Vizianagaram

News April 21, 2024

కోలగట్ల వీరభద్రస్వామి అప్పు ఎంతో తెలుసా!

image

☞ అభ్యర్థి: కోలగట్ల వీరభద్రస్వామి
☞ నియోజకవర్గం: విజయనగరం
☞ పార్టీ: వైసీపీ
☞ చరాస్తులు: రూ.6.48
☞ కేసులు: 2
☞ బంగారం: 1KG
☞ స్థిరాస్తి: రూ.15.34
☞ అప్పులు: రూ.7.49 కోట్లు
☞ భార్య పేరిట చరాస్తులు: రూ.2.97 కోట్లు
☞ భార్య పేరిట స్థిరాస్తి: రూ.4.60 కోట్లు
☞ భార్య పేరిట బంగారం: 2KG
☞ కార్లు: లేవు
➠ కోలగట్ల వీరభద్రస్వామి శనివారం నామినేషన్ దాఖలు చేయగా, ఆఫిడవిట్‌లో ఈ వివరాలను వెల్లడించారు.

News April 21, 2024

బొండపల్లి: ఆరుగురిపై బైండోవర్

image

అక్రమంగా మద్యం విక్రయిస్తూ పలుమార్లు పట్టుబడిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామని తహశీల్దార్ హనుమంతురావు తెలిపారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఎస్ఈబీ ఎస్సై ఆర్.రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో మండలంలోని పలుగ్రామాలకు చెందిన ఆరుగురిపై సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బైండోవర్ చేశారు. వీరంతా గతంలో పలుమార్లు మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డారని, వీరిపై నిరంతర నిఘా ఉంటుందని పేర్కొన్నారు.

News April 21, 2024

ఎంపీగా 22న కొత్తపల్లి గీత నామినేషన్

image

అరుకు ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత 22న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమానికి కూటమి నేతలు భారీగా వచ్చి విజయవంతం చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో గీత తప్పకుండా విజయం సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.  

News April 20, 2024

22తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలి: కలెక్టర్ నాగలక్ష్మి

image

ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ పొందేందుకు దరఖాస్తులను 22వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అందజేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లను పొందేందుకు అర్హత ఉన్నవారికి సంబంధిత దరఖాస్తు ఫారాలను అందజేయడం జరిగిందన్నారు. వాటిని పూర్తిగా నింపి సోమవారం సాయంత్రంలోగా సంబంధిత నియోజకవర్గ కేంద్ర తహశీల్దార్ కార్యాలయంలో అందజేయాలన్నారు.

News April 20, 2024

గరివిడి: వేధింపులు భరించలేక భర్తను చంపిన భార్య 

image

గరివిడి మండలంలో శుక్రవారం రాత్రి దారుణం జరిగింది. వెదుళ్లవలస గ్రామానికి చెందిన అప్పన్న(30) తాగుడుకు బానిసై నిత్యం భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో వేధింపులు భరించలేని భార్య దేవి, మామ సన్యాసిరావుతో కలిసి భర్తను ఉరి వేసి చంపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టు మార్టం నిమిత్తం బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

News April 20, 2024

మోడల్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: డీఈఓ

image

విజయనగరం జిల్లాలో ఆదివారం జరగనున్న 6వ తరగతి మోడల్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈఓ ప్రేమ్ కుమార్ శనివారం తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 14 సెంటర్లలో 3,669 మంది పరీక్షలు రాయనున్నారన్నారు. ఉదయం 10గం నుంచి 12 వరకు పరీక్ష ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రనికి 30 నిమిషాల ముందే చేరుకోవాల్సి ఉందని తెలిపారు. https://cse.ap.gov.in/లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.

News April 20, 2024

పార్వతీపురం: మే 11న జాతీయ లోక్ అదాలత్

image

వచ్చే నెల 11న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు రెండో అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు తెలిపారు. శనివారం కోర్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కోర్ట్ ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమంలో కక్షిదారులు పాల్గొని.. తమ కేసులను రాజీ చేసుకోవచ్చన్నారు.

News April 20, 2024

బొత్స సత్యనారాయణ ఆస్తుల వివరాలు ఇవే..

image

☞ అభ్యర్థి: బొత్స సత్యనారాయణ
☞ పార్టీ: వైసీపీ
☞ చరాస్తులు: రూ.3.78 కోట్లు
☞ బంగారం: 31 తులాలు
☞ స్థిరాస్తి: రూ.6.75 కోట్లు
☞ అప్పులు: రూ.4.24 కోట్లు
☞ భార్య పేరిట చరాస్తులు: రూ.4.75 కోట్లు
☞ భార్య పేరిట స్థిరాస్తి: రూ.4.46 కోట్లు
☞ భార్య పేరిట బంగారం: 325 తులాలు
➠ బొత్స సత్యనారాయణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయగా, అఫిడవిట్‌లో ఈ వివరాలను వెల్లండించారు.

News April 20, 2024

నెల్లిమర్ల జనసేన అభ్యర్థి ఆస్తి ఎంతంటే..

image

☞ అభ్యర్థి: లోకం నాగమాధవి
☞పార్టీ: జనసేన
☞ విద్యార్హతలు: ఇంజినీరింగ్
☞ కేసులు: లేవు
☞ కుటుంబ ఆస్తి: 894.92 కోట్లు
☞ అప్పులు: లేవు
➠ మాధవి కుటుంబానికి రూ.800 కోట్లకు పైగా విలువైన సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది.
➠ శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన మధవి అఫిడవిట్‌లో ఈ వివరాలను వెల్లడించారు.

News April 20, 2024

వైభవంగా సింహాద్రి అప్పన్న వార్షిక కళ్యాణం

image

సింహాచలం ఆలయంలో సింహాద్రి అప్పన్న వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అప్పన్నవరుడిగా శ్రీదేవి భూదేవి వధువుగా దర్శనమిచ్చారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి కళ్యాణాన్ని జరిపించారు. ఎదురు సన్నాయి ఉత్సవాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఆలయ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు.

error: Content is protected !!