Vizianagaram

News April 22, 2024

ఉమ్మడి విజయనగరం జిల్లాలో నేడు నామినేషన్లు వేసేది వీరే

image

➤ బెల్లాన చంద్రశేఖర్(వైసీపీ): విజయనగరం ఎంపీ
➤ బేబినాయన(టీడీపీ): బొబ్బిలి ఎమ్మెల్యే
➤ కొత్తపల్లి గీత(బీజేపీ): అరకు ఎంపీ
➤ తోయక జగదీశ్వరి(టీడీపీ): కురుపాం ఎమ్మెల్యే
➤ కూర్మి నాయుడు(కాంగ్రెస్): గజపతినగరం ఎమ్మెల్యే
➤ గీతారాణి(భారత్ ఆదివాసీ పార్టీ): కురుపాం ఎమ్మెల్యే
➤➤ వీరితో పాటు మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులు ఈరోజు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

News April 22, 2024

నేడు విజయనగరం జిల్లాకు చంద్రబాబు

image

ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఎస్.కోటలో పర్యటించనున్నారు. హెలికాప్టర్‌లో ఎస్.కోట చేరుకుని దేవీగుడి కూడలి వద్ద జరిగే సభలో పాల్గొంటారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా అటుగా వచ్చే వాహనాలను వేరే మార్గంలో మళ్లించాలని బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీనివాసరావు ఆదేశించారు. ఇద్దరు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 20 మంది ఎస్సైలు, 500 మంది పోలీసులతో భద్రతను పర్యవేక్షించనున్నారు.

News April 22, 2024

VZM: మూడు రోజుల్లో జిల్లాకు ముగ్గురు అధినేతలు

image

విజయనగరంలో పొలిటికల్ హీట్ పెరగనుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరుసగా మూడు రోజులు మూడు ప్రధాన పార్టీల అధ్యక్షులు జిల్లాలో పర్యటించనున్నారు. చంద్రబాబు ఈరోజు ఎస్.కోట, రేపు గజపతినగరంలో నియోజకవర్గంలో పర్యటిస్తారు. 23న సాయంత్రం 4 గంటలకు విజయనగరం జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రవేశించనుంది. 24న నెల్లిమర్ల, విజయనగరం జిల్లాలో జరిగే ప్రజాగళం సభలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాల్గొంటారు.

News April 22, 2024

సమ్మర్ ఆక్టివిటీస్ పుస్తకాన్ని ఆవిష్కరించిన డీఈఓ

image

రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులతో కమిషనర్ సూచనలతో APSSTF వారు సోషల్ స్టడీస్ సమ్మర్ యాక్టివిటీస్ పుస్తకాన్ని ప్రచురించారు. ఆదివారం విజయనగరం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ ఎన్.ప్రేమ్ కుమార్, ఇతర సిబ్బందితో కలసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు వేసవి సెలవుల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా అత్యంత ఆకర్షనీయంగా పుస్తకాన్ని రూపొందించారని తెలిపారు.

News April 21, 2024

విజయనగరం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను

image

విజయనగరం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీనును పార్టీ ప్రకటించింది. గజపతినగరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గతంలో ఆయన పోటీచేశారు. ఆయన సేవలను అధిష్ఠానం గుర్తించి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో కాంగ్రెస్ అభిమానుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించాలని శ్రీను కోరారు.

News April 21, 2024

విజయనగరం జిల్లాలో చంద్రబాబు సభ  

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 23న టీడీపీ అధినేత చంద్రబాబు విజయనగరం జిల్లాకు రానున్నారు. ఆరోజు ఉదయం బొండపల్లి మండలంలో మహిళా ప్రజాగళం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. సభకు బొండపల్లి జాతీయ రహదారి పక్కన గల మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ ప్రభాకర్, ఎస్.ఐలు లక్ష్మణరావు, మహేశ్ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. 

News April 21, 2024

విజయనగరం: ముగిసిన మోడల్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్ష

image

విజయనగరం జిల్లాలో ఆదివారం 6వ తరగతి మోడల్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రశాంతంగా ముగిసిందని జిల్లా విద్యా శాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు. జిల్లాలో పలు పరీక్షా కేంద్రాలను డిఈఓ పరిశీలించారు. జిల్లాలో 14 సెంటర్లలో 3,669మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 3,167 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 502 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ పేర్కొన్నారు.

News April 21, 2024

VZM: క్రికెట్ బెట్టింగ్‌లతో అప్పులపాలై యువకుడి ఆత్మహత్య

image

క్రికెట్ బెట్టింగ్‌లకు బానిసై అప్పులు పాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెంటాడ మండలంలో జరిగింది. పెద మేడపల్లి గ్రామానికి చెందిన కిల్లాడ ఈశ్వరరావు గతంలో రూ.4 లక్షలు వరకు బెట్టింగ్‌లో ఓడిపోయాడని, ఇటీవల మళ్ళీ రూ.లక్ష వరకు బకాయి పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు, వ్యసనాలకు బానిసై విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై దేవి తెలిపారు.

News April 21, 2024

తాటిపూడి APRJC లెక్చరర్ సూసైడ్!

image

అనకాపల్లిలో శనివారం ఓ మహిళ మృతిచెందింది. మృతురాలి తండ్రి నూకరాజు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి శారదా నగర్ ముత్రాసి కాలనీలో నివాసం ఉంటున్న APRJC లెక్చరర్ ఉమాదేవి(32), శనివారం అర్ధరాత్రి తన ఇంట్లో కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విజయనగరం జిల్లాలో లెక్చరర్‌గా ఈమె పనిచేస్తున్నారు. 2021లో వివాహమైన ఉమాదేవికి భర్తతో గొడవలు ఉన్నాయని ఆయన తెలిపారు.

News April 21, 2024

మూడోరోజు ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 మంది నామినేషన్

image

మూడో రోజున శనివారం 9 మంది నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీర భద్ర స్వామి, యుగతులసి పార్టీ నుంచి ఒక నామినేషన్ వేశారు. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన కుమారుడు బొత్స సందీప్ వేశారు. నెల్లిమర్లలో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు. బొబ్బిలిలో కాంగ్రెస్ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు. అరకు ఎంపీకి పి రంజిత్ కుమార్, కురుపాంలో స్వతంత్ర అభ్యర్థి వేశారు.

error: Content is protected !!