India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం జిల్లాలో ఎన్నికల హీట్ పెరిగింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రధాన పార్టీ అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అభ్యర్థుల ఎంపిక మొదలు.. ఎలక్షన్ ప్రచారం వరుకు ఆయా పార్టీల అభ్యర్థులు ఐవీఆర్ఎస్ ద్వారా ముమ్మర ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గంట గంటకు ఆయా పార్టీలకు మద్దతు కోరుతూ ప్రజలకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. తరుచూ వస్తున్న ఫోన్ కాల్స్తో విసుగెత్తిపోతున్నామని ప్రజలు వాపోతున్నారు.
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నిర్వహణలో భాగంగా ఆయా అసెంబ్లీ నియోజక వర్గంలో ఏర్పాటు చేసే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి అవసరమైన తాగునీరు, అల్పాహారం, భోజనం వంటి వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని చెప్పారు.
విజయనగరంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ తరుణంలో ఇరు పార్టీల నేతలు ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్ దాఖలు చేయగా, నేడు టీడీపీ అభ్యర్థి అధితి గజపతిరాజు నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో ఆమె తండ్రి, మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో అతను ఎమ్మార్వో ఆఫీస్ బయట ఉన్న చెట్టు కింద సేదతీరారు.
విజయనగరం దిశ మహిళా పోలీసు స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష పడింది. పూసపాటిరేగ మండలం కృష్ణాపురానికి చెందిన జి.రాంబాబు(27)పై 2021లో పోక్సో కేసు నమోదయ్యింది. ఈ మేరకు విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి ఏడేళ్లు జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించారని దిశా స్టేషన్ ఇన్ ఛార్జ్ డీఎస్పీ డి.విశ్వనాథ్ తెలిపారు.
ఉత్తరాంధ్రపై ప్రధాన పార్టీల అధ్యక్షులు ఫోకస్ పెంచారు. సోమ, మంగళవారాల్లో చంద్రబాబు S.కోట, గజపతినగరం సభల్లో పాల్గొనగా.. నిన్న చెల్లూరులో జరిగిన మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగించారు. నేడు నెల్లిమర్ల, విజయనగరం నియోజకవర్గాల్లో జరిగే సభల్లో చంద్రబాబుతోపాటు పవన్ కల్యాణ్ పాల్గోనున్నారు. దీంతో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొంటోంది. మరి మీ మద్దతు ఎవరికో కామెంట్ చెయ్యండి..
ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు విజయనగరం జిల్లాలో చంద్రబాబు, పవన్కల్యాణ్ పర్యటించనున్నారు. డెంకాడ మండలం సింగవరం వద్ద సా.4 గంటలకు ప్రజాగళం-వారాహి విజయభేరి సభలో వారు పాల్గొంటారు. సభ జరిగే ముందు సింగవరం వద్ద రోడ్షో నిర్వహిస్తారు. అనంతరం విజయనరం కలెక్టర్ ఆఫీస్ వద్ద ప్రజాగళం సభలో వారు ప్రసంగించనున్నారు. వీరి పర్యటన నిమిత్తం చందకపేట వద్ద రెండు హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు.
విజయనగరంలోని పూల్ బాగ్ లో ఉన్న ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రధానాచార్యుడు మహేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 38 సీట్లు ఉన్నాయన్నారు. 40 శాతం అంధత్వం కలిగిన 6 నుంచి 14 ఏళ్లలోపు బాల, బాలికలు అర్హులన్నారు. ఉచిత వసతి, పౌష్టికాహారం, ఆధునిక బ్రెయిలీ సామగ్రితో ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 13న జరిగే పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్టు జిల్లా ఉప కార్మిక కమిషనర్ ఎన్.సుబ్రహ్మణ్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ దుకాణాలు, సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా సెలవు ప్రకటించినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు దుకాణదారులు, వివిధ సంస్థల యాజమాన్యాలకు ఆదే శాలు జారీ చేశామన్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో విజయనగరం ఆర్టీసీ డిపోలోని కొన్ని బస్సులను ఆ సభకు తరలించారు. దీంతో కాంప్లెక్స్కి వచ్చిన ప్రయాణికులు వెనుతిరుగుతున్నారు. కనీసం ప్రయాణికుల కోసం కొన్ని బస్సులనైనా ఉంచకపోవడంతో గ్రామీణ ప్రాంతాలకు, పక్క జిల్లాలకు వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాల్లో ఎక్కువ డబ్బులు చెల్లించి వెళ్లాల్సి వస్తుందని మండిపడుతున్నారు.
➤ అభ్యర్థి పేరు: బొత్స ఝాన్సీ
➤ చరాస్తులు: రూ.4.75 కోట్లు
➤ స్థిరాస్తులు: రూ.4.46 కోట్లు
➤ అప్పులు: రూ.2.32కోట్లు
➤ భర్త బొత్స పేరిట చరాస్తులు: రూ.3.78కోట్లు
➤ భర్త పేరిట స్థిరాస్తులు: రూ.6.75 కోట్ల విలువైన భవనాలు,భూములు
➤ భర్త పేరిట అప్పులు: రూ.1.92కోట్లు
➤ కేసులు: లేవు
➤➤ఆమెకు 325 తులాల బంగారం, రెండు కార్లు.. భర్త పేరిట 31 తులాల బంగారు ఆభరణాలు, ఒక కారు ఉన్నట్లు అఫడివెట్ లో పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.