభ

image

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు జిల్లాకు వస్తున్నారు. విజయనగరంలోని అయోధ్య మైదానంలో మంగళవారం మధ్యాహ్నం జరిగే యువగళం సభకు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున యువత, నిరుద్యోగులను ఆహ్వానిస్తున్నారు. మొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లలో లోకేష్ ముఖా ముఖీ మాట్లాడతారు. తొలుత వైసీపీ పాలనలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రసంగిస్తారు

error: Content is protected !!