Vizianagaram

News April 17, 2024

VZM: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

విజయనగరంలోని ఎత్తు వంతెన సమీపంలో ట్రావెల్ బస్సు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గంట్యాడ మండలానికి చెందిన ఎస్ చిమ్మనాయుడు (43) విజయనగరంలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి పని ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, విశాఖ వైపు వెళ్తున్న బస్సు వంతెన వద్ద ఢీకొంది. ప్రమాదంలో చిమ్మనాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News April 17, 2024

విశాఖలో పెన్సిల్ ముల్లుపై శ్రీరాముడి రూపం

image

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకి చెందిన సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేశ్ పెన్సిల్ ముల్లుపై శ్రీరాముడి రూపాన్ని అద్భుతంగా చెక్కారు. ఇప్పటికే గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి, ఎన్నో అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. తాజాగా 6 హెచ్‌బీ పెన్సిల్ ముల్లుపై, 6 గంటల పాటు శ్రమించి 8మి.మీ వెడల్పు, 20మి.మీ పొడవులో శ్రీరాముడి రూపాన్ని చెక్కారు.

News April 17, 2024

జియ్యమ్మవలసలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

image

చినమేరంగి, జియ్యమ్మవలస పోలీస్ స్టేషన్ పరిధిలో గల వివిధ పోలింగ్ కేంద్రాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి ఎన్నికల ప్రవర్తన నియమావళి గూర్చి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమస్యాత్మక గ్రామాలలో ఎన్నికల ప్రశాంతంగా జరుగుటకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు అందించారు.

News April 16, 2024

ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎవరు, ఎక్కడ నామినేషన్ వేస్తారంటే..

image

➤ విజయనగరం MP అభ్యర్థి : VZM కలెక్టర్ ఆఫీసు ➤విజయనగరం MLA: విజయనగరం MRO ఆఫీసు ➤ నెల్లిమర్ల MLA: నెల్లిమర్ల MRO ఆఫీసు ➤ చీపురుపల్లి MLA: చీపురుపల్లి MRO ఆఫీసు ➤ S.కోట MLA: S.కోట MRO ఆఫీస్, ➤గజపతినగరం MLA: గజపతినగరం MRO ఆఫీస్ ➤బొబ్బిలి MLA: బొబ్బిలి MRO ఆఫీస్ ➤ అరకు MP: పార్వతీపురం కలెక్టర్ ఆఫీస్, పార్వతీపురం MLA: పార్వతీపురం MRO ఆఫీసు ➤ సాలూరు MLA: సాలూరు MRO ఆఫీసు ➤ కురుపాం MLA: కురుపాం MRO ఆఫీసు

News April 16, 2024

విజయనగరం రైల్వే స్టేషన్‌లో గంజాయి స్వాధీనం

image

ఎలక్షన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్క్‌లో భాగంగా మంగళవారం విజయనగరం రైల్వే స్టేషన్‌లో విశాఖ జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ కే.వెంకట్రావు నేతృత్వంలో జీఆర్పీ ఎస్ఐ రవివర్మ, సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ప్లాట్ ఫారం నెం-1లో గంజాయిని గుర్తించారు. మహారాష్ట్ర, ఒడిశాకు చెందిన ఇద్దరిని తనిఖీ చేసి.. వారి వద్ద నుంచి 33 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.

News April 16, 2024

ఈనెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ

image

VZM : ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 18వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 18 న ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని, ఆరోజు నుంచీ నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందన్నారు.

News April 16, 2024

పార్వతీపురం: సివిల్స్‌ ఫలితాల్లో 493వ ర్యాంకు

image

సివిల్స్ ఫలితాల్లో పార్వతీపురానికి చెందిన దొనక పృథ్వీ‌రాజ్ 493వ ర్యాంకు సాధించారు. తండ్రి దొనక విజయ్ కుమార్ కురుపాం MEOగా, తల్లి రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. పృథ్వీరాజ్ తన రెండవ ప్రయత్నంలో ర్యాంకు సాధించారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చదివిన యువకుడు.. ఇంటి వద్దే సివిల్స్‌కు సన్నద్ధం అయ్యి ర్యాంకు సాధించారు. ర్యాంకు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

News April 16, 2024

VZM: ఆన్‌లైన్ మోసం.. రూ.14 లక్షలు కోల్పోయిన యువతి

image

తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు ఇస్తామని వచ్చిన మెసేజ్‌కు యువతి మోసపోయిన ఘటన గజపతినగరం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని పురిటిపెంటకి చెందిన ఓ యువతికి తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు ఇస్తామని మెసేజ్ వచ్చింది. నమ్మిన యువతి దశలో వారీగా రూ.14.15 లక్షలు జమ చేసింది. అటు నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో మోసపోయానని గ్రహించి ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు.

News April 16, 2024

విజయనగరం జిల్లా వ్యాప్తంగా 189 మంది వాలంటీర్స్ రాజీనామా

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా సోమవారం 189 మంది వాలంటీర్స్ రాజీనామా చేశారు. రామభద్రపురం, బాడంగి, తెర్లాం, బొబ్బిలి, గుర్ల మండలాల్లో వాలంటీర్స్ రాజీనామా పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. వాలంటీర్స్ రాజీనామాలను ఆమోదించామని ఎంపీడీఓలు తెలిపారు. వ్యక్తి గత కారణాలతో కొందరు రాజీనామా చేయగా, ఎన్నికల కోడ్ పేరుతో తమను దూరంగా ఉంచడం వల్లే రాజీనామా చేశామని మరికొందరు తెలిపారు.

News April 16, 2024

VZM: 15 రోజుల్లోనే విషాదం

image

తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక కూతురు మృతిచెందిన ఘటన పార్వీతీపురం మండలంలో జరిగింది. పెదమరికి గ్రామానికి చెందిన భుజంగరావు (45), ఫాస్ట్‌‌ఫుడ్ సెంటర్ నడిపేవాడు. అతని కుమార్తె రోషిణి (19) తండ్రికి చేదోడుగా ఉండేది. మార్చి 31న భుజంగరావు మృతిచెందాడు. అప్పటి నుంచి సరిగా భోజనం చేయక, నిద్రపోకుండా ఉండిపోయింది. ఆదివారం రాత్రి నీరసంగా ఉందని నిద్రపోయింది. ఎంతకీ లేవకపోవడంతో తల్లి చూడగా అప్పటికే మృతిచెందింది.

error: Content is protected !!