Vizianagaram

News April 24, 2024

విజయనగరం: చెల్లూరులో సీఎం జగన్ సభ

image

సీఎం జగన్ ఈరోజు ఉ.9 గంటలకు ఎంవీవీ సిటీ నుంచి బయలుదేరతారు. విశాఖలోని మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుని కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత బొద్దవలస మీదుగా సా. 3.30 గంటలకు చెల్లూరు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలసలో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారని వైసీపీ నాయకులు తెలిపారు.

News April 24, 2024

బొత్స డ్రామాలాడి ఇదంతా చేశారు: చంద్రబాబు

image

ఎస్.కోట నియోజకవర్గంలో నిన్న జరిగిన సమావేశంలో బొత్సపై చంద్రబాబు మండిపడ్డారు. విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్న ఎస్.కోట నియోజకవర్గ ప్రజలు విశాఖపైనే ఆధారపడతారని..కానీ ఈ నియోజకవర్గాన్ని విశాఖలో కలపకుండా విజయనగరంలో ఉంచారని అన్నారు. ఇదంతా బొత్స డ్రామాలాడి చేశారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి రాగానే ఎస్.కోటను విశాఖ జిల్లాలో కలుపుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

News April 24, 2024

బేబినాయన చరాస్తులు రూ.3,1953,154

image

➤ నియోజకవర్గం: బొబ్బిలి
➤ అభ్యర్థి: బేబినాయన
➤ పార్టీ: టీడీపీ
➤ విద్యార్హత: డిగ్రీ
➤ చరాస్తులు: రూ.3,19,53,154
➤ స్థిరాస్తులు: రూ.1,00,51,100
➤ భార్య పేరిట చరాస్తులు: రూ.71,99,116
➤ భార్య పేరిట స్థిరాస్తులు: రూ.33,77,500
➤ అప్పులు: రూ.5.70కోట్లు(బ్యాంకుల్లో)
➤ కేసులు: 1

News April 24, 2024

పార్వతీపురం జిల్లా టాపర్‌గా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి

image

పార్వతీపురం మన్యం జిల్లా టాపర్‌గా పార్వతీపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని నిలిచింది. 591 మార్కులతో పార్వతిపురం టిఆర్ఎస్ మున్సిపల్ పాఠశాల విద్యార్థిని కేబి గౌతమి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. ప్రభుత్వం విద్యాశాఖలో అమలు చేసిన విప్లవాత్మక మార్పులు కారణంగా కార్పొరేట్ పాఠశాలలకు గట్టి పోటీని ఇస్తున్నట్లు ఆమె తెలిపారు.

News April 24, 2024

కురుపాం: స్వతంత్ర అభ్యర్థిగా ట్రాన్స్‌జెండర్ నామినేషన్

image

కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి ట్రాన్స్ జెండర్ అడ్డాకుల గీతా రాణి సమర్పించారు. సోమవారం కురుపాం తాహశీల్దార్ కార్యాలయంలో ట్రాన్స్‌జెండర్ గీతా రాణి మూడు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్న తాము ఎన్నికలలో పోటీ చేసి తమ బలాన్ని నిరూపించుకోవాలన్నదే లక్ష్యం అన్నారు.

News April 24, 2024

గజపతినగరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మార్పు

image

గజపతినగరం అభ్యర్థిగా కురిమి నాయుడు స్థానంలో దోలా శ్రీనివాస్‌ను కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించింది. అటు బొబ్బిలి అభ్యర్థిగా మరిపి విద్యాసాగర్, నెల్లిమర్ల నుంచి ఎస్.రమేశ్ కుమార్ బరిలో ఉంటారని కాంగ్రెస్ తెలిపింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.

News April 24, 2024

పది ఫలితాలు గొప్ప సంతృప్తినిచ్చాయి: కలెక్టర్

image

రెండో ఏడాది జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం పట్ల జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. “నాకు మొదటి ర్యాంక్ వచ్చినంత ఆనందంగా ఉందని, గొప్ప సంతృప్తిని ఇచ్చింది” అంటూ పేర్కొన్నారు. ఇది అందరి సమష్టి కృషి ఇందులో భాగస్వామ్యం అయిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు అందరికీ ఈ విజయం అంకితమన్నారు. ఇదే స్ఫూర్తి భవిష్యత్తులోనూ కొనసాగి జిల్లా ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

News April 24, 2024

గజపతినగరంలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. లారీ పక్క నుంచి స్కూటీపై వెళ్తూ అదుపు తప్పడంతో లారీ వెనుక చక్రం కింద పడి ఘటనా స్థలంలోనే మరణించాడు. గజపతినగరం ఎస్సై యు.మహేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 24, 2024

ఉమ్మడి విజయనగరం జిల్లాలలో బాలికలదే పైచేయి

image

➤ పార్వతీపురం మన్యం జిల్లాలో 5,099 మంది బాలురు పరీక్ష రాయగా.. 95.33శాతంతో 4,861 మంది పాసయ్యారు. 5,344 మంది బాలికలు పరీక్ష రాయగా 97.36శాతంతో 5,203 మంది ఉత్తీర్ణత సాధించారు.
➤ విజయనగరం జిల్లాలో 11,868 మంది బాలురు పరీక్ష రాయగా.. 89.91శాతంతో 11,081 మంది పాసయ్యారు. 11,822 మంది బాలికలు పరీక్ష రాయగా 93.73శాతంతో 11,081 మంది ఉత్తీర్ణత సాధించారు.

News April 24, 2024

పదో తరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం ఫస్ట్

image

➤ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా వరుసగా రెండోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 10,443 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 96.37%తో 10,064 మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 87.47 శాతం మంది పాస్ అయ్యారు.
➤ విజయనగరం జిల్లాలో మొత్తం 23,690 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 91.82 శాతంతో 21,752 మంది ఉత్తీర్ణతతో రాష్ట్రంలో ఐదో స్థానంలో నిలిచింది. గతేడాది 76.66% మంది పాసయ్యారు.

error: Content is protected !!