India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెర్లాం మండలం అంట్లవారి గ్రామంలో ఓ వ్యక్తి విద్యుత్ షాక్కు గురై బుధవారం మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోట రామారావు పొలానికి వెళ్తుండగా విద్యుత్ వైర్లను తాకడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. సర్వీస్ వైరు తెగిపడడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఎస్ఐ సాగర్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డెంకాడ మండలంలోని పినతాడివాడలో అల్లు అర్జున్ అభిమానులు వినూత్న రీతిలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. శ్రీ బంగారమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్బంగా మాజీ సీఎం జగన్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు గ్రామంలో వెలిశాయి. “YCP-AA MUTUAL” బ్యానర్స్ అంటూ సామాజిక మాధ్యమాల్లో యువత వీటి ఫొటోలను షేర్ చేస్తున్నారు.

పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వీ.మాధవరెడ్డి తెలిపారు. పార్వతీపురం పోలీస్ మల్టీ ఫంక్షన్ హాల్లో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల నుంచి తరలివస్తున్న సారా రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి ఆదేశించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేయాలన్నారు.

విజయనగరం జిల్లాలో ఉల్లి ధరలు ఘాటెక్కాయి. కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.70 నుంచి 80 పలుకుతున్నాయి. దసరా సమీపిస్తుండగా పెరిగిన ఉల్లి ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పక్షం రోజుల నుంచి క్రమంగా ఉల్లి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. నెల క్రితం కిలో సుమారు రూ.35 లోపే ఉండేవి. పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.

జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ESగా బీ.శ్రీనాథుడుని నియమిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఈయన ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా DEPOగా విధులు నిర్వహించారు. స్పెషల్ ఎంఫోర్స్మెంట్ బ్యూరోను ప్రభుత్వం రద్దు చేయడంతో ఎక్సైజ్ ఈఎస్గా ఈయన బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో పార్వతీపురం ఏఈఎస్గా విధులు నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది.

రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. యూకే, ఆస్ట్రేలియా, అమెజాన్ ఫారెస్ట్ సంస్థ ప్రతినిధులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో అవకాశాలపై చర్చించారు. రైతుల సంక్షేమం, వాతావరణ మార్పుల నియంత్రణ కార్యకలాపాల కోసం చేపట్టాల్సిన కార్యాచరణ అంశాలపై మాట్లాడినట్లు మంత్రి తెలిపారు.

విజయనగరం జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగలనుంది. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స లక్ష్మణరావు జనసేనలో చేరనున్నారు. వచ్చే నెల 3న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవితో మంగళవారం రాత్రి ఆయన భేటీ అయ్యారు. ఆయనతో పాటు నెల్లిమర్ల నియోజవర్గంలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

రెవిన్యూ శాఖలో వివిధ క్యాడర్లకు చెందిన 462 మందిని బదిలీ చేస్తూ విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 462 మందికి బదిలీ జరిగింది. బదిలీలు జరిగిన వారిలో MRO-1, DT -69, సీనియర్ అసిస్టెంట్-50, జూనియర్ అసిస్టెంట్-21, వీఆర్వో గ్రేడ్ I -238, వీఆర్వో గ్రేడ్ II-81, ఒక రికార్డ్ ఆసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినెటర్ ఉన్నారు.

అక్టోబరు 13న విజయనగరం ఉత్సవాల ప్రారంభ ర్యాలీని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభించి, అయోద్యా మైదానం వరకు నిర్వహించాలని కలెక్టర్ అంబేడ్కర్ మంగళవారం తెలిపారు. ఈ ర్యాలీని వివిధ జానపద కళారూపాలతో సుమారు 15వేల మందితో గొప్పగా నిర్వహించాలన్నారు. 13,14 తేదీల్లో 2 రోజులు సాయంత్రం మెగా కల్చరల్ ఈవెంట్ను నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్ పాల్గొన్నారు.

AP మార్క్ ఫెడ్ ఛైర్మన్గా నూతనంగా నియమితులైన నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్ కుర్రోతు బంగార్రాజును విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేటెడ్ పదవులలో సామాన్య కార్యకర్తలకు, యువతకు పెద్ద పీట కూటమి ప్రభుత్వం వేసిందన్నారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.